కృష్ణా డెల్టాకు జూన్ 10 నుంచి సాగు నీరు
కృష్ణా డెల్టాలో మూడు పంటలకు అవకాశం కల్పించేలా జూన్ 10 నుంచి సాగునీరు విడుదల చేస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ చెప్పారు. కలెక్టరేట్
నీటిపారుదల సలహామండలి సమావేశంలో మంత్రి జోగి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జోగి రమేష్. వేదికపై కలెక్టర్ రంజిత్బాషా,
జేసీ మహేష్కుమార్, ఎమ్మెల్యే నాని, జడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారిక తదితరులు
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్టుడే: కృష్ణా డెల్టాలో మూడు పంటలకు అవకాశం కల్పించేలా జూన్ 10 నుంచి సాగునీరు విడుదల చేస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ చెప్పారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం కలెక్టర్ రంజిత్బాషా అధ్యక్షతన నిర్వహించిన జిల్లా నీటిపారుదల సలహా మండలి, వ్యవసాయ సలహా మండలి సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పులిచింతల రిజర్వాయర్లో 32.75 టీఎంసీలు, నాగార్జునసార్ ప్రాజెక్టు కింద 184 టీఎంసీలు, శ్రీశైలం ప్రాజెక్టులో 35.81 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. పులిచింతల రిజర్వాయర్ నుంచి జూన్ 10న నీరు విడుదల చేస్తారన్నారు. ఖరీఫ్, రబీ సీజన్లకు మొత్తం 146 టీఎంసీలు, తాగునీటి కోసం 4.18 టీఎంసీల అవసరం ఉంటుందన్నారు. 2022-23 సంవత్సరానికి ప్రధాన కాల్వల కింద 5.70 లక్షల ఎకరాలు ఆయకట్టు నిర్దేశించుకోగా అందులో 5.25 లక్షల ఎకరాలకు జూన్ 10 నుంచే సాగునీరు అందుబాటులో ఉంటుందన్నారు. ఆపరేషన్ అండ్ మెయింటెన్స్(ఓ అండ్ ఎం) కింద 2021-22 సంవత్సరంలో చేపట్టిన పనులు సత్వరం అయ్యేలా చర్యలు తీసుకోవాలని, మరో రూ.48 కోట్ల పనులకు సల్పకాలిక టెండర్లు పిలిచి వెంటనే పనులు పూర్తి చేయాలని స్పష్టంచేశారు. ప్రాజెక్టు కమిటీ, డిస్ట్రిబ్యూటరీ కమిటీ, నీటి వినియోగదారుల సంఘ పరిధిలో రూ.87 కోట్లతో కాడా కమిటీ ఆమోదించిన తూడు, గుర్రపుడెక్క, పూడికతీత, గేట్ల మరమ్మతులు వంటి పనులు పూర్తి చేసినట్టు అధికారులు వివరించారు. సమావేశంలో పాల్గొన్న మచిలీపట్నం శాసనసభ్యుడు పేర్ని వెంకట్రామయ్య(నాని) మాట్లాడుతూ ఇరిగేషన్ పనులకు ఉద్దేశపూర్వకంగా కొందరు టెండరు వేసి పనులు చేయకుండా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, అటువంటి వారికి సహకరిస్తే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కలెక్టర్ రంజిత్బాషా, జడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారిక, కేడీసీసీబీ ఛైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్, జేసీ మహేష్కుమార్, ఇరిగేషన్ ఎస్ఈ గోపాల్, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
రైతుకు ఏ ఇబ్బందీ రానీయకూడదు
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న ప్రభుత్వ సిద్ధాంతానికి అనుగుణంగా అందరూ నడుచుకోవాలని మంత్రి జోగి స్పష్టం చేశారు. వ్యవసాయ మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే నెల మొదటి వారంలో ఆర్బీకేల ద్వారా ట్రాక్టర్లు, ఇతర యంత్ర పరికరాలు పంపిణీ చేస్తారన్నారు. రైతులు, మిల్లర్లు బాగుండాలని, ఎవరైనా మిల్లర్లు రైతులను నష్ట పెట్టాలని చూస్తే క్షమించేది లేదన్నారు. శానసభ్యుడు పేర్ని మాట్లాడుతూ ఈ-క్రాప్ నమోదు విషయంలో వ్యవసాయశాఖ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఈ ఏడాది రైతులు ఇబ్బందిపడాల్సి వచ్చిందనీ, రైతులకు ప్రత్యక్షంగా రశీదు ఇవ్వడం లేదని, వేసిన పంట ఒకటైతే నమోదు మరోటి చేశారని, ప్రభుత్వం వద్దన్న విత్తనాలు సైతం సాగుచేస్తే వాటిని మరోరకంగా నమోదు చేశారని చెబుతూ వ్యవసాయశాఖ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందిస్తూ ఈ-క్రాప్ నమోదు చేశాక తప్పనిసరిగా రైతుకు రశీదు ఇచ్చి, దాని కాపీని కార్యాలయంలో భద్రపర్చాలని చెప్పారు. రైస్మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణాజీరావు, సలహా మండలి అధ్యక్షులు జన్ను రాఘవరావు, మండలి సభ్యుడు నాగేశ్వరరావు పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. సలహామండలి సభ్యులు రామచంద్రరావు, పెరుమాళ్లు, శ్రీనివాసరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏమైనా ఇచ్చేస్తాం.. ఎంతైనా కొనేస్తాం!.. ఓట్ల కొనుగోలుకు బరితెగించిన వైకాపా
[ 02-05-2024]
ఆ నియోజకవర్గంలో ఓ సామాజిక వర్గం వారు తెదేపాకు మద్దతివ్వాలని నిర్ణయించారు. ఇది తెలిసిన వైకాపా ప్రజాప్రతినిధి అక్కడ వాలిపోయారు. అప్పటికప్పుడు రూ.10 లక్షల చెక్కు, రూ.3 లక్షలు నగదు ఇచ్చారు. తర్వాత ఓటుకు ఇంతని ఇస్తానని హామీ ఇచ్చారు. -
జనం గొంతులో.. జగన్ గరళం..!
[ 02-05-2024]
ప్రజారోగ్యం ప్రమాదంలో పడ్డప్పుడు పాలకులు ఏం చేయాలి? తాగునీరే గరళమై.. జనం ప్రాణాలనే బలి తీసుకుంటుంటే ఏం చర్యలు తీసుకోవాలి? -
నాడు జోరుమీదొచ్చారు.. నేడు జారుకున్నారు
[ 02-05-2024]
ఎన్నిక ప్రకటన ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు జోగి రమేష్ పోరంకి ద్వారకా రెసిడెన్సీలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతులు బుట్టదాఖలయ్యాయి. ఆన్లైన్లో నమోదు చేసి రశీదులు ఇచ్చినా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. -
పేరు రక్షితం.. నీరు కలుషితం
[ 02-05-2024]
ప్రజలకు రోజూ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు కావడం లేదు. చాలాచోట్ల డ్రెయిన్ల వెంబడి పైపులైన్లు ఉండడం.. లీకైన వాటిని మరమ్మతులు చేపట్టకపోవడంతో మురుగునీరు సరఫరా అవుతుందని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. -
ప్రతి పథకమూ దోపిడీ కోసమే
[ 02-05-2024]
రాష్ట్రంలో ఐదేళ్లలో అమలు చేసిన ప్రతి పథకాన్నీ తన దోపిడీకి అనుగుణంగా మార్చుకున్న జగన్, అతని టీంకు మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పి ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ కోరారు. -
ఈ ప్రశ్నకు జవాబు చెప్పు?
[ 02-05-2024]
‘నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి చేస్తున్నాం.. విద్యార్థులకు ఆంగ్లమాధ్యమంలో బోధనతో పాటు, టోఫెల్, స్లాష్, క్లాస్రూం ఎస్సెస్మెంట్ పరీక్షలు చేపడుతూ వారి సామర్థ్యాన్ని ఏ ప్రభుత్వం చేయలేని పద్ధతిలో పెంపొందిస్తున్నాం’ -
‘రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్’
[ 02-05-2024]
మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర అభివృద్ధిని సర్వనాశనం చేసిన ఘనుడు జగన్మోహన్రెడ్డి అని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. -
వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపుదాం
[ 02-05-2024]
వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపాలని కూటమి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని శింగరాయపాలెం, బల్లిపర్రు, కాకర్లమూడి, మడక, అచ్చయ్యవారిపాలెం, పుల్లపాడు తదితర గ్రామాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. -
చీకటి పాలన నుంచి విముక్తులవుదాం: కొల్లు
[ 02-05-2024]
ఐదేళ్ల చీకటి పాలన నుంచి విముక్తులయ్యేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, తెదేపా అభ్యర్థి కొల్లు రవీంద్ర కోరారు. -
దళిత వ్యతిరేకి జగన్: జవహర్
[ 02-05-2024]
దళిత వ్యతిరేకి జగన్మోహన్రెడ్డికి తగు రీతిన బుద్ధి చెప్పేందుకు అందరూ సంఘటితం కావాలని మాజీ మంత్రి, తెదేపా నాయకులు కేఎస్ జవహర్ కోరారు. -
సంక్షేమ పాలన తెదేపాతోనే సాధ్యం
[ 02-05-2024]
కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ అన్నారు. పెడన మండలం నందమూరు, జింజేరు, జింజేరు గౌడపాలెం గ్రామాల్లో బుధవారం -
తెదేపా అభ్యర్థులకు ఘన స్వాగతం
[ 02-05-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్, బందరు జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిల విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం రాత్రి వరకు ఉయ్యూరులో బైక్ ర్యాలీ జరిగింది. -
వైకాపా కుక్కర్ కూపన్ల కేసు కంచికే..!
[ 02-05-2024]
అజిత్సింగ్నగర్ తోటవారివీధిలోని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్లో ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్న వైకాపా కుక్కర్ కూపన్ల కేసు.. కంచికి చేరింది. -
వైద్యుడి కుటుంబం మృతి కేసులో విచారణ వేగవంతం
[ 02-05-2024]
పటమట పరిధిలో వైద్యుడు శ్రీనివాస్ కుటుంబం మృతి కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసును సీపీ స్వయంగా పర్యవేక్షిస్తుండంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేసి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. -
వెలంపల్లికి చేదు అనుభవం
[ 02-05-2024]
సెంట్రల్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావుకు మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నుంచి చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ఆయన 23, 62 డివిజన్లలో పర్యటించారు. -
కొడాలి నానిని నిలదీసిన గ్రామస్థులు
[ 02-05-2024]
వలివర్తిపాడు గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) బుధవారం ఎన్నికల ప్రచారం చేస్తుండగా..పలువురు మహిళలు ఆయన్ను తమ గ్రామంలో సమస్యలు పరిష్కరించలేదంటూ నిలదీశారు.