logo

ఎండ తీవ్రతతో ద్విచక్రవాహనం దగ్ధం

అధిక ఉష్ణోగ్రతతో ఓ ద్విచక్రవాహనం దగ్ధమైన ఘటన శుక్రవారం పాడేరు పట్టణంలో చోటుచేసుకుంది. పాడేరు ప్రధాన రహదారి సినిమాహాల్‌ కూడలి వద్ద ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

Published : 20 Apr 2024 01:59 IST

పాడేరు, న్యూస్‌టుడే: అధిక ఉష్ణోగ్రతతో ఓ ద్విచక్రవాహనం దగ్ధమైన ఘటన శుక్రవారం పాడేరు పట్టణంలో చోటుచేసుకుంది. పాడేరు ప్రధాన రహదారి సినిమాహాల్‌ కూడలి వద్ద ట్రాఫిక్‌ జామ్‌ అయింది. మధ్యలో ఉన్న ఓ ద్విచక్రవాహనం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే స్పందించి మంటలు ఆర్పే యత్నం చేశారు. ద్విచక్రవాహనంపై ఉన్న వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. బైక్‌ ఇంజిన్‌ మొత్తం కాలిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని