ప్రాణాలకు లేదు పూచీ!
బెజవాడలో కాలినకడకన రోడ్డెక్కితే ప్రాణాలకు పూచీ లేకుండా పోతోంది. రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. ఫుట్పాత్లపై నడుద్దామన్నా అవకాశం లేకుండా పోతోంది.
4 నెలలు... 36 మంది మృత్యువాత
నగరంలో నడకదారుల ఆక్రమణల ఫలితం
ఈనాడు - అమరావతి
నగరంలోని ఏలూరు రోడ్డులో
బెజవాడలో కాలినకడకన రోడ్డెక్కితే ప్రాణాలకు పూచీ లేకుండా పోతోంది. రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. ఫుట్పాత్లపై నడుద్దామన్నా అవకాశం లేకుండా పోతోంది. పాదచారుల కోసం ఉద్దేశించిన ఫుట్పాత్లు ఆక్రమణలకు గురయ్యాయి. వాణిజ్య ప్రాంతాల్లో అయితే ఇది ఎక్కువగా ఉంటోంది. ఫలితంగా పాదచారులు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడవాల్సి వస్తోంది. రాత్రుళ్లు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. ఆక్రమణలను తొలగించాల్సిన నగరపాలక అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఎక్కువ జనసంచారం ఉండే బందరు రోడ్డు, ఏలూరు రోడ్డులో పరిస్థితి దారుణంగా ఉంది.
రోడ్లపై పాదచారులు నడిచేందుకు కచ్చితంగా ఫుట్పాత్లు నిర్మించాలి. నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరి. ఎలా నిర్మించాలన్న విషయంపైనా ప్రమాణాలు నిర్దేశిస్తున్నాయి. ఎత్తు 0.75 మీటర్లు, వెడల్పు 1.5 మీటర్లు ఉండాలి. విజయవాడలో అన్ని రోడ్ల నిడివి 53.4 కి.మీ. ఇందులో కేవలం 6.41 కి.మీలోనే ఫుట్పాత్ ఉంది. మిగిలిన 46.99 కి.మీ. లేదు. అంటే.. దాదాపు 88 శాతం రహదారులకు ఫుట్పాత్లే లేవు. ఉన్నవి కూడా ఆక్రమించేశారు. ఆక్రమణలు తొలగించాల్సిన వీఎంసీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. వాణిజ్య కేంద్రంగా ఎదిగిన విజయవాడ నగరానికి నిత్యం పలు జిల్లాల నుంచి ప్రజలు, వ్యాపారులు వివిధ అవసరాల నిమిత్తం వస్తుంటారు. ఫుట్పాత్లపై నడిచేందుకు అవకాశం లేక తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్లపైనే నడుస్తున్నారు. దీంతో రోడ్డు దాటాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. భద్రత కొరవడుతోంది. ఎటు వైపు నుంచి ఏ వాహనం ఢీకొంటుందో తెలియని పరిస్థితి. పద్మవ్యూహాన్ని చేధించిన చందంగా ఉంటోంది. వెరసి నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మృతుల సంఖ్య కూడా అధికంగా ఉంటోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు 36 మంది పాదచారులు రోడ్డు ప్రమాదాల్లో దుర్మరణం పాలయ్యారు. గాయాలపాలైన వారు ఇంతకు మూడింతల మంది ఉంటున్నారు.
వాణిజ్య ప్రాంతాల్లో దయనీయం...
* బందరు రోడ్డులో బెంజి సర్కిల్ నుంచి డీసీపీ బంగ్లా వరకు కాలు తీసి కాలు పెట్టేందుకు కూడా అవకాశం లేదు. ఈ ప్రాంతంలో హోటళ్లు, మాల్స్, రెస్టారెంట్లు, వస్త్ర దుకాణాలు, ఫ్యాన్సీ స్టోర్లు, ఎలక్ట్రానిక్స్ దుకాణాలు ఉన్నాయి. చాలా మంది మెట్లు, ర్యాంపులు నిర్మించారు.రి ఏలూరు రోడ్డులో ఐఎంఏ హాలు నుంచి విజయాటాకీసు కూడలి వరకు ఇదే పరిస్థితి. ఫర్నిచరు, పుస్తకాలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ దుకాణాలు ఉన్నాయి. వీరందరూ బహిరంగంగానే ఆక్రమించి తమ ఉత్పత్తులను ఫుట్పాత్లపైనే ఉంచుతున్నారు.రి రాజగోపాలాచారి వీధి, గవర్నర్పేట, ఐదో నెంబరు రోడ్డు, వన్టౌన్లో కేఆర్ మార్కెట్ ప్రాంతాల్లో పండ్ల వ్యాపారులు, బట్టల షాపులు, బంగారం దుకాణాల వారు ఆక్రమించేశారు.
ఫుట్పాత్ ఆక్రమణకు గురైన తీరిది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల సిబ్బంది పొరపాటు.. పీవోకి గ్రహపాటు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మచిలీపట్నంలోని ఎన్నికల సామగ్రి స్వీకరణ(రిసీవింగ్) సిబ్బంది చేసిన పొరపాటుకు ఓ ఉపాధ్యాయుడి కుడి చేయి విరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గుడివాడ పట్టణానికి చెందిన షేక్.ఇబ్రహీం బేతవోలులోని ఎస్జీవీఎస్జీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. -
ఆధిక్యంపైనే అసలు ఆట!
[ 17-05-2024]
ఎన్నికలలో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ముఖ్యమైన లెక్కింపు ఘట్టం మిగిలే ఉంది. అభ్యర్థుల తలరాతలు, రాష్ట్ర భవితను నిర్దేశించే ఈ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి ఇంకా 18 రోజులు సమయం ఉంది. -
జగనొస్తే చుక్కలే!
[ 17-05-2024]
సీఎం జగన్ పర్యటన అంటేనే విజయవాడ నగర ప్రజలు హడలెత్తిపోతున్నారు. గురువారం సీఎం జగన్ విజయవాడ బెంజ్సర్కిల్ సమీపంలో ఐ-ప్యాక్ కార్యాలయానికి వచ్చారు. -
రాతిమండపం తొలగించి.. ప్రైవేటు దుకాణాలా?
[ 17-05-2024]
గత అయిదేళ్లుగా దుర్గ గుడిలో ఒక్క నిర్మాణం కట్టింది లేదు.. ఉన్నవాటిని కూల్చేయడమే.. పాలకుల అనాలోచిత నిర్ణయాలు.. అమ్మవారి ఆదాయాన్ని కరిగించేస్తుండగా...దిశా నిర్దేశం లేని ప్రణాళికలతో కాలహరణం చేయడం పరిపాటిగా మారిపోయింది.. -
కొనేవారున్నా.. కాయల్వేవ్!
[ 17-05-2024]
నున్న మార్కెట్ నుంచి నిత్యం ఎగుమతవుతున్న మామిడి దాదాపు 200 టన్నులు.. గతంలో ఇదే సమయంలో ఎగుమతులు 400 నుంచి 500 టన్నుల వరకు ఉండేవి. 2023లో టన్ను ధర రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు ఉండగా... ఈ ఏడాది రూ. 25 వేల నుంచి రూ. 35 వేల వరకు పలుకుతోంది. -
అందని వేతనం.. బతుకు భారం
[ 17-05-2024]
ఆరువేల వేతనం ఇస్తాం....ప్రతి నెలా నేరుగా ఖాతాల్లో జమ చేస్తామని పాలకులు చెప్పడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అనేకమంది మహిళలు పాఠశాలల్లో ఆయాలుగా చేరారు. -
గాయపర్చిన ఘటనలో కేసు నమోదు
[ 17-05-2024]
పెదపారుపూడి మండలం పాములపాడు శివారు దూళ్లవానిగూడెంలో వ్యక్తిని కొట్టి గాయపర్చిన ఘటనలో కేసు నమోదు చేశామని పెదపారుపూడి ఎస్ఐ రాజు గురువారం తెలిపారు. -
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
[ 17-05-2024]
జిల్లాలో పోలింగ్ ప్రక్రియ పూర్తయిన క్రమంలో.. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. ఏర్పాట్లపై కలెక్టరేట్లో గురువారం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. -
మిర్చి వ్యాపారి రూ.1.76 కోట్లకు ఐపీ?
[ 17-05-2024]
కంచికచర్లకు చెందిన ఒక మిర్చి వ్యాపారి ఐపీ దాఖలు చేసినట్లు తెలియడంతో అతడి ఇంటి వద్ద బాధితులు గురువారం ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచికచర్ల పట్టణానికి చెందిన మిర్చి వ్యాపారి దొడ్డా నరసింహారావు, అతని కుమారుడు వెంకట వాసుదేవకుమార్(వాసు) స్థానిక రైతుల నుంచి మిర్చి కొనుగోలు వ్యాపారం నిర్వహించేవారు. -
ఏళ్ల ఆశ.. నెరవేరక నిరాశ
[ 17-05-2024]
నగర పాలక సంస్థలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న టైంస్కేలు వర్కర్లు (గతంలో ఎన్నెమ్మార్లు), ఒప్పంద కార్మికులు, పొరుగు సేవల సిబ్బందిని ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది. -
కార్పొరేటర్ భర్త కోసం పోలీసుల గాలింపు
[ 17-05-2024]
విజయవాడ 42వ డివిజన్ కార్పొరేటర్ చైతన్యరెడ్డి భర్త ప్రసాద్రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రసాద్రెడ్డి పోలింగ్ రోజున రెండు బూత్ల వద్ద అనుచరులతో కలిసి వీరంగం సృష్టించి..ఒక మహిళతో సహా ముగ్గురిపై దాడులకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో తెలుగు యువకుడి దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
-
విశాఖలో ‘చంద్రగిరి’ దందా!!