ఆ చెడ్డ ‘అంకుల్’కు జీవిత ఖైదు: తీర్పు ఇచ్చిన విజయవాడ పోక్సో కోర్టు
విజయవాడ న్యాయవిభాగం తన కుమార్తె వయసు ఉన్న బాలికను నిత్యం లైంగికంగా వేధించి, ఆత్మహత్యకు కారకుడైన కామాంధుడికి న్యాయస్థానం శిక్ష విధించింది.
ఈనాడు, అమరావతి, న్యూస్టుడే, విజయవాడ న్యాయ విభాగం: తన కుమార్తె వయసు ఉన్న బాలికను నిత్యం లైంగికంగా వేధించి, ఆత్మహత్యకు కారకుడైన కామాంధుడికి న్యాయస్థానం శిక్ష విధించింది. రెండు నెలల పాటు నిత్యం అసభ్యకర మాటలతో ఇబ్బంది పెట్టడంతో భరించలేక అపార్ట్మెంట్పైకి వెళ్లి దూకి తనువు చాలించింది. ఈ కేసులో బాలికను లైంగిక వేధించి, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు నిందితుడు వినోద్ జైన్ (49)కు జీవిత ఖైదు, రూ.3లక్షల జరిమానా విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎస్.రజిని.. బుధవారం తీర్పు చెప్పారు. 2022, జనవరి 29న జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాలిక తాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే రోజు భవానీపురం పోలీసులు ఐపీసీ సెక్షన్లు 306, 354, 354ఏ, 354డి, 509, 506, పోక్సో చట్టంలోని 8, 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసును భవానీపురం పీఎస్ ఎస్సై ప్రసాద్ దర్యాప్తు చేశారు. ఈ కేసులో 20 మంది సాక్షుల వాంగ్మూలాలను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జీవీ నారాయణరెడ్డి, గుజ్జల నాగిరెడ్డి న్యాయస్థానంలో నమోదు చేయించారు. ఈ కేసులో నిందితుడిపై నేరారోపణ రుజువు అయింది. నిందితుడు 2022, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు రిమాండ్లోనే ఉన్నాడు.
ఐపీసీ సెక్షన్ 305 కింద జీవిత ఖైదు, రూ.లక్ష జరిమానా, పోక్సో సెక్షన్ 9 (ఎల్), 10 కింద ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.50వేలు జరిమానా, పోక్సో చట్టం సెక్షన్ 12 కింద మూడేళ్ల శిక్ష, రూ.50వేల జరిమానా, ఐపీసీ సెక్షన్ 354 కింద ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.50వేలు జరిమానా, ఐపీసీ సెక్షన్ 509 కింద మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.50వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలవుతాయని, రూ.3లక్షల జరిమానాలో.. రూ. 2.4లక్షలు బాలిక తల్లికి ఇవ్వాలని తీర్పులో చెప్పారు. బాధిత కుటుంబానికి పరిహారం వచ్చేలా చూడాలని కృష్ణా జిల్లా న్యాయసేవాధికార సంస్థను న్యాయమూర్తి ఆదేశించారు. బాలికను లైంగికంగా వేధించి ఆమె మరణానికి కారణమై, ఆమె తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురి అవ్వడానికి కారణమైన ఈ కేసును క్రూరమైన నేరంగా పరిగణించాలని న్యాయమూర్తి తీర్పులో వ్యాఖ్యానించారు.
భరించలేని మాటలతో కలత చెంది..
విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్లోని లోటస్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెంబర్ 43లో నివసించే వినోద్కుమార్ అలియాస్ వినోద్ జైన్ అదే అపార్ట్మెంట్లో నివసించే బాలిక (13) పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాడు. రెండు నెలల పాటు నిత్యం నరకం చూపించాడు. రోజూ ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చే సమయంలో బాలిక శరీర భాగాలను తాకుతూ అసభ్యకరంగా మాట్లాడేవాడు. జీన్స్లో అందంగా ఉన్నావు, నీ కాళ్లు పొడవుగా ఉన్నాయంటూ వెకిలిగా మాట్లాడుతూ ఇబ్బంది పెట్టేవాడు. మెట్లు, లిఫ్ట్ వద్ద నిందితుడు వెంబడిస్తూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అని బాలిక ఆందోళనకు గురైంది. మరో వైపు వినోద్జైన్ వేధింపులు ఆగకపోవడంతో 2022 జనవరి 29న సాయంత్రం 5.15లకు అపార్ట్మెంట్ టెర్రస్ పై నుంచి బాలిక దూకి ఆత్మహత్య చేసుకుంది.
సొంత దస్తూరితో రాసిన లేఖతో...
బాలిక చనిపోయే ముందు మూడు పేజీల లేఖ రాసింది. వినోద్ జైన్ వేధింపులతోనే తనువు చాలిస్తున్నట్లు పేర్కొంది. ‘అమ్మా.. నేను ఈ విషయాన్ని మొదట్లోనే చెప్పలేదు. నేను చాలా భయపడ్డాను. సిగ్గుగా భావించా. జీవితంలో ఇంకేదైనా సమస్య అయితే.. చనిపోయేదాన్ని కాదేమో. కానీ ఈ విషయంలో నేను ఏమీ చేయలేకపోయాను. దీనికి అంతటికీ కారణం వినోద్ జైన్. గత రెండు నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడు. తరచూ నా శరీరాన్ని తాకుతున్నాడు.’ అని బాలిక నోట్లో ఆంగ్లంలో రాసి ఆత్మహత్య చేసుకుంది. మిమ్మల్ని వదిలి వెళ్లాలని లేకపోయినా, నాకు తప్పని పరిస్థితి వచ్చిందని.. ఇదే నా చివరి రోజు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ రాసింది. దీంతో పాటు బాలిక సెల్ఫోన్, ట్యాబ్లోనూ తన ఆవేదనను అక్షరబద్ధం చేసింది. ఘటన జరగడానికి రెండు రోజుల ముందు తన సెల్ఫోన్లో ‘నాకు చనిపోవాలని ఉంది’ అంటూ 19 సార్లు టైప్ చేసింది. బాలిక సొంత దస్తూరీతో రాసిన లేఖ ఈ కేసులో కీలక సాక్ష్యంగా అక్కరకొచ్చింది. బాలిక రాతను ఫోరెన్సిక్ నిపుణులు ధ్రువీకరించారు. ఇదే నిందితుడికి శిక్ష పడేందుకు ఉపయోగపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల సిబ్బంది పొరపాటు.. పీవోకి గ్రహపాటు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మచిలీపట్నంలోని ఎన్నికల సామగ్రి స్వీకరణ(రిసీవింగ్) సిబ్బంది చేసిన పొరపాటుకు ఓ ఉపాధ్యాయుడి కుడి చేయి విరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గుడివాడ పట్టణానికి చెందిన షేక్.ఇబ్రహీం బేతవోలులోని ఎస్జీవీఎస్జీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. -
ఆధిక్యంపైనే అసలు ఆట!
[ 17-05-2024]
ఎన్నికలలో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ముఖ్యమైన లెక్కింపు ఘట్టం మిగిలే ఉంది. అభ్యర్థుల తలరాతలు, రాష్ట్ర భవితను నిర్దేశించే ఈ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి ఇంకా 18 రోజులు సమయం ఉంది. -
జగనొస్తే చుక్కలే!
[ 17-05-2024]
సీఎం జగన్ పర్యటన అంటేనే విజయవాడ నగర ప్రజలు హడలెత్తిపోతున్నారు. గురువారం సీఎం జగన్ విజయవాడ బెంజ్సర్కిల్ సమీపంలో ఐ-ప్యాక్ కార్యాలయానికి వచ్చారు. -
రాతిమండపం తొలగించి.. ప్రైవేటు దుకాణాలా?
[ 17-05-2024]
గత అయిదేళ్లుగా దుర్గ గుడిలో ఒక్క నిర్మాణం కట్టింది లేదు.. ఉన్నవాటిని కూల్చేయడమే.. పాలకుల అనాలోచిత నిర్ణయాలు.. అమ్మవారి ఆదాయాన్ని కరిగించేస్తుండగా...దిశా నిర్దేశం లేని ప్రణాళికలతో కాలహరణం చేయడం పరిపాటిగా మారిపోయింది.. -
కొనేవారున్నా.. కాయల్వేవ్!
[ 17-05-2024]
నున్న మార్కెట్ నుంచి నిత్యం ఎగుమతవుతున్న మామిడి దాదాపు 200 టన్నులు.. గతంలో ఇదే సమయంలో ఎగుమతులు 400 నుంచి 500 టన్నుల వరకు ఉండేవి. 2023లో టన్ను ధర రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు ఉండగా... ఈ ఏడాది రూ. 25 వేల నుంచి రూ. 35 వేల వరకు పలుకుతోంది. -
అందని వేతనం.. బతుకు భారం
[ 17-05-2024]
ఆరువేల వేతనం ఇస్తాం....ప్రతి నెలా నేరుగా ఖాతాల్లో జమ చేస్తామని పాలకులు చెప్పడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అనేకమంది మహిళలు పాఠశాలల్లో ఆయాలుగా చేరారు. -
గాయపర్చిన ఘటనలో కేసు నమోదు
[ 17-05-2024]
పెదపారుపూడి మండలం పాములపాడు శివారు దూళ్లవానిగూడెంలో వ్యక్తిని కొట్టి గాయపర్చిన ఘటనలో కేసు నమోదు చేశామని పెదపారుపూడి ఎస్ఐ రాజు గురువారం తెలిపారు. -
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
[ 17-05-2024]
జిల్లాలో పోలింగ్ ప్రక్రియ పూర్తయిన క్రమంలో.. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. ఏర్పాట్లపై కలెక్టరేట్లో గురువారం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. -
మిర్చి వ్యాపారి రూ.1.76 కోట్లకు ఐపీ?
[ 17-05-2024]
కంచికచర్లకు చెందిన ఒక మిర్చి వ్యాపారి ఐపీ దాఖలు చేసినట్లు తెలియడంతో అతడి ఇంటి వద్ద బాధితులు గురువారం ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచికచర్ల పట్టణానికి చెందిన మిర్చి వ్యాపారి దొడ్డా నరసింహారావు, అతని కుమారుడు వెంకట వాసుదేవకుమార్(వాసు) స్థానిక రైతుల నుంచి మిర్చి కొనుగోలు వ్యాపారం నిర్వహించేవారు. -
ఏళ్ల ఆశ.. నెరవేరక నిరాశ
[ 17-05-2024]
నగర పాలక సంస్థలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న టైంస్కేలు వర్కర్లు (గతంలో ఎన్నెమ్మార్లు), ఒప్పంద కార్మికులు, పొరుగు సేవల సిబ్బందిని ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది. -
కార్పొరేటర్ భర్త కోసం పోలీసుల గాలింపు
[ 17-05-2024]
విజయవాడ 42వ డివిజన్ కార్పొరేటర్ చైతన్యరెడ్డి భర్త ప్రసాద్రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రసాద్రెడ్డి పోలింగ్ రోజున రెండు బూత్ల వద్ద అనుచరులతో కలిసి వీరంగం సృష్టించి..ఒక మహిళతో సహా ముగ్గురిపై దాడులకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో తెలుగు యువకుడి దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
-
విశాఖలో ‘చంద్రగిరి’ దందా!!