కొనసాగుతున్న పోలీస్ పికెట్
పెడనలోని తోటమూలలో రెండు వర్గాల మధ్య విభేదాల కారణంగా ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్ కొనసాగుతోంది. గత ఏడాది వినాయక నిమజ్జన సమయంలో ఒక వర్గానికి చెందిన కొంతమంది యువకులు మరో వర్గంపై దాడికి పాల్పడ్డారు. సకాలంలో
బాధ్యులపై రౌడీషీట్లు తెరిచేందుకు చర్యలు
పెడన, న్యూస్టుడే: పెడనలోని తోటమూలలో రెండు వర్గాల మధ్య విభేదాల కారణంగా ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్ కొనసాగుతోంది. గత ఏడాది వినాయక నిమజ్జన సమయంలో ఒక వర్గానికి చెందిన కొంతమంది యువకులు మరో వర్గంపై దాడికి పాల్పడ్డారు. సకాలంలో స్పందించిన పోలీసు అధికారులు హుటాహుటిన అదనపు బలగాలను తరలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. అప్పట్లో 15రోజుల పాటు పికెట్ను ఏర్పాటు చేశారు. తాజాగా మూడ్రోజుల క్రితం ఫ్లెక్సీ వివాదం విభేదాలను రగిల్చింది. ఓ ప్రజాప్రతినిధి పుట్టినరోజు సందర్భంగా కొంతమంది యువకులు పెడన-విస్సన్నపేట బైపాస్ రహదారి పక్కగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడాన్ని మరో వర్గానికి చెందిన యువకుడు వరుదు శివకుమార్తో పాటు మరికొందరు ప్రతిఘటించారు. ఈఘటనలో శివకుమార్పై ఏడుగురు యువకులు దాడికి పాల్పడినట్లు ఐపీసీ సెక్షన్ 324 కింద కేసు నమోదైంది. దీంతో రాత్రికి రాత్రి ఆప్రాంతంలో పోలీసు పికెట్ను ఏర్పాటుచేశారు. మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ 9వ వార్డు పరిధిలోకి వచ్చే ఈప్రాంతంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. వరుస సంఘటనలతో ఈప్రాంతం పోలీసు ఉన్నతాధికారుల దృష్టిలోకి వెళ్లింది. ఈనేపథ్యంలో పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో వరుసగా గొడవలకు పాల్పడుతున్న యువకుల్ని పోలీసులు గుర్తించారు. ఒకటికి మించి కేసులున్న యువకులు దాదాపు 20మంది ఉన్నట్లు తేలిందని, త్వరలో రౌడీషీట్లు తెరుస్తామని ఎస్సై టి.మురళి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డొక్కువి తప్పించరు.. కొత్తవి తెప్పించరు..
[ 20-05-2024]
ఆర్టీసీకి సకాలంలో కొత్త బస్సులు రాక.. పాత వాటినే నడపాల్సి వస్తోంది. ఫలితంగా నడిరోడ్లపై నిత్యం ఆగిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. -
జాతీయ రహదారైతే మాకేంటి?
[ 20-05-2024]
16వ జాతీయ రహదారి వాహనాల పార్కింగ్కు అడ్డాగా మారిపోయింది. చెన్నై నుంచి కోల్కతా వరకు వ్యాపించి ఉన్న ఈ మార్గంలో వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేయడం పరిపాటైంది. -
ఓటమి భయంతోనే ముందస్తు దాడులు
[ 20-05-2024]
గన్నవరం నియోజకవర్గంలో ఓటమి ఖాయమని తేలడంతోనే పోలింగ్ సందర్భంగా వైకాపా మూకలు ముందస్తు అల్లర్లు, దాడులకు దిగాయని తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. -
ఆసుపత్రి నుంచి కొనకళ్ల డిశ్ఛార్జి
[ 20-05-2024]
గుండెపోటుతో అస్వస్థతకు గురై గత నాలుగు రోజులుగా విజయవాడ రమేష్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న మచిలీపట్నం మాజీ ఎంపీ, జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు ఆదివారం డిశ్ఛార్జి అయ్యారు. -
ఓపెన్ చదరంగం విజేత మహేష్కుమార్
[ 20-05-2024]
తూర్పుగోదావరి జిల్లా చదరంగం సంఘ ఆధ్వర్యంలో ఫ్యూచర్కిడ్స్ పాఠశాలలో రాష్ట్రస్థాయి ఓపెన్ ర్యాపిడ్ చదరంగం టోర్నమెంట్ ఆదివారం జరిగింది. -
నపుణ్యనారీ.. విజయాల భేరి
[ 20-05-2024]
కాలంతో పాటు పరిస్థితులూ మారుతున్నాయి. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన అతివలు.. నేడు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి కొత్త పుంతలు తొక్కుతున్నారు. -
అక్రమార్కులపై ఔదార్యం ఎందుకో..!
[ 20-05-2024]
ఇసుక అక్రమార్కులపై పోలీసు, రెవెన్యూ అధికారులు ఎనలేని ఔదార్యం చూపిస్తున్నారు. -
తిరుపతమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
[ 20-05-2024]
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు.ఆదివారం తెల్లవారుజాము నుంచే మొదలైన రద్దీ మధ్యాహ్నం వరకు కొనసాగింది. -
సీసాలో పెట్రోల్ పోయలేదని బెదిరింపుల
[ 20-05-2024]
సీసాలో లూజుగా పెట్రోల్ పోయనని చెప్పిన పెట్రోల్ బంక్ సిబ్బందిని బెదిరించడమే కాకుండా.. బంక్ను తగలబెడతానన్న యువకుడిపై గవర్నర్పేట పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. -
పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నేడు
[ 20-05-2024]
ఎన్టీఆర్ జిల్లా పవర్ లిఫ్టింగ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం తిరువూరు సాయిబాబా కల్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహిస్తామని ఆ సంఘం కార్యదర్శి వి.మల్లేశ్వరరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..