Virat Kohli: విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆట తీరుపై నెట్టింట విమర్శలు వస్తూనే ఉన్నాయి. టీ20 ఫార్మాట్కు తగ్గట్టుగా స్ట్రైక్రేట్ ఉండటం లేదని కొందరు మాజీలు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వాటిపై ఏబీ డివిలియర్స్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇప్పటికే 500 పరుగులు రాబట్టాడు. బెంగళూరు భారీ స్కోరు సాధించడంలో అతడిదీ కీలక పాత్రే. మరోవైపు ప్లేఆఫ్స్ బెర్తుకు దాదాపు ఆర్సీబీ దూరమైంది. దీంతో విరాట్ తక్కువ స్ట్రైక్రేట్తో పరుగులు చేయడం వల్లే ఇదంతా అని విమర్శకులు తమ నోళ్లకు పనిజెప్పారు. ఇలాంటివాటికి బెంగళూరు ఒకప్పటి సహచరుడు, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఘాటుగా సమాధానం ఇచ్చాడు.
‘‘ఈ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్ విరాట్ కోహ్లీ. రుతురాజ్ ఆరెంజ్ క్యాప్ అందుకోనంతవరకూ కోహ్లీ వద్దే ఉంది. అయినా, అతడి స్ట్రైక్రేట్పై తీవ్రంగా విమర్శలు రావడం ఆశ్చర్యానికి గురి చేశాయి. టోర్నీ ఆరంభం నుంచీ ఇవే మాటలు విని విసిగిపోయా. ఈ విమర్శలపై ఘాటుగా స్పందించాలని అనుకుంటున్నా. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో కోహ్లీ ఒకరు. అతడి గణాంకాలను చూస్తే అర్థమైపోతుంది. కానీ, అతడి స్ట్రైక్రేట్ను విమర్శిస్తున్న చాలామంది క్రికెట్ పండితులు కనీసం కోహ్లీ ఆడిన మ్యాచుల్లో సగం కూడా ఆడి ఉండరు. ఆటపట్ల వారికి సరైన అవగాహన లేదనుకుంటా. అసలు ఎన్ని మ్యాచ్లు ఆడారు? ఐపీఎల్లో ఎన్ని సెంచరీలు చేశారు?’’ అని ఏబీడీ ప్రశ్నించాడు. టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన జట్టులో విరాట్కు చోటు దక్కిన విషయం తెలిసిందే.
వారిద్దరికీ ఇదే చివరి ప్రపంచ కప్: కైఫ్
‘‘రోహిత్ శర్మ మరెంతో కాలం ఆడలేడు. మహా అయితే మూడేళ్లు మాత్రమే మైదానంలో ఉంటాడు. విరాట్ కోహ్లీ పరిస్థితి కూడా ఇంతే. గతేడాది వన్డే ప్రపంచకప్ను నెగ్గే అవకాశం తృటిలో చేజారింది. పది మ్యాచ్లు వరుసగా గెలిచి.. చివరి పోరులో ఓటమిపాలయ్యారు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్లోనూ భారత్కు పెద్దగా ఆటంకాలు ఉండకపోవచ్చు. గ్రూప్ స్టేజ్ను సులువుగానే అధిగమిస్తుంది. సెమీస్, ఫైనల్ మాత్రమే కఠినం. ఐపీఎల్లో మాదిరిగా మరిన్ని అవకాశాలు అక్కడ రావు. కీలకమైన ఆ రెండు రోజుల కోసం సిద్ధంగా ఉండాలి. రోహిత్, విరాట్లకు అసలైన పరీక్ష అక్కడే ఎదురుకానుంది. పవర్ ప్లేలో రోహిత్ దూకుడైన ఆరంభం ఇస్తాడు. ఆ తర్వాత దానిని విరాట్ కొనసాగించాలి. ఈ వరల్డ్ కప్ చివరిగా భావించి ఆడాలి. 2026 ఎడిషన్లో వీరిద్దరూ ఉండటం చాలా కష్టమే’’ అని కైఫ్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుణుడు ఆడుకున్నాడు
ఐపీఎల్-17వ సీజన్లో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసును వరుణుడు చప్పగా మార్చేశాడు. పరుగుల పోటీ లేకుండానే సన్రైజర్స్ హైదరాబాద్ను తర్వాతి దశకు చేర్చేశాడు. -
ఛెత్రి ఇక చాలని..
ఈ తరానికి భారత ఫుట్బాల్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సునీల్ ఛెత్రి. ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలతో దేశంలో ఆటకు దాదాపు పర్యాయపదంగా మారిన సూపర్స్టార్ అతడు. కానీ మైదానంలో అతడి పరుగు ఆగనుంది. -
శ్రీజ.. సింగిల్స్లోనూ
తెలుగుతేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్లోనూ పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలవనుంది. -
క్వార్టర్ఫైనల్లో మీరాబా
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ మీరాబా లువాంగ్ మైసనాం జోరు కొనసాగుతోంది. -
ఫైనల్లో నిఖత్
ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఎల్డోర్ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం మహిళల 52 కిలోల సెమీఫైనల్లో ఆమె 5-0తో కజకిస్థాన్ అమ్మాయి తొమిరిస్ మిర్జాకుల్ను చిత్తు చేసింది. -
భారత ఫుట్బాల్ గుండెచప్పుడు
సునీల్ ఛెత్రి.. భారత ఫుట్బాల్ గుండె చప్పుడు! దాదాపు రెండు దశబ్దాల పాటు అత్యుత్తమ ఆటతో జట్టు భారాన్ని మోసిన వీరుడు. మెరుపు విన్యాసాలతో అభిమానులను మైదానాలకు ఆకర్షించిన సమ్మోహన శక్తి. -
అంజుమ్, స్వప్నిల్ విజయం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో అంజుమ్ మౌద్గిల్, స్వప్నిల్ కుశాలె తమ తొలి విజయాలు సాధించారు. మహిళలు, పురుషుల 50మీ 3 పొజిషన్స్లో వాళ్లు విజేతగా నిలిచారు. -
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
ఐపీఎల్ 17 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఇంకా ప్లేఆఫ్స్కు చేరలేదు. ఆ జట్టు మరో విజయం సాధించి ఇతర జట్ల ఫలితాల అనుకూలిస్తే రెండో స్థానానికి చేరడానికి ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
-
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!