logo

Adilabad: రిమ్స్‌ మెడికల్‌ కళాశాల వద్ద విద్యార్థుల ఆందోళన

ఆదిలాబాద్‌ రిమ్స్‌ మెడికల్‌ కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. బుధవారం అర్ధరాత్రి బయటి వ్యక్తులు క్యాంపస్‌లోకి వచ్చి తమపై దాడి చేసినట్లు వైద్య విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

Updated : 14 Dec 2023 10:27 IST

ఎదులాపురం న్యూస్‌టుడే: ఆదిలాబాద్‌ (Adilabad news) రిమ్స్‌ వైద్య కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. బుధవారం అర్ధరాత్రి బయటి వ్యక్తులు క్యాంపస్‌లోకి వచ్చి తమపై దాడి చేసినట్లు వైద్య విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకొని ఇద్దరికి గాయాలైనట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఓ వైద్యుడితో పాటు వచ్చి తమపై దాడి చేశారన్నారు. ఈ దాడిని ఖండిస్తూ విధులను బహిష్కరించిన వైద్య విద్యార్థులు.. ఇవాళ ఉదయం కళాశాల ఆవరణలో నిరసనకు దిగారు.

అనంతరం ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లి నిరసన తెలిపారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్‌, మరో వైద్యుడు క్రాంతి కుమార్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. గాయపడ్డ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. మరోవైపు పోలీసులు క్యాంపస్‌కు చేరుకొని దీనిపై ఆరా తీశారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భారీగా మోహరించారు. కళాశాల ఆవరణలోకి వచ్చిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని