logo

అరాచక పాలనను సాగనంపేందుకు సిద్ధం

వైకాపా అరాచక పాలనకు రాష్ట్ర ప్రజలు త్వరలోనే చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు.

Published : 20 Apr 2024 03:38 IST

తగ్గుపర్తిలో ఓటు అభ్యర్థిస్తున్న ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌

బెళుగుప్ప, న్యూస్‌టుడే: వైకాపా అరాచక పాలనకు రాష్ట్ర ప్రజలు త్వరలోనే చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. బెళుగుప్ప మండలం రామసాగరం, జీడిపల్లి, వీరాంజనేయకొట్టాల, కోనంపల్లి, దుద్దేకుంట, అంకంపల్లి, తగ్గుపర్తి, బెళుగుప్ప గ్రామాల్లో శుక్రవారం రోడ్‌షో నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి, కళాశాలలు, రహదారులు, ఇంటి స్థలాలు, వేలల్లో ఇళ్ల మంజూరు  తెదేపా హయాంలో జరిగాయన్నారు. వైకాపా నాయకులు ఒక్కటైనా గుర్తుండే పని చేశారా అన్ని ప్రశ్నించారు. జీడిపల్లి గ్రామంలో ఆయన మహిళతో మాట్లాడుతూ మద్య నిషేదాన్ని సీఎం ఎక్కడ అమలు చేశారని ప్రశ్నించారు. కన్వీనర్‌ ప్రసాద్‌,  వీరాంజి, తిమ్మప్ప, విజయ్‌కృష్ణ, రాధాకృష్ణ, తిప్పయ్య, విరుపాపల్లి రాధాకృష్ణ, మల్లి, జీడిపల్లి గ్రామ సర్పంచి వెంకటనాయుడు, పవన్‌, భాజపా నాయకులు లక్ష్మీనారాయణ, జనసేన శ్రేణులు గౌతమ్‌, సుధీర్‌ పాల్గొన్నారు. జీడిపల్లి గ్రామంలో వైకాపా కార్యకర్తలు మధు, శివ ఎమ్మెల్యే సమక్షంలో తెదేపాలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని