AndhraPradesh News: ఎన్టీఆర్, వైఎస్ఆర్..ఇద్దరికీ భారతరత్న ఇవ్వాలి: కొడాలి నాని
ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టిన సీఎం జగన్కు పాదాభివందనాలు చేస్తున్నట్లు మంత్రి కొడాలి నాని అన్నారు.
గుడివాడ: ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టిన సీఎం జగన్కు పాదాభివందనాలు చేస్తున్నట్లు మంత్రి కొడాలి నాని అన్నారు. విజయవాడకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయడాన్ని హర్షిస్తూ కృష్ణా జిల్లా గుడివాడలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరికీ భారతరత్న ఇవ్వాలన్నారు.
దీంతో పాటు గుడివాడలో క్యాసినో ఆరోపణల నేపథ్యంలో మరోసారి స్పందించారు. ‘‘గుడివాడలో క్యాసినో నిర్వహించామని తెదేపా నాయకులు అల్లరి చేశారు. క్యాసినోకు రూ.500కోట్లు వచ్చాయంటున్నారు. 50 క్యాసినోలు ఉన్న గోవాలో ఎన్ని వేల కోట్ల రూపాయలు రావాలి. గుడివాడలో నన్ను ఓడించలేకే లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు. ఇక్కడి ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. గుడివాడలో 3 రోజుల క్యాసినోకు 362రోజులు ప్రచారం చేస్తున్నారు. తెదేపా నేతలకు జీవితకాలం సమయమిచ్చా.. ఇక వాళ్ల ఇష్టం’’ అని కొడాలి నాని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్