పసర మందు పట్టిస్తాం.. కేజీహెచ్కు వెళ్లేది లేదు
విశాఖపట్నం వెళ్లేది లేదంటూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి, తల్లిదండ్రులు మొండికేశారు.
చింతపల్లి ఏరియా ఆసుపత్రిలో విద్యార్థితో మాట్లాడుతున్న అధికారులు
చింతపల్లి గ్రామీణం, న్యూస్టుడే: విశాఖపట్నం వెళ్లేది లేదంటూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి, తల్లిదండ్రులు మొండికేశారు. జాజులపాలెం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో కొర్ర సిద్ధు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం శరీరం పొంగిపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఉపాధ్యాయులు తాజంగి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకొచ్చారు. బాలుడి తల్లిదండ్రులకు ఈ విషయం తెలియజేయగా వారు ఆసుపత్రికి వచ్చారు. స్థానిక సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చికిత్స ప్రారంభించారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, విశాఖపట్నం కేజీహెచ్కు తరలించాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు వైద్యులు తెలిపారు. దీనికి తల్లిదండ్రులు నిరాకరించారు. ఉపాధ్యాయులు పలుమార్లు కౌన్సెలింగ్ చేసినా ఫలితం లేకపోయింది. గతంలో పసరమందుతో తగ్గిందని, ఇప్పుడూ ఇంటికి తీసుకెళ్లి అదే మందు పడతామన్నారు. ఇది ప్రమాదకరమని వైద్యులు చెప్పినా వినిపించుకోలేదు. దీంతో వైద్యులు సహాయ గిరిజన సంక్షేమాధికారి జయనాగలక్ష్మి, స్థానిక ఎస్సై అరుణకిరణ్కు ఫోన్ చేశారు. వారు ఆసుపత్రికి వచ్చి కౌన్సెలింగ్ నిర్వహించారు. కేజీహెచ్కు వెళ్లకపోతే పోలీసు కేసు పెడతామని హెచ్చరించారు. దీంతో విద్యార్థిని కేజీహెచ్కు తీసుకెళ్లేందుకు అంగీకరించారు. సాయంత్రం కేజీహెచ్కు అంబులెన్సులో తరలించారు. విద్యార్థులతోపాటు ఇద్దరు ఉపాధ్యాయులను వెంట పంపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్ సభకు.. జన సునామీ!!
[ 02-05-2024]
పెందుర్తిలో ‘వారాహి విజయభేరి’ సభ జన సునామీని తలపించింది. బుధవారం రాత్రి నిర్వహించిన సభకు చిన్నారుల నుంచి పెద్దల వరకు భారీగా తరలివచ్చారు. -
చప్పగా సీఎం ప్రసంగం.. స్పందన అంతంతమాత్రం
[ 02-05-2024]
ఒకవైపు ఎండ.. మరోవైపు అంతంతమాత్రంగా వచ్చిన జనం.. వారిలోనూ కానరాని స్పందన.. మొత్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో కొత్త విషయాలేవీ లేకుండా చప్పగా సాగింది. -
బాలకృష్ణకు ఘన స్వాగతం
[ 02-05-2024]
ఉత్తరాంధ్రలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం మధ్యాహ్నం గన్నవరం నుంచి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. -
‘పాడి’కుండకు చిల్లు.. జగన్కే చెల్లు!
[ 02-05-2024]
పల్లె జీవనంలో, గ్రామాల అభివృద్ధిలో పాడిది విడదీయరాని పాత్ర. క్షీరధారలు ఎంత పొంగిపొర్లితే పల్లెలు అంత పచ్చగా ఉన్నట్టు, అన్నదాత ఆనందంగా ఉన్నట్టు. -
మీ భవితకు నాదీ భరోసా!
[ 02-05-2024]
యువత భవితకు నాదీ భరోసా అంటూ జనసేన అధినేత పవన్కల్యాణ్ హామీ ఇచ్చారు. -
వైకాపాకు ఓటమి తప్పదు
[ 02-05-2024]
మంచి, చెడుల మధ్య జరుగుతున్న యుద్ధంలో చెడుమార్గంలో నడుస్తున్న వైకాపాకు ఓటమి తప్పదని అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. -
చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం
[ 02-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని రంపచోడవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి అన్నారు. -
అన్నివర్గాల సంక్షేమమే కూటమి లక్ష్యం
[ 02-05-2024]
అన్నివర్గాల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ముందుకు సాగుతుందని.. ఇందుకు నిదర్శనం ఎన్నికల మ్యానిఫెస్టో అని తెదేపా రాష్ట్ర కార్యదర్శి ఎంవీవీ ప్రసాద్ అన్నారు. -
గ్రామాల్లో నాటుసారా కంపు
[ 02-05-2024]
మన్యంలోని కొన్ని గ్రామాలు నాటుసారా కర్మాగారాలుగా మారాయి. ఎన్నికల నేపథ్యంలో ఇది మరింత విచ్చలవిడి అయింది. -
సుకుమామిడిలో దాహం కేకలు
[ 02-05-2024]
చింతూరు మండలం కొత్తపల్లి పంచాయతీ సుకుమామిడి శివారు గూడెంలో తాగునీటి కష్టాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. -
వైకాపా అంతం.. కూటమి పంతం
[ 02-05-2024]
రానున్న ఎన్నికల్లో వైకాపా అంతమే కూటమి పంతమని భాజపా రాష్ట్ర మహిళ మోర్చా ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి పేర్కొన్నారు. -
వేటాడి తాపీమేస్త్రి దారుణ హత్య
[ 02-05-2024]
బుచ్చెయ్యపేట మండల కేంద్రంలో బుధవారం ఉదయం చెరువు పనులకు, పొలాలకు వెళ్లే వారు, పాకల వద్దకు వెళ్లి పాలు తీసుకువచ్చేందుకు ఇళ్ల నుంచి ఒక్కొక్కరిగా బయలుదేరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
-
అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ షురూ.. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఇవిగో..