చెప్పేది నా ఎస్టీ... చేసేది లూటీ
రాష్ట్రంలో 14,132 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గిరిజన ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో 36 గిరిజన మండలాలు, 613 గ్రామ పంచాయతీల పరిధిలో 4,765 గిరిజన గ్రామాలున్నాయి.
అండగా నిలిచిన ఆదివాసీలకు జగన్ అన్యాయం
గిరిజనుల హక్కులు, చట్టాలకు తూట్లు
మాట్లాడిన ప్రతి చోటా సీఎం జగన్ నా ఎస్సీ, ఎస్టీలు అంటూ వారిపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తారు. ఆచరణకు వచ్చేసరికి గిరిజనులకు వైకాపా సర్కారు చేసినంత అన్యాయం ఇంకెవరూ చేయలేదు. వారి మూలాలను దెబ్బతీస్తూ మనుగడను ప్రమాదంలోకి నెట్టడానికి జగన్ ఎంత మాత్రం వెనుకాడలేదు. ప్రతి ఎన్నికల్లోనూ వైకాపాకు అండగా నిలిచిన ఆదివాసీలకే తీవ్ర అన్యాయం చేశారు. దీనిపై అడవి బిడ్డలు చేసిన ఆందోళనలను అణిచేసి, ప్రశ్నించిన వారి గొంతులు నొక్కేశారు.
ఈనాడు, అనకాపల్లి, న్యూస్టుడే, గూడెంకొత్తవీధి, అనంతగిరి: రాష్ట్రంలో 14,132 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గిరిజన ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో 36 గిరిజన మండలాలు, 613 గ్రామ పంచాయతీల పరిధిలో 4,765 గిరిజన గ్రామాలున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 27.39 లక్షల మంది గిరిజనులు నివసిస్తున్నారు. (ఈ సంఖ్య మరో నాలుగు శాతం పెరిగిందని అంచనా). రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 ఎస్టీ నియోజకవర్గాలున్నాయి. వైకాపా ఆవిర్భావం తరవాత రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో గిరిజనులు ఆ పార్టీకి అండగా నిలిచారు. అలాంటి గిరిజనులకు రక్షణగా ఉన్న ఆదివాసీ చట్టాలు, హక్కులు కాపాడాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. పైగా హక్కులు, చట్టాల అమలులో మోకాలొడ్డుతూ పైశాచిక ఆనందం పొందుతోంది.
అనంతగిరిలో గిరిజన చట్టాలపై సంఘాల నేతల ఆందోళన (పాత చిత్రం)
వందశాతం ఉద్యోగాల జీఓపై నిర్లక్ష్యం
గిరిజన ప్రాంతంలో ఆదివాసీలకే వందశాతం ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2000లో తెదేపా ప్రభుత్వం జీఓ నం. 3 జారీచేసింది. దీంతో లక్షల మంది గిరిజన యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందారు. 2021 ఏప్రిల్ 22న ఈ జీఓను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీనిపై జగన్ ప్రభుత్వం స్పందించలేదు. రివ్యూ పిటిషన్ వేయాలని గిరిజన యువత వేడుకున్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతేడాది 1998 డీఎస్సీ ఉపాధ్యాయల పోస్టుల నియామకాల్లో గిరిజన ప్రాంతాల్లో మైదాన ప్రాంత ఉపాధ్యాయులను నియమించారు. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పొరుగు సేవల విధానంలో అధ్యాపకుల భర్తీలో గిరిజనులకు ఒక్క పోస్టూ కేటాయించలేదు. గిరిజన గ్రామాల్లో ఉన్నత చదువులు చదివిన వారంతా ఉద్యోగాలు రాక వ్యవసాయ, ఉపాధి హామీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పీసా పక్కనపెట్టి.. మైనింగ్ పట్టుపట్టి
పీసా చట్టం ప్రకారం గిరిజన ప్రాంతాల్లో గ్రామసభ ఆమోదం లేకుండా గనులు, ఖనిజాలు తవ్వేందుకు, గిరిజనేతరులు నిర్మాణాలు చేపట్టేందుకు వీలు లేదు. దీంతో బాక్సైట్ తవ్వకాలకూ బ్రేక్ పడింది. అయితే వైకాపా ప్రభుత్వం మన్యంలో గనుల, ఖనిజాల తవ్వకాల కోసం పీసా చట్టాన్ని పక్కనపెట్టింది. దీంతో మన్యంలో లేట్రైట్, కాల్సైట్, తెల్లరాయి వంటి తవ్వకాలు జోరందుకున్నాయి. చింతపల్లి మండలం మడిగుంటలో గ్రానైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులు ఆందోళనలు చేయడంతో ప్రస్తుతానికి తవ్వకాలు నిలిచిపోయాయి. అనంతగిరి మండలం నిమ్మలపాడు, సరియా ప్రాంతాల్లో కాల్సైట్, భీంపోలులో తెల్లరాయి క్వారీల్లో తవ్వకాలకు వైకాపా వర్గీయులకే అవకాశం కల్పించారు. నిమ్మలపాడు, భీంపోలులో తవ్వకాలు జరగ్గా గిరిజనులు అడ్డుకున్నారు. గూడెంకొత్తవీధి మండలం రింతాడలో నల్లరాయి క్వారీ తవ్వకాలకు వైకాపా అండతో వ్యాపారులు రంగంలోకి దిగారు.
రింతాడలో గనుల తవ్వకాలను అడ్డుకోవాలని గిరిజనుల వినతి (పాతచిత్రం)
అటవీ హక్కులకూ విఘాతం
రాజ్యాంగం ఆదివాసీలకు కల్పించిన చట్టాల్లో 1/70, 1/59 చట్టాలు ప్రధానమైనవి. వీటి ప్రకారం గిరిజనేతరులు మన్యంలో భూములు కొనడానికి వీల్లేదు. వైకాపా ప్రభుత్వం ఈ చట్టాలను పక్కాగా అమలు చేయడం లేదు. పైగా గిరిజనేతరులకు ఒకటిన్నర సెంట్ల భూమి ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆదివాసీ ఎమ్మెల్యేలతో లేఖలు రాయించి ఈ హక్కులకు తూట్లు పొడిచింది. బాక్సైట్ నిల్వలున్న జర్రెల, మొండిగెడ్డ, అరకు, అనంతగిరి, గాలికొండ ప్రాంతాల గిరిజనులకు అటవీ పట్టాలు సక్రమంగా ఇవ్వకుండా సాకులతో కాలం వెళ్లదీస్తోంది.
గిరిజన సంక్షేమ నిధుల దారిమళ్లింపు: గిరిజనులఅభ్యున్నతికి కేటాయించిన రూ. వేల కోట్ల గిరిజన ఉప ప్రణాళిక నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది. పేరుకే ట్రైకార్ ఛైర్మన్ను నియమించింది. ఒక్క రుణం కూడా ఇవ్వలేదు. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి భరించలేక సాక్షాత్తు ట్రైకార్ ఛైర్మన్ వైకాపాను వదిలి కాంగ్రెస్ గూటికి చేరారు.
వేరివారి చేర్పుతో అన్యాయం: బోయవాల్మీకి, బెంతు ఒరియాలను గిరిజన జాబితాలో కలిపేందుకు జగన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది గిరిజనులున్నారు. ఈ జాబితాలో 40 లక్షలకు పైగా ఉన్న బోయ వాల్మీకులు, బెంతు ఒరియాలను గిరిజన జాబితాలో కలిపేందుకు వైకాపా ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. దీనిపై ఏకంగా అసెంబ్లీలోనూ తీర్మానం చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. బోయ వాల్మీకులు, బెంతు ఒరియాలను ఎస్టీల్లో కలిపితే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో పూర్తిగా వెనుకబడిపోవడం ఖాయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటగాళ్లకు మోసగాడు
[ 11-05-2024]
వైకాపా పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన రంగాల్లో క్రీడారంగం ఒకటి. ఐదేళ్లలో క్రీడాభివృద్ధికి రూపాయి ఖర్చు పెట్టలేదు. క్రీడా పరికరాలు సమకూర్చలేదు. మైదానాలు బాగు చేయలేదు. -
వినిపించలేదా.. జగన్ అన్నదాతల ఆత్మఘోష?
