రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన ఇచ్చోడ మండలం సాత్ నంబర్ వద్ద జాతీయ రహదారిపై జరిగింది.
ఇచ్చోడ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన ఇచ్చోడ మండలం సాత్ నంబర్ వద్ద జాతీయ రహదారిపై జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇచ్చోడ మండలం సాత్ నంబరు వద్ద రహదారి పక్కన ఆగి ఉన్న లారీని జబల్పూర్ నుంచి హైదరాబాద్ వైపునకు మామిడి పండ్ల లోడుతో వెళ్తున్న వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సౌరబ్, ఫుల్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వ్యాన్ ముందు భాగం క్యాబిన్లో ఇరుక్కుపోయిన వారిద్దరిని బయటకు తీశారు. 108 వాహనంలో ఆదిలాబాద్ రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు
-
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?