YSRCP: తమ్ముడి అండ.. సోదరుల దందా!
రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఓ వైకాపా నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాప్తాడులో మితిమీరుతున్న భూఅక్రమాలు
జోరుగా ఎర్రమట్టి, రేషన్ బియ్యం అక్రమ రవాణా
ఈనాడు డిజిటల్, అనంతపురం: రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఓ వైకాపా నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోదరులను ముందు పెట్టి అవినీతి వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ప్రతి భూవివాదంలోకి తలదూర్చి సెటిల్మెంట్లు చేస్తున్నారు. అమాయకులైన యజమానుల్ని బెదిరించి చౌకగా భూములు కొట్టేస్తున్నారు. ప్రకృతి సంపదను దోచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అవకాశం దొరికిన ప్రతి చోట, ప్రతి సందర్భంలో అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతూ రూ.కోట్లలో సంపాదించారనే విషయాన్ని నియోజకవర్గమంతా మొత్తం కోడై కూస్తోంది. సోదరుల అక్రమాలపై సొంత పార్టీలోనే వ్యతిరేక స్వరాలు వినిపిస్తుండటం గమనార్హం.
చెన్నేకొత్తపల్లి మండలంలో గుట్టను తవ్వి అక్రమంగా ఎర్రమట్టి తరలింపు
అనంతపురం గ్రామీణం పరిధిలోని కురుగుంట ఎస్టీ కుటుంబానికి చెందిన 5 ఎకరాల అసైన్డ్ భూమిని ఆక్రమించుకోవడానికి రాప్తాడు నాయకుడి సోదరుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. యజమానులు కొన్నేళ్లుగా అనుభవంలో లేరని.. భూమిని వెనక్కి తీసుకోవాలని రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇటీవలే ఆ భూమిలో బోరు వేయడానికి ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు.
వెంచర్లలో ఎకరాకు రూ.10 లక్షలు
రాప్తాడు పరిధిలో ఎవరు వెంచర్ అభివృద్ధి చేసినా ఆ ప్రజాప్రతినిధికి కమీషన్ సమర్పించుకోవాల్సిందే. భూమి ధరను బట్టి ఎకరాకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ముట్టజెప్పాలి. దీంతో స్థిరాస్తి వ్యాపారులు వెంచర్లకు అనుమతులు తీసుకోవడం లేదు. నియోజకవర్గ పరిధిలో 500 వరకు వెంచర్లు ఉండగా 98 శాతం వాటికి అనుమతులు లేవు. ముఖ్యంగా అనంతపురం గ్రామీణం పరిధిలో అన్ని లేఅవుట్ల నుంచి రూ.50 కోట్ల వరకు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
* తెదేపా హయాంలో బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఓ వ్యాపారి రియల్ఎస్టేట్ వెంచర్ ప్రారంభించారు. విలాసవంతమైన విల్లాలు నిర్మించి విక్రయాలు మొదలుపెట్టారు. వైకాపా అధికారంలోకి వచ్చాక వైకాపా నాయకుడి సోదరుడు సదరు వ్యాపారిని బెదిరించారు. అనుమతులు రద్దు చేయిస్తామని దౌర్జన్యం చేసి రూ.కోటి విలువ చేసే విల్లాను రాయించుకున్నట్లు తెలుస్తోంది.
* మరూర్ టోల్గేటు వద్ద అనంతపురానికి చెందిన వ్యక్తులు 7 ఎకరాల్లో వెంచర్ వేయాలనుకొని పొలం కొనుగోలు చేసి అనుమతులకు దరఖాస్తు చేశారు. ఆ సోదరులు ఎకరాకు రూ.10 లక్షలు డిమాండు చేశారు. దీనికి వారు నిరాకరించడంతో వెంచర్కు అనుమతులు రాకుండా అడ్డుకున్నట్లు సమాచారం.
ఉప్పరపల్లి పరిధిలో 10 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. నకిలీ డి.పట్టాలు సృష్టించి రైతుల పేరు మీద ఆన్లైన్ ఎక్కించారు. రైతులకు మాత్రం ఎకరాకు రూ.2.50 లక్షలు ఇచ్చి భూమిని బినామీల పేరుతో నమోదు రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ వ్యవహారంలో రాప్తాడు వైకాపా నాయకుడి సోదరుడి ముఖ్య అనుచరుడు చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. మధ్యవర్తితో విభేదాలు రావడంతో అతడిని బెదిరించారు.
* చెన్నేకొత్తపల్లి సమీపంలో అనంతపురానికి చెందిన కొందరు జాతీయ రహదారికి ఆనుకుని వెంచర్ ఏర్పాటు చేశారు. ప్లాట్లు వేసి రోడ్లు నిర్మిస్తున్న సమయంలో వైకాపా నాయకులు అడ్డుకున్నారు. ఎకరాకు రూ.10 లక్షలు ఇస్తేనే పనులు జరగనిస్తామని బెదిరించారు. దీంతో కొన్ని రోజలపాటు పనులు నిలిపివేశారు. ఇటీవల సదరు వైకాపా నాయకుడికి డబ్బులు చెల్లించి పనులు ప్రారంభించారు.
భూఅక్రమాలు ఇలా..
నియోజకవర్గంలో ఎలాంటి భూక్రయ విక్రయాలు జరిగినా ఆ ప్రజాప్రతినిధి సోదరులకు తెలియాల్సిందే. భూవివాదాల విషయంలో ఓ వర్గం నుంచి డబ్బులు తీసుకుని మరో వర్గంపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. అసైన్డ్ భూములకు సంబంధించి నకిలీ డి.పట్టాలు సృష్టించి పొలాలు కాజేస్తున్నారు. రెవెన్యూ అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి అనుకూలంగా పనులు చేయించుకుంటున్నారు. బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతూ రెచ్చిపోతున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు.
* చెన్నేకొత్తపల్లి మండల పరిధిలోని కోనక్రాస్ సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని 20 ఏళ్ల కిందట ఓ వ్యక్తికి ప్రభుత్వం 4 ఎకరాలు కేటాయించింది. అయితే సదరు భూమిని తమకు 30 ఏళ్ల కిందటే అసైన్డ్ చేశారంటూ సదరు వైకాపా నాయకుడి సోదరుడి అనుచరులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. భూమిలో ఉన్న మామిడి తోటను నరికేశారు.
* రాప్తాడు పంచాయతీ పరిధిలో గత ప్రభుత్వ హయాంలో ఆటోనగర్ కోసం 58 ఎకరాలు కేటాయించారు. అందులో 5 ఎకరాలను కొట్టేయాలని సోదరులు ప్రణాళికలు వేశారు. గతంలో 27 ఎకరాలు మాత్రమే కేటాయించారని, మిగిలిన భూమిని స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారిపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో సదరు అధికారి సెలవు పెట్టి వెళ్లిపోయారు.
* చెన్నేకొత్తపల్లి సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని ఓ వ్యక్తికి 5 ఎకరాల పొలం ఉంది. యజమానులకు తెలియకుండానే సంబంధం లేని వ్యక్తితో ఎకరా రూ.25 లక్షలు చొప్పున రూ.కోటిన్నర చెల్లించినట్లు అగ్రిమెంట్ చేసుకున్నారు. భూమి తాము కొన్నామని యజమానిపై దౌర్జన్యం చేస్తున్నారు. దీంతో యజమాని హైకోర్టును ఆశ్రయించారు.
పేదల బియ్యాన్నీ బొక్కేస్తున్నారు
పేదల బియ్యాన్ని కూడా వదలడం లేదు. చెన్నేకొత్తపల్లిని కేంద్రంగా రేషన్ బియ్యాన్ని కర్ణాటకకు తరలిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి బియ్యాన్ని సేకరించి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఓ ప్రైవేట్ దాబాలో నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి రాత్రి సమయాల్లో కర్ణాటకలోని రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ స్టిక్కర్లు ఉన్న బియ్యం బస్తాలను శ్రీసత్యసాయి జిల్లా పోలీసులు పట్టుకోగా.. ఒత్తిడి తీసుకొచ్చి విడిపించుకున్నారు. నెలకు రూ.30 లక్షల వరకు జేబులో వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
* రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని కొండలు, గుట్టలను కొల్లగొట్టి ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. అనుచరులకు పనుల్ని అప్పగించి రోజువారీ కమీషన్లు దండుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే వందల టిప్పర్ల మట్టిని లేఅవుట్లకు సరఫరా చేస్తున్నారు. స్థానికులు ఫిర్యాదు చేస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు.
* ఆత్మకూరు మండలంలోని కొన్ని గ్రామాలను పేకాట స్థావరాలుగా మార్చి దందా చేస్తున్నారు. ముఖ్య అనుచరులు కొందరు వ్యవసాయ పొలాల్లో స్థావరాలు ఏర్పాటు చేసి జోరుగా జూదం ఆడిస్తున్నారు. నిత్యం రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. ఇటీవల దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో నిలిపివేసినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తు.. ఎక్కడ జగన్?
[ 04-05-2024]
మాట తప్పను.. మడమ తిప్పను అన్నాడు.. సీఎం అయ్యాక మాట తప్పాడు.. హామీలను మడత పెట్టేశాడు. అన్నదాతలను నిలువునా ముంచేశాడు. -
రాప్తాడు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో గందరగోళం
[ 04-05-2024]
రాప్తాడు నియోజకవర్గ ఓపీవోల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్యోగులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. డిక్లరేషన్ ఫాం (13ఏ)పై ఆథరైజేషన్ అధికారి ముద్ర లేకుండానే ఓట్లు వేయించారని ఆందోళన చేపట్టారు. -
రెండో రోజూ తప్పని నిరీక్షణ
[ 04-05-2024]
పింఛను సొమ్ము కోసం పండుటాకులు రెండో రోజూ అవస్థలు పడ్డారు. గురువారం బ్యాంకుల వద్ద పడిగాపులు కాచిన చాలామందికి డబ్బులు డ్రా చేసుకునే అవకాశం లభించలేదు. -
తహసీల్దారు కార్యాలయానికి తాళం వేసి.. రైతుల రాస్తారోకో
[ 04-05-2024]
ఓబుళదేవరచెరువు తహసీల్దారు ఖాజాబీ తీరును నిరసిస్తూ శుక్రవారం కదిరి - హిందూపురం ప్రధాన రహదారిపై తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు రాస్తారోకో నిర్వహించారు. -
పుత్రరత్నం.. చేసేవన్నీ అక్రమం
[ 04-05-2024]
నోరు తెరిస్తే మా అంత సుద్దపూసలు లేరని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చెప్పుకొంటారు. -
ఎండిన నేలల్ని చూడవు.. రాలుతున్న కన్నీళ్లను ఆపవు
[ 04-05-2024]
అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు తెదేపా హయాంలో జరిగిన పలు కాలువలు, జలాశయాల నిర్మాణ పనులను వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా అపేసింది. -
మాట తప్పి.. మడమ తిప్పి.. సంక్షేమ క్యాలెండరు మడత పెట్టి
[ 04-05-2024]
ఏ ఒక్క విద్యార్థీ ఫీజు కట్టలేదని చదువు మధ్యలోనే ఆపేయకూడదు. ఏ ఒక్క బిడ్డనూ కళాశాలలు ఫీజులు కట్టలేదని వేధించకూడదు. మీ బిడ్డల చదువుకు అయ్యే ఖర్చంతా మీ బిడ్డ జగన్ తీసుకొని మీరు అప్పుల పాలుకాకుండా త్రైమాసికం పూర్తి కాగానే మీ ఖాతాల్లోకి సొమ్ము జమ అవుతుంది. -
ప్రకాశ్రెడ్డీ.. చేతనైతే వలసలు ఆపు : సునీత
[ 04-05-2024]
రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి చేతనైతే వైకాపా నుంచి వలసలు ఆపుకోవాలని మాజీ మంత్రి పరిటాల సునీత సవాల్ విసిరారు. -
అసమర్థ నాయకుడిని ఓడిస్తేనే అభివృద్ధి: కేశవ్
[ 04-05-2024]
నియోజకవర్గం అభివృద్ధి మార్గాన పయనించాలంటే అసమర్థుడైన వైకాపా అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డిని ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓడించాలని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు. -
5న ధర్మవరానికి అమిత్షా, చంద్రబాబు, పవన్ రాక
[ 04-05-2024]
ఈ నెల 5న ధర్మవరానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ వస్తున్నారని శ్రీసత్యసాయి జిల్లా భాజపా అధ్యక్షుడు జీఎం శేఖర్ తెలిపారు. -
అభివృద్ధి, సంక్షేమం.. సమతూకమే లక్ష్యం
[ 04-05-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో సామాన్య ప్రజల జీవనం అతలాకుతలం అయ్యింది. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. దానికి తగ్గట్లు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో వారి జీవన ప్రమాణాలు పడిపోయాయని ఉరవకొండ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
ఐదేళ్లకొచ్చారు జగన్
[ 04-05-2024]
ముఖ్యమంత్రి జగన్కు హిందూపురం అంటే గుర్తుకు వచ్చేది ఎన్నికల సమయంలోనే. మిగిలిన సమయాల్లో ఇది రాష్ట్రంలో ఒక్క నియోజకవర్గం అనేది గుర్తు లేదు. -
2,350 ఈవీఎంల ర్యాండమైజేషన్
[ 04-05-2024]
లోక్సభ స్థానంలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ సాఫీగా సాగిందని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?