పంచ్లతో పతకాలు
ఉమ్మడి జిల్లాలో కరాటేను పరిచయం చేసిన వారిలో చెప్పుకోదగ్గ మాస్టర్ చుక్క ధర్మరాజ్. సుమారు 35 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రస్థానం నేటికీ ఆయన శిష్యులు కొనసాగిస్తున్నారు.
కరాటేలో నైపుణ్యం.. రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు
నిర్మల్ అర్బన్, న్యూస్టుడే: ఉమ్మడి జిల్లాలో కరాటేను పరిచయం చేసిన వారిలో చెప్పుకోదగ్గ మాస్టర్ చుక్క ధర్మరాజ్. సుమారు 35 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రస్థానం నేటికీ ఆయన శిష్యులు కొనసాగిస్తున్నారు. తర్ఫీదు పొందిన వారు నాలుగు జిల్లాల పరిధిలో వేల సంఖ్యలో ఉంటారు. జపాన్ కరాటే అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఇంటర్నేషనల్ బ్లాక్బెల్ట్ నాలుగో డిగ్రీ సాధించిన ఘనత ఆయనది. దురదృష్టవశాత్తు గత ఏడాది సెప్టెంబరులో ధర్మరాజ్ మృతి చెందారు. జపాన్ కరాటే అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తేజేందర్సింగ్ భాటియా, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొండా శ్రీకాంత్, అమ్ముల భూషణ్, సభ్యులు, శిక్షకులు నిత్యం విద్యార్థులకు కరాటేలో మెలకువలు నేర్పుతూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్మల్ ఖ్యాతి చాటుతున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 4వేల మంది శిక్షణ పొందుతున్నారు. వీరిలో జిల్లా కేంద్రానికి చెందిన పలువురు ఈ క్రీడలో ప్రత్యేకత కనబరుస్తూ ముందుకెళ్తున్నారు.
ఏడేళ్లుగా..
ఎం.హాసినికి ప్రశంసాపత్రం అందిస్తున్న జిల్లా అదనపు పాలనాధికారి ఫైజాన్ అహ్మద్
ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన ఎం.హాసిని మూడో తరగతి చదువుతున్న సమయంలో కరాటేపై మక్కువ పెంచుకుంది. పలు రాష్ట్ర స్థాయి టోర్నీల్లో పాల్గొని పతకాలు, ప్రశంసాపత్రాలు అందుకుంది. కుమితే (స్పైరింగ్)లో నేర్పరి. తొమ్మిదో తరగతిలో ఉన్న సమయంలో బ్లాక్బెల్ట్ పొందింది. పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో గత ఏడాది నిర్వహించిన రాష్ట్ర టోర్నీలో స్వర్ణ పతకం సాధించి డిసెంబరు 16- 19 వరకు దిల్లీలో జరిగిన నేషనల్లోనూ తనదైన ప్రతిభ కనబర్చింది.
చదివేది అయిదో తరగతి.. ప్రతిభ అమోఘం
సాధించిన పతకాలతో ఎస్.కె.అమన్
ఎస్.కె.అమన్ ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నాడు. రెండేళ్లుగా కరాటే శిక్షణ తీసుకుంటున్నాడు. 2022లో రాష్ట్ర స్థాయిలో మూడు టోర్నీల్లో పాల్గొనగా రెండింటిలో రజత, స్వర్ణ పతకాలు సాధించాడు. 2023లో స్వర్ణ, రజత పతకాలు రెండేసి చొప్పున, ఈ ఏడాది హైదరాబాద్లో జరిగిన టోర్నీలో వెండి, మంచిర్యాలలో నిర్వహించిన స్టేట్మీట్లో బంగారు పతకం సాధించి తనదైన ప్రతిభను చాటాడు. కటా, కుమితే రెండింటిలోనూ నేర్పరి.
ఇష్టంతో..
దివంగత చుక్క ధర్మరాజ్తో పూనంచౌదరి
పూనం చౌదరి కరాటేపై ఇష్టంతో ఏడో తరగతిలో శిక్షణ ప్రారంభించింది. ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన ఈ విద్యార్థిని మూడేళ్లుగా తర్ఫీదు పొందుతోంది. స్పైరింగ్లో మంచి పట్టు ఉంది. గత ఏడాది బ్లాక్బెల్ట్ అర్హత సాధించింది. 2022, 2023 సంవత్సరాల్లో మూడు పర్యాయాలు జరిగిన రాష్ట్ర టోర్నీల్లో పాల్గొని ఉత్తమ ప్రదర్శనతో బంగారు పతకాలు కైవసం చేసుకుంది. పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర టోర్నీలో కొద్దిపాటి తేడాతో స్వర్ణపతకం చేజారింది.
చిరుప్రాయం.. జాతీయ స్థాయికి ఎదిగేలా..
మూడో తరగతి చదువుతున్న హర్షవర్ధన్ అనతి కాలంలోనే బ్లాక్బెల్ట్ సాధించడం విశేషం. ఇప్పటి వరకు వివిధ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి టోర్నీల్లో సుమారు 20కిపైగా పాల్గొని ఉత్తమ ప్రతిభతో న్యాయనిర్ణేతలను సైతం ఆకట్టుకున్నాడు. మార్చి 3న హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి అక్టోబరులో గోవాలో జరగబోయే నేషనల్కు ఎంపికయ్యాడు.
తండ్రి బాటలోనే..
కుమారుడు నరసింహస్వామికి తర్ఫీదు ఇస్తున్న తండ్రి, శిక్షకుడు అమ్ముల భూషణ్
జపాన్ కరాటే అసోసియేషన్ జిల్లా కార్యదర్శి, శిక్షకుడు అమ్ముల భూషణ్ కుమారుడు నరసింహస్వామి తండ్రిబాటలోనే ముందుకెళ్తున్నాడు. కరాటేపై కుమారుడికి ఉన్న మక్కువను గుర్తించి తండ్రి ప్రోత్సహించారు. ప్రస్తుతం అయిదో తరగతి చదువుతున్న ఈ విద్యార్థి అయిదేళ్లుగా తర్ఫీదు పొందుతున్నాడు. ఇప్పటి వరకు 25 రాష్ట్ర పోటీల్లో పాల్గొని గుర్తింపు సాధించాడు. గత ఏడాది నిర్వహించిన ఎస్జీఎఫ్ రాష్ట్ర టోర్నీలో స్వర్ణం పొంది, డిసెంబరు 16- 19 వరకు దిల్లీలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. కటా, కుమితేలో మంచి నైపుణ్యం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హజ్ యాత్రికులకు టీకా కార్యక్రమం
[ 02-05-2024]
ఈ ఏడాది జిల్లా నుంచి పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు గురువారం ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు కమిటీ జిల్లా అధ్యక్షులు షాహిద్ అహ్మద్ ... -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
[ 02-05-2024]
పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఠాకూర్ హోటల్ వద్ద మురుగు కాలువలో గుర్తు తెలియని మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. -
శ్రేణులకు నిర్దేశం.. జనజాతరకు సిద్ధం
[ 02-05-2024]
ఆదిలాబాద్లో ఏప్రిల్ 22న ఇప్పటికే జనజాతర సభ పేరిట ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం రేవంత్రెడ్డి గురువారం ఆసిఫాబాద్లో జన జాతర సభ నిర్వహిస్తున్నారు. -
రైస్ మిల్లులకు తాళాలు..
[ 02-05-2024]
జిల్లాలో రైస్ మిల్లుల బాగోతాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. పోలీసుల కేసు నమోదుతో రైస్ మిల్లులకు తాళాలు వేసి వ్యాపారులు పత్తా లేకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. -
ఒక్క అవకాశం కోసం అడుగుతున్నాం : మంత్రి సీతక్క
[ 02-05-2024]
‘ఆదిలాబాద్ నుంచి తొలిసారిగా ఆదివాసీ ఆడబిడ్డ, సామాన్య మహిళను పార్లమెంటుకు పంపిద్దాం.. ఒక్క అవకాశం ఇవ్వండి.. అన్ని జిల్లాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.. అందుకే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వస్తున్నారని..’ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. -
ఓపీ చీటీ తీసుకోవటం మరింత సులువు
[ 02-05-2024]
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఓపీ(అవుట్ పేషెంట్) చీటీ తీసుకోవటానికి రోగులు, వారి సహాయకులు ఇక నుంచి గంటల తరబడి వరుసలో నిల్చోవాల్సిన అవసరం లేదు. -
బరిలో 42 మంది.. బ్యాలెట్ యూనిట్లు
[ 02-05-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి 12 మంది బరిలో ఉన్నారు. పెద్దపల్లి ఎస్సీ రిజర్వుస్థానానికి 42 మంది పోటీలో ఉన్నారు. దీంతో ఇక్కడ ఒక్కో పోలింగ్ కేంద్రంలో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరముంది. -
ఆర్టీయూకేటీ ప్రవేశాల నోటిఫికేషన్కు నిరీక్షణ
[ 02-05-2024]
బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాల నోటిఫికేషన్ కోసం విద్యార్థులకు నిరీక్షణ తప్పడం లేదు. పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆర్జీయూకేటీలో నేరుగా ప్రవేశాలు పొందేలా దరఖాస్తు చేసుకోవచ్చు. -
పని ప్రదేశమే.. ప్రచార వేదిక
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికలు మండుటెండల్లో వచ్చాయి. గ్రామాల్లో ఉపాధిహామీ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎండల దృష్ట్యా తెల్లవారంగానే పలుగు పారబట్టి పనులకు వెళుతున్నారు. -
అగ్నిగోళంగా ఆదిలాబాద్
[ 02-05-2024]
ఉమ్మడి జిల్లాలో బుధవారం సగటు ఉష్ణోగ్రత 42.9 డిగ్రీలు నమోదు కాగా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఇంకా ఎక్కువే నమోదైంది. మూడు రోజులుగా వడగాల్పుల తీవ్రత అధికమైంది. గత నెలలో వడదెబ్బ కారణంగా నలుగురు మృతి చెందారు. -
ముల్లె సదురుకున్నాం.. ఎల్లి పోతావున్నాం!
[ 02-05-2024]
‘ఏమున్నదక్కో.. ఏమున్నదక్కో.. ముల్లె సదురుకున్నా.. ఎల్లి పోతావున్నా.. ఈ ఊళ్లో నాకింక ఏమున్నదక్కో’ అంటూ ఓ సినీ గేయ రచయిత రాసిన గేయం ఇక్కడి ఆదివాసీలకు సరిగ్గా సరిపోతోంది. -
పర్యవేక్షణ బరువు.. వ్యవ‘సాయం’కరవు
[ 02-05-2024]
పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఎరువుల దుకాణాలపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. దీంతో డీలర్లు ఇష్టానుసారంగా పురుగుమందులను అన్నదాతలకు అంటగడుతున్నారు. -
మద్యం వ్యాపారుల.. ‘మిలాఖత్’!
[ 02-05-2024]
మద్యం వ్యాపారులు సిండికేట్గా మారి కల్తీ, నిర్ణయించిన ధరల కంటే అధికంగా విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. నియంత్రించాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
మాటల వేఢీ
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతున్నకొద్దీ ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాన్ని రచిస్తూ పల్లెలు, పట్టణాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారంలో మునిగి తేలుతున్నారు. -
తెల్లవారుజామున ఎస్ఈ బదిలీ ఉత్తర్వులు
[ 02-05-2024]
విద్యుత్తు సంస్థ జిల్లా ఎస్ఈ రాథోడ్ శేషారావు ఆకస్మిక బదిలీ అయ్యారు. కార్పొరేట్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని బుధవారం తెల్లవారుజామున ఉత్తర్వులు వచ్చాయి. -
మీటరు గిరగిర..
[ 02-05-2024]
సూర్యుడి ప్రతాపంతో జిల్లాలో విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. వేడి కారణంగా ప్రజలు ఉక్కిరి బిక్కరి అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో అడుగు బయటపెట్టాలంటే వణికిపోతున్నారు. -
ఎట్టకేలకు హస్తం గూటికి..
[ 02-05-2024]
నాలుగు సార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు ఎంపీ, మరో రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఎట్టకేలకు బుధవారం భారాసను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. -
భానుడి భగభగలు.. జనం బెంబేలు
[ 02-05-2024]
వేసవితాపంతో అల్లాడి పోతున్నారు జనం. మూడు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొనుగోలుదారులు లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. -
సరిహద్దు చెక్పోస్టులపై ప్రత్యేక నిఘా
[ 02-05-2024]
ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులలో ఏర్పాటు చేసిన చెక్పోస్టులపై ప్రత్యేక నిఘా పెట్టి తనిఖీ చేపడుతున్నామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా బుధవారం ముథోల్ పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. -
ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా
[ 02-05-2024]
ఆడబిడ్డను పోటీ చేస్తున్నా.. ఆదరించి ఆశీర్వదించండి.. అభివృద్ధి చూసి చూపిస్తానని ఆదిలాబాద్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు