అరకు వైకాపాకు తిరుగు‘పోటు’
ఆంధ్రాఊటీ అరకులోయలో రాజకీయం వేడెక్కుతోంది. అరకులోయ అసెంబ్లీ స్థానానికి ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిసి మొత్తం 17 మంది బరిలో ఉన్నారు. వీరిలో వైకాపాలోని తిరుగుబాటు అభ్యర్థులే అధికంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
పోటీలో ఐదుగురు రెబల్స్
అరకులోయ, న్యూస్టుడే
ఆంధ్రాఊటీ అరకులోయలో రాజకీయం వేడెక్కుతోంది. అరకులోయ అసెంబ్లీ స్థానానికి ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిసి మొత్తం 17 మంది బరిలో ఉన్నారు. వీరిలో వైకాపాలోని తిరుగుబాటు అభ్యర్థులే అధికంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. వైకాపా తిరుగుబాటు అభ్యర్థులంతా పోటీలో ఉండేందుకే మొగ్గు చూపడంతో అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. 9 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉండగా వారిలో అయిదుగురు వైకాపా రెబల్సే కావడం గమనార్హం. వైకాపా నుంచి టికెట్ ఆశించి భంగపడిన వారంతా బరిలో ఉన్నారు. సమర్డి రఘునాథ్ ఎన్నికల నోటిఫికేషన్ ముందు వరకు వైకాపాలోనే ఉన్నారు. టికెట్ రాకపోవడంతో తన సత్తా చూపించాలని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. అరకులోయ మండలానికి చెందిన ఈయన గతంలో సర్పంచిగా పనిచేశారు. పెదబయలు మండలానికి చెందిన వంతల రామన్న నోటిఫికేషన్ ముందు వరకు వైకాపాలో పనిచేశారు. పార్టీ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఈయన సర్పంచిగా పనిచేశారు. అరకులోయకు చెందిన సమర్డి భవాని మొన్నటి వరకు వైకాపాలో ఉన్నారు. ఆమె సైతం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈమె పెదలబుడు ఎంపీటీసీ సభ్యురాలిగా పనిచేశారు. డుంబ్రిగుడ మండలానికి చెందిన కమ్మిడి నిర్మల వైకాపాలో ఉంటూ గత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈమె సైతం స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అనంతగిరి మండలానికి చెందిన నరాజి మధుబాబు వైకాపాలోనే ఉన్నారు. ఈయన స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. జై భారత్ ఆదివాసీ పార్టీ తరపున పోటీ చేస్తున్న అరకులోయ మండలం చినలబుడు సర్పంచి ఉపేంద్ర మొన్నటి వరకు వైకాపాలోనే ఉన్నారు. అధిక సంఖ్యలో వైకాపా తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉండటంతో వీరంతా ఏ మేర తమ ఓట్లను కొల్లగొడతారోనని అధికార పార్టీ అభ్యర్థికి ఆందోళన మొదలైంది. సామాజికవర్గాల పరంగా ఓటుబ్యాంకును స్వతంత్య్ర అభ్యర్థులు చీల్చే అవకాశాలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏదీ జీవం.. ఎక్కడా వైవిధ్యం!
[ 22-05-2024]
మానవ తప్పిదాలతో కాలక్రమంలో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. ఆధునిక జీవన శైలిలో పర్యావరణం కాలుష్యానికి గురవుతోంది. భూగోళం వేడెక్కిపోతోంది. దీంతో జీవవైవిధ్యానికి ముప్పు వాటిల్లుతోంది. -
నిర్మించి నెల.. పెచ్చులూడిందిలా..
[ 22-05-2024]
వైకాపా ప్రభుత్వంలో మన్యం ప్రాంతంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడమే గగనమైంది. చేసిన కొద్ది పనులూ నాణ్యతగా చేపట్టకపోవడంతో అధ్వానంగా తయారవుతున్నాయి. -
కొనలేం.. తినలేం
[ 22-05-2024]
వేసవిలో కమ్మటి సువాసనతో అందరి నోరూరించే మామిడిపండు ఈ ఏడాది ప్రియమైపోయింది. దిగుబడులు భారీగా తగ్గడం, ఇతర ప్రాంతాల్లో డిమాండుతో సామాన్యులు మనస్ఫూర్తిగా తినే పరిస్థితి లేకుండా పోయింది. -
ఇతరులను అనుమతించొద్దు
[ 22-05-2024]
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్రూంల వద్దకు ఇతరులను అనుమతించొద్దని కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ తుహిన్ సిన్హా పేర్కొన్నారు. -
ఓట్ల లెక్కింపు వరకు అప్రమత్తం
[ 22-05-2024]
పెదబయలు పోలీసుస్టేషన్ను ఎస్పీ తుహిన్ సిన్హా, సీఐ రమేష్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్సై మనోజ్కుమార్, సిబ్బందితో సమావేశమయ్యారు. -
తెలంగాణ సీసీఎస్ డీఎస్పీ స్వగ్రామంలో సోదాలు
[ 22-05-2024]
హైదరాబాద్లో అవినీతి నిరోధక శాఖకు చిక్కిన తెలంగాణ సీసీఎస్ డీఎస్పీ ఉమామహేశ్వరరావు స్వగ్రామమైన బుచ్చెయ్యపేట మండలం బంగారుమెట్ట, రోలుగుంటలోని బంధువుల ఇళ్లలో మంగళవారం ఉన్నతాధికారులు తనిఖీలు చేశారు. -
సజావుగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు
[ 22-05-2024]
జిల్లాలో ఈనెల 24 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారిణి బి.పద్మావతి సంబంధిత అధికారులను ఆదేశించారు. -
ఆర్ఎంపీ వైద్యంతో రోగి మృతిపై విచారణ
[ 22-05-2024]
ఆర్.ఎం.పి. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా ఓ రోగి మృతిచెందాడనే ఆరోపణపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. -
అంగన్వాడీల నేత తులసి హఠాన్మరణం
[ 22-05-2024]
అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు వై.తులసి (45) మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఈమె అంగన్వాడీల సమస్యలపై గత ఇరవై ఏళ్లుగా పోరాటాలు చేస్తూ ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
గొంతుపై కాలుతో తొక్కి.. భార్య ప్రాణం తీసిన భర్త
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..