కొండలు కరిగించి.. నిధులు కొల్లగొట్టి
అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు మట్టి వ్యాపారుల అవతారమెత్తి కొండలను కరిగించేశారు. కదిరి ప్రాంతంలోని
ఐదేళ్లలో వైకాపా నాయకుల ధన దాహానికి ప్రకృతి వనరులు మాయం
కదిరి పట్టణం, కదిరి గ్రామీణం, గాండ్లపెంట, తనకల్లు, న్యూస్టుడే: అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు మట్టి వ్యాపారుల అవతారమెత్తి కొండలను కరిగించేశారు. కదిరి ప్రాంతంలోని వందల ఎకరాల్లో విస్తరించిన కొండలపై కన్నేసిన నాయకులు వాటిని యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. మైనింగ్, రెవెన్యూ అధికారులపై ప్రజాప్రతినిధులతో ఒత్తిడి పెంచుతూ ప్రకృతిని అందవికారంగా మారుస్తూ వాతావరణ సమతౌల్యతను దెబ్బతీస్తున్నారు. మట్టి వ్యాపారంతో కోట్లాదిరూపాయలు దండుకున్నారు. మట్టి వ్యాపారుల ధనదాహానికి రూపుకోల్పోయిన కొండల్లో మచ్చుకు కొన్ని..
రహదారి మాటున వ్యాపారం
రూపుకోల్పోయిన భైరవుని కొండ
కదిరి మండలం ముత్యాలచెరువు, కదిరి రెవెన్యూ పొలం మధ్యలో 216 ఎకరాల్లో విస్తరించిన భైరవుని కొండను మట్టి కోసం తవ్వేశారు. కదిరి బాహ్యవలయ రహదారి పనులు చేస్తున్న గుత్తేదారు మొదట్లో రాయల్టీ చెల్లించి కొంతమట్టిని తవ్వుకున్నారు. దీనిని అదనుగా చేసుకున్న మట్టివ్యాపారులు రెచ్చిపోయారు. రేయింబవళ్లు తేడాలేకుండా కొండను తొలిచేశారు. పట్టణానికి సమీపంలో పచ్చనిచెట్లతో కనిపిస్తున్న ఈ కొండ ప్రస్తుతం గుంతలయమంగా మారింది. బైపాస్ రోడ్డు పేరుతో మరికొందరు అక్రమార్కులు మట్టిని కొల్లగొట్టి పట్టణంలో వివిధ నిర్మాణాలకు అమ్ముకున్నారు.
గుట్టుగా తవ్వేశారు..
గాండ్లపెంట మండలం పోరెడ్డివారిచెరువు సమీపంలోని గుట్టను గుట్టుగా చదును చేశారు. స్థిరాస్తి వ్యాపారుల లేఅవుట్ల ఎత్తుపెంచుకోవడానికి అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధుల కన్ను గుట్టపై పడింది. ఎకరాల మేర పొక్లెయిన్లతో గుట్టను తవ్వేసి టిప్పర్ల ద్వారా మట్టిని తరలించి జేబులు నింపుకొన్నారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ గోదాము నిర్మాణం కోసం గుట్టను చదును చేయించారు. ఇక్కడి మట్టి నాణ్యతగా ఉండటంతో వ్యాపారుల కన్నుపడింది. దీంతో గాండ్లపెంట, కదిరి పట్టణానికి తరలించి సొమ్ము చేసుకున్నారు. స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా స్పందించి మట్టిని తరలించినవారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మట్టి వ్యాపారుల బరితెగింపు
భారీ ఎత్తున తవ్వేసిన పందికోన కొండ
కదