AndhraPradesh News: ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌..ఇద్దరికీ భారతరత్న ఇవ్వాలి: కొడాలి నాని

ఎన్టీఆర్‌ జిల్లా పేరు పెట్టిన సీఎం జగన్‌కు పాదాభివందనాలు చేస్తున్నట్లు మంత్రి కొడాలి నాని అన్నారు.

Updated : 29 Jan 2022 15:07 IST

గుడివాడ: ఎన్టీఆర్‌ జిల్లా పేరు పెట్టిన సీఎం జగన్‌కు పాదాభివందనాలు చేస్తున్నట్లు మంత్రి కొడాలి నాని అన్నారు. విజయవాడకు ఎన్టీఆర్‌ జిల్లాగా నామకరణం చేయడాన్ని హర్షిస్తూ కృష్ణా జిల్లా గుడివాడలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి ఆయన క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌ ఇద్దరికీ భారతరత్న ఇవ్వాలన్నారు.

దీంతో పాటు గుడివాడలో క్యాసినో ఆరోపణల నేపథ్యంలో మరోసారి స్పందించారు. ‘‘గుడివాడలో క్యాసినో నిర్వహించామని తెదేపా నాయకులు అల్లరి చేశారు. క్యాసినోకు రూ.500కోట్లు వచ్చాయంటున్నారు. 50 క్యాసినోలు ఉన్న గోవాలో ఎన్ని వేల కోట్ల రూపాయలు రావాలి. గుడివాడలో నన్ను ఓడించలేకే లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు. ఇక్కడి ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. గుడివాడలో 3 రోజుల క్యాసినోకు 362రోజులు ప్రచారం చేస్తున్నారు. తెదేపా నేతలకు జీవితకాలం సమయమిచ్చా.. ఇక వాళ్ల ఇష్టం’’ అని కొడాలి నాని విమర్శించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని