logo

‘వైకాపాను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి’

అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేసిన వైకాపాను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని తెదేపా విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్‌ పిలుపునిచ్చారు.

Published : 22 Apr 2024 05:09 IST

కేదారేశ్వరపేట, న్యూస్‌టుడే: అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేసిన వైకాపాను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని తెదేపా విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం 34వ డివిజన్‌లో తెదేపా నాయకురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కూటమి కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. జగన్‌ రాక్షసపాలనకు విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కూటమి గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ పార్టీ నాయకులు మహ్మద్‌ సుభానీ, ఎంఎస్‌ బేగ్‌, పైలా సోమినాయుడు, గంటా మాధవ చెంగలరావు, ఆడపాల వసంత్‌, జగదీష్‌, శివ, తేజ, మహ్మద్‌ ఖాజా తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని