లక్ష్యానికి మించి ‘ఉపాధి’ పనులు
మండుటెండల్లో ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సంవత్సరం బడ్జెట్్ ప్రణాళికలు మించి పనులు చేశారు. 2023-24లో మొత్తం 36.58 లక్షల పని దినాలు అంచనాతో ప్రణాళికలు రూపొందించారు.
మండుటెండలను లెక్క చేయకుండా కూలీల హాజరు
న్యూస్టుడే, ఆదిలాబాద్ అర్బన్
పనులు పరిశీలిస్తున్న డీఆర్డీఓ సాయన్న
మండుటెండల్లో ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సంవత్సరం బడ్జెట్్ ప్రణాళికలు మించి పనులు చేశారు. 2023-24లో మొత్తం 36.58 లక్షల పని దినాలు అంచనాతో ప్రణాళికలు రూపొందించారు. కూలీలు పనులు చేసేందుకు ముందుకు రావడంతో ఇప్పటికే 41.74 లక్షల పని దినాలు కల్పించారు. జిల్లాలో లక్ష్యానికి మించి 114 శాతంగా నమోదైంది. రాష్ట్రంలో కూలీలకు పనులు కల్పించడంలో జిల్లా రెండో స్థానంలో నిలిచింది. గడిచిన రెండు నెలల్లోనే ఎక్కువ శాతం మంది పనులకు రావడం గమనార్హం. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి జి.సాయన్న ఉపాధి పనులను ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, మండలాల వారీగా కూలీల సంఖ్యను పర్యవేక్షిస్తున్నారు. అయితే కూలీ డబ్బులు చెల్లించడంలో ఆలస్యమవుతున్నా ఈ స్థాయిలో పనితీరు కనబరిస్తే ఎప్పటికప్పుడు డబ్బులు ఖాతాల్లో జమ చేస్తే మరింత మంది కూలీలు పనులు వచ్చేందుకు ఆసక్తి చూపుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రోజుకు సగటు కూలీ రూ.203
గ్రామీణప్రాంతాల్లో కందకాల తవ్వకం, చెరువుల్లో పూడికతీత, వ్యవసాయ భూముల అభివృద్ధి, హరితహారం తదితర పనులు చేపడుతున్నారు. అందరూ దాదాపు ఉదయం 8 గంటలకు క్షేత్రస్థాయికి వెళ్లి 11 గంటల వరకే చాలామంది తిరుగుముఖం పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన దినసరి కూలీ రూ.272 ఉంది. అయితే నిర్దేశిత కొలతల ప్రకారం పనులు చేయకపోవడంతో సగటున రూ.203 వేతనం అందుతోంది. జాబ్కార్డుపై ఎంతమంది సభ్యులున్నా కుటుంబానికి 100 రోజులు పని కల్పించాల్సి ఉంది. జిల్లాలో మొత్తం 1.72 లక్షల జాబ్కార్డులు, 3.46 లక్షల మంది కూలీలు నమోదై ఉన్నా క్రియాశీల జాబ్కార్డులు 1.15 లక్షలు, పనులకు వచ్చే కూలీలు 2.17 లక్షల మందే ఉన్నారు. అందులోనూ కొంతమంది వంద రోజులు పూర్తిగా పనులకు రాకుండా అడపాదడపా వస్తున్నారు. ఇప్పటి వరకు 2,670 కుటుంబాలు సంపూర్ణంగా పని దినాలను వినియోగించుకున్నాయి. రూ.85.95 కోట్ల విలువైన పనులు జరిగాయి. ఇంకా దాదాపు రూ.14కోట్ల డబ్బులు కార్మికుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది.
కూలీలు ముందుకు రావాలి
జి.సాయన్న, డీఆర్డీఓ
ఇతర జిల్లాలతో పోలిస్తే ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధి పనులు చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయ, అటవీ భూములు ఎక్కువగా ఉండటంతో ఎక్కడా లోటు లేకుండా పనులు కల్పించవచ్చు. కూలీలు ముందుకు రావాలి. వేతనాల చెల్లింపుల విషయంలో కొంత ఆలస్యమవుతోంది. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. వచ్చే సంవత్సరం 42 లక్షల పని దినాలు లక్ష్యంగా పెట్టుకున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగేష్ నామినేషన్పై గందరగోళం
[ 27-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానం కోసం దాఖలైన భాజపా అభ్యర్థి గోడం నగేష్ నామపత్రాల పరిశీలనలో గందరగోళం నెలకొంది. -
నీళ్లు లేవు..నీడ లేదు..
[ 27-04-2024]
జిల్లాలో మారుమూల ప్రాంతవాసులకు సరకుల కొనుగోలుకు వారసంతలే దిక్కు. చిన్నా, చితక కుటుంబాలెన్నో వీటిపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. -
బ్యాటింగ్ చేస్తా.. ఓట్లు పట్టేస్తా!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీపార్కు, ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి
[ 27-04-2024]
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
చిన్నారుల ప్రతిభ.. ఆకాశవాణి వేదిక
[ 27-04-2024]
పిల్లలు.. మీలో సహజంగానే ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది కదూ.. కానీ అది ప్రదర్శించడానికి వేదిక కావాలి.. అయితే మీలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం అవకాశాన్ని కల్పిస్తోంది. -
నెట్టింట్లో నేతలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు సాదాసీదాగా సాగే ప్రచారం డిజిటల్ యుగం అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. -
ఎండ వే‘ఢీ’.. చిక్కని ఓటరు నాడీ
[ 27-04-2024]
ఈసారి బరిలో నిలిచిన అభ్యర్థులకు లోక్సభ ఎన్నికలు రోజులు గడుస్తున్న కొద్దీ చెమటలు కక్కిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ వస్తున్న ఎండ తీవ్రత ఒకవైపు, -
పోయిన ఫోను.. దొరుకుతున్నతీరు
[ 27-04-2024]
ఎవరైనా తమ చరవాణిని పోగొట్టుకున్నా, చోరీ అయినా ఇంతకు ముందు దానిపై ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం తమ చరవాణి పోగొట్టుకున్నా, చోరీ అయినా మీసేవా కేంద్రం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. -
ఆస్ట్రేలియా అతిథి!
[ 27-04-2024]
మనదేశ సంప్రదాయాలు, సంస్కృతి.. ఇలా ప్రతీ అంశం విదేశీయులకే కాస్త ఆసక్తే. అందుకే.. ఇక్కడి పద్ధతులను ప్రత్యక్షంగా చూసేందుకు, అందులో భాగమయ్యేందుకు చాలామంది ఉత్సుకత చూపిస్తుంటారు. -
వెండి తెరపై మెరుపులు
[ 27-04-2024]
సినిమాలో అవకాశాలు రావడం చాలా అరుదు. మక్కువ ఉన్నా.. దానిని సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. -
13 ఆమోదం.. 10 తిరస్కరణ
[ 27-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు దాఖలు చేసిన నామపత్రాలను శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో పరిశీలించారు. -
తేలిన లెక్క
[ 27-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు తుది జాబితాను ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు శాసనసభ నియోజకవర్గాల వారిగా ఓటర్ల వివరాలు వెల్లడించారు. -
అడుగడుగునా కోడ్ గండం
[ 27-04-2024]
గడిచిన జులై 28న కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా తెగిపోయిన సిరాల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు ఆది నుంచి అవరోధాలు ఎదురవుతున్నాయి. -
దారుంది.. భయపెడుతోంది..!
[ 27-04-2024]
అదేంటది.. దారి భయపెట్టడమేంటని విస్తుపోతున్నారా! మీరు చదివింది నిజమే. అదీ జిల్లా కేంద్రంలోనే. పైగా జిల్లా ప్రధాన ఆసుపత్రి(ఇప్పుడు బోధనాసుపత్రి కూడా) పరిస్థితి ఇది. -
ఇంటర్ విద్య..వీరికి మిథ్య
[ 27-04-2024]
జిల్లాలోని మారుమూల మండలాలు భీమిని, కన్నెపల్లి, నెన్నెల. ఇక్కడ పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్ చదవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!