[ 11-05-2024]
ప్రస్తుతం ఆయా బాధిత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. ఇలాంటివారిని రైతు స్వరాజ్య వేదిక గుర్తించి జీవనోపాధికి ఉన్నంతలో సాయం చేసినా జగన్ సర్కారుకు మాత్రం పరిహారం ఇవ్వడానికి చేతులు రాలేదు. -
పోలింగ్ ముగిసే వరకు అప్రమత్తత: చంద్రబాబు
[ 11-05-2024]
పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తేవాలని తెదేపా అధినేత చంద్రబాబు కూటమి అభ్యర్థులు, పార్టీ నేతలకు సూచించారు. -
వైకాపా అరాచక పాలనపై జనం తిరుగుబాటు
[ 11-05-2024]
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనను ప్రజలకు వివరించడంతో వారిలో తిరుగుబాటు మొదలైందని రంపచోడవరం అసెంబ్లీ తెదేపా అభ్యర్థి మిరియాల శిరీషాదేవి పేర్కొన్నారు. -
కూటమితోనే గిరిజనుల అభ్యున్నతి
[ 11-05-2024]
ఎన్డీఏ గెలుపుతోనే గిరిజనుల అభ్యున్నతి సాధ్యమవుతుందని పాడేరు నియోజకవర్గ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. శుక్రవారం పాడేరు పట్టణంలో మూడు పార్టీల నాయకులతో కలిసి భారీ ర్యాలీ చేశారు. -
ఈదురుగాలుల బీభత్సం
[ 11-05-2024]
మన్యంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఈదురుగాలులతో భారీవర్షం కురిసింది. పెదబయలు మండలంలోని గ్రామాల్లో భారీ వాన పడింది. -
జలాశయాన్ని కప్పేస్తున్నారు..
[ 11-05-2024]
వందల ఎకరాలకు సాగునీరందించే జలాశయాన్ని కొందరు అక్రమార్కులు తమ స్వార్థానికి ఇష్టారాజ్యంగా పూడ్చేస్తున్నారు. ఇదంతా నిరాటంకంగా సాగుతున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వదిలేశారు. -
అయిదేళ్ల నరకానికి రెండు రోజుల్లో మోక్షం
[ 11-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు అనుభవించిన నరకానికి రెండు రోజుల్లో మోక్షం కలగనుందని కూటమి ‘పేట’ అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. -
యువకులపై యమపాశం
[ 11-05-2024]
జిల్లాలో శుక్రవారం జరిగిన రెండు ప్రమాదాల్లో నలుగురు యువకుల దుర్మరణం పాలై ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నింపారు. అందరితో కలివిడిగా ఉండే వారు అనుకోని ప్రమాదంలో మరణించడంతో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు బోరున విలపించారు. -
మత్తులో ముంచొద్దు.. మీకో దండం
[ 11-05-2024]
రోజంగా చెమటోచ్చి సంపాదించిన మొత్తం ‘జె’ బ్రాండ్ మద్యానికే ధారపోస్తున్నారు. మందుకు బానిసలై ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటున్నారు. -
ఎన్నికల నిబంధనలకు వైకాపా తూట్లు
[ 11-05-2024]
వైకాపా బరితెగిస్తోంది. ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తున్న వైకాపా నేతలపై చర్యలు తీసుకోవడంలో ఎన్నికల అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. -
బస్సులు రావు.. బాధలు తీరవు!
[ 11-05-2024]
చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో చాలా గ్రామాలకు గతంలో ఆర్టీసీ బస్సులు నడిపేది. కాలక్రమంలో రహదారులు బాగోలేవంటూ కొన్ని, రాబడి రావడం లేదంటూ మరికొన్ని రద్దు చేయడంతో గిరిజనులకు రవాణా కష్టాలు వీడటం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు