logo

‘వైకాపా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి’

అన్న క్యాంటీన్లను మూసివేసిన వైకాపా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలనే ప్రతి సోమవారం ధర్మవరంలో అన్న క్యాంటీన్‌ వద్ద తెదేపా ఆధ్వర్యంలో అన్నదానం చేస్తున్నామని హిందూపురం పార్లమెంట్‌ అధికార ప్రతినిధి పురుషోత్తంగౌడ్‌, జడ్పీటీసీˆ మాజీ సభ్యుడు రామాంజనేయులు పేర్కొన్నారు.

Published : 04 Oct 2022 02:35 IST

అన్న క్యాంటీన్‌ వద్ద అన్నదానం చేస్తున్న తెదేపా నాయకులు

ధర్మవరం, న్యూస్‌టుడే: అన్న క్యాంటీన్లను మూసివేసిన వైకాపా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలనే ప్రతి సోమవారం ధర్మవరంలో అన్న క్యాంటీన్‌ వద్ద తెదేపా ఆధ్వర్యంలో అన్నదానం చేస్తున్నామని హిందూపురం పార్లమెంట్‌ అధికార ప్రతినిధి పురుషోత్తంగౌడ్‌, జడ్పీటీసీˆ మాజీ సభ్యుడు రామాంజనేయులు పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కూడలి వద్ద అన్న క్యాంటీన్‌ ఎదుట ప్రజలకు తెదేపా నాయకులు భోజనం వడ్డించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు పరిశే సుధాకర్‌, అంబటి సనత్‌, వెంకటేష్‌బాబు, విజయ్‌చౌదరి, భాస్కర్‌, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని