logo

వి.వి.లక్ష్మీనారాయణకు రక్షణ కల్పించండి

జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ పూర్వ అధికారి వి.వి.లక్ష్మీనారాయణకు మైనింగ్‌ మాఫియా కింగ్‌ గాలి జనార్దన్‌రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని, తగు రక్షణ కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Published : 28 Apr 2024 03:17 IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విజయవాడ(అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే : జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ పూర్వ అధికారి వి.వి.లక్ష్మీనారాయణకు మైనింగ్‌ మాఫియా కింగ్‌ గాలి జనార్దన్‌రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని, తగు రక్షణ కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బళ్లారి ప్రాంతంలో అక్రమ మైనింగ్‌ చేస్తూ గాలి జనార్దన్‌రెడ్డి రూ.వేల కోట్లు ప్రజాధనం కొల్లగొట్టారని ఆరోపించారు. ఆ కేసులతో పాటు పలువురు అక్రమ సంపాదనాపరులకు సంబంధించిన కేసుల విచారణలో నాటి సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ వి.వి.లక్ష్మీనారాయణ కీలకపాత్ర పోషించారని తెలిపారు. గాలి జనార్దన్‌రెడ్డి నుంచి లక్ష్మీనారాయణకు ప్రాణహాని ఉందన్న విషయం వాస్తవమని, ఎన్నికల కమిషన్‌ తక్షణమే జోక్యం చేసుకుని రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల గాలి జనార్దన్‌రెడ్డిని భాజపా అక్కున చేర్చుకుందని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షాలు బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతూ అక్రమార్కులను భాజపాలో చేర్చుకుంటున్నారని రామకృష్ణ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని