logo

Vijayawada: విజయవాడ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాం టికెట్‌ ధర పెంపు

దసరా పండుగ నేపథ్యంలో భక్తులు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్లాట్‌ఫాంపైకి..

Updated : 30 Sep 2022 07:53 IST

రైల్వేస్టేషన్‌(విజయవాడ): దసరా పండుగ నేపథ్యంలో భక్తులు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్లాట్‌ఫాంపైకి రాకపోకలను నియంత్రించేందుకు విజయవాడ రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫాం టికెట్‌ ధరను పెంచారు. టికెట్‌ ధరను  రూ.10 నుంచి రూ.30కి తాత్కాలికంగా పెంచుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పెంపు 30వ తేదీ అర్థరాత్రి 12గంటలను నుంచి అక్టోబరు 9వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని