వైకాపా ఖాళీ అయిపోయింది: మండలి
వైకాపా మొత్తం ఖాళీ అయిందని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నియోజకవర్గంలో జనసేన పార్టీకీ రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందని ఆయన తెలిపారు.
అవనిగడ్డ, నాగాయలంక, మోపిదేవి, ఘంటసాల, చల్లపల్లి, న్యూస్టుడే: వైకాపా మొత్తం ఖాళీ అయిందని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నియోజకవర్గంలో జనసేన పార్టీకీ రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందని ఆయన తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తథ్యమన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మే 6న అవనిగడ్డ వస్తున్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ తెలిపారు. గుడివాక శేషుబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నాగాయలంకలో తెదేపా జిల్లా నాయకుడు, రాష్ట్ర సంప్రదాయ మత్స్యకారుల సేవా సమితి ప్రధాన కార్యదర్శి లకనం నాగాంజనేయులు, మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్ మండవ బాలవర్థిరావు మత్స్యకారుల కాలనీలో తెదేపా, జనసేన, భాజపా నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నడిపించే కథానాయకుడు.. నాన్న
[ 16-06-2024]
మనల్ని ప్రపంచానికి పరిచయం చేసింది అమ్మ అయితే.. మనకు ప్రపంచాన్ని పరిచయం చేసేది నాన్న.. తల్లి మాటలతో ధైర్యం చెబితే నాన్న చేతలతో మనలో ధైర్యం నింపుతాడు.. మన మొదటి గురువు, తొలి స్నేహితుడూ నాన్నే.. మనల్ని తీర్చిదిద్ది.. మన భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకు అహర్నిశలూ శ్రమిస్తూ నాన్న ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాడు. -
చంద్రబాబుకు ఎవరూ సాటిరారు
[ 16-06-2024]
ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి విషయంలో చంద్రబాబు చిత్తశుద్ధికి ఎవరూ సాటిరారని మాజీ ఎంపీ, తెదేపా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు. -
బ్యాటరీ మింగేసిన చిన్నారి
[ 16-06-2024]
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన 11 నెలల పాప ఆడుకుంటూ శనివారం మధ్యాహ్నం పొరపాటున బొమ్మలోని ఓ చిన్న బ్యాటరీని మింగేసింది. తల్లి వెంటనే గుర్తించి.. స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి.. విజయవాడకు తీసుకెళ్లమని సూచించారు. -
బాబాయ్ అని ఇల్లు గుల్ల చేశారు
[ 16-06-2024]
అది జాతీయ రహదారి పక్కన దుకాణం.. సమయం రాత్రి 10 గంటలు.. జనసంచారం ఉండే ప్రాంతం.. నిత్యం వీఐపీల తాకిడి ఉంటుంది. అలాంటి ప్రాంతంలోని ఓ దుకాణానికి వచ్చిన దుండగుడు బాబాయ్ అంటూ మాట కలిపాడు.. ఆ ఇంట్లో వృద్ధులే ఉంటారని తెలుసుకున్నాడు.. -
కాపురానికి రావడం లేదని కత్తితో దాడి
[ 16-06-2024]
భార్య కాపురానికి రావడం లేదని భర్త కత్తితో దాడి చేసిన ఘటన శుక్రవారం సాయంత్రం చెవుటూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పొందుగల గ్రామానికి చెందిన వీరిశెట్టి రంగారావుకు కృష్ణాజిల్లా ఊటుకూరు మండలం మానికొండ గ్రామానికి చెందిన రత్నకుమారికి 20 ఏళ్ల కిందట వివాహమైంది. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
[ 16-06-2024]
ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. -
శ్రీశ్రీ సాహిత్యం అజరామరం
[ 16-06-2024]
జన చైతన్యం ఆశిస్తూ ఎందరికో స్ఫూర్తినిచ్చిన శ్రీశ్రీ సాహిత్యం అజరామరమని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్తేజ అన్నారు. -
వైకాపా భూస్థాపితం : మాజీ ఎమ్మెల్సీ
[ 16-06-2024]
ఎన్నికల ఫలితాలతో అరాచక వైకాపా భూస్థాపితం అవడం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. నగరంలోని మల్లికార్జునపేటలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్ దళాలకు ఎదురుదెబ్బ.. 8 మంది సైనికులు మృతి
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/06/24)
-
విమానం కూల్చివేత ఘటన .. ఎనిమిది దశాబ్దాలకు వీడిన మిస్టరీ!
-
మొదట ఆ ఐదుగురిని తప్పించండి! సీనియర్ ఆటగాళ్లపై తీవ్రంగా మండిపడ్డ పాక్ క్రికెటర్
-
కువైట్ అగ్నిప్రమాద ఘటన.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం!