logo

మంగళవారం మేడే వారోత్సవాల ముగింపు కార్యక్రమం

మే డే వారోత్సవాల ముగింపు కార్యక్రమాలను మే 7న అదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నారు.

Updated : 06 May 2024 15:50 IST

ఎదులాపురం: మే డే వారోత్సవాల ముగింపు కార్యక్రమాలను మే 7న అదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు సీఐటీయూ జిల్లా కార్యాలయం నుంచి ర్యాలీతో ప్రారంభమై అనంతరం సెంట్రల్ గార్డెన్ టీఎన్జీవోస్‌లో నిర్వహించే సభతో ముగించనున్నట్లు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ తెలిపారు. స్థానిక జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం.సాయిబాబు హాజరవుతున్నట్లు తెలిపారు. బహిరంగ సభకు కార్మికులు ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని