AP PRC: అప్పటివరకు చర్చల్లేవ్.. మంత్రుల కమిటీకి లేఖ అందజేత
ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేసే వరకు చర్చలకు వెళ్లకూడదని పీఆర్సీ
అమరావతి: ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేసే వరకు చర్చలకు వెళ్లకూడదని పీఆర్సీ సాధన సమితి నిర్ణయించింది. ఉద్యమ కార్యాచరణపై ఇవాళ భేటీ అయిన పీఆర్సీ సాధన సమితిలోని ఉద్యోగ సంఘాల నేతలు పలు విషయాలపై చర్చించారు. చర్చలకు రావాలంటూ జీఏడీ ముఖ్య కార్యదర్శి ఆహ్వానించిన నేపథ్యంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో జీవోలు రద్దు చేయాలని కోరుతూ మంత్రుల కమిటీకి లేఖ రాశారు.
అనంతరం మంత్రుల కమిటీ ఆహ్వానం నేపథ్యంలో స్టీరింగ్ కమిటీ నేతలు ఆస్కార్ రావు, వైవీ రావు, హృదయరాజు, శివారెడ్డి తదితరులు సచివాలయానికి వెళ్లారు. ఈ మేరకు మంత్రుల కమిటీకి తమ నిరసన లేఖను అందజేశారు. ఆ లేఖలో ప్రధానంగా మూడు అంశాలను తమ డిమాండ్లుగా పేర్కొన్నారు. పీఆర్సీ జీవోల రద్దు, ఉద్యోగులకు పాత జీతాలు చెల్లింపు, పీఆర్సీపై అశుతోష్ మిశ్రా నివేదికను బయటపెట్టాలనే డిమాండ్లను లేఖలో ప్రస్తావించారు.
తదుపరి కార్యాచరణ కొనసాగుతుంది: ఆస్కార్రావు
లేఖ అందజేసిన అనంతరం స్టీరింగ్ కమిటీ నేత ఆస్కార్ రావు మీడియాతో మాట్లాడారు. మూడు ప్రధానాంశాలను పరిష్కరిస్తేనే చర్చలకు వస్తామని మంత్రుల కమిటీకి తెలిపామన్నారు. చర్చల ప్రక్రియ ఇవాళ జరగలేదని.. తమ తదుపరి కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకుండా చర్చలకు వెళ్లేది లేదని పునరుద్ఘాటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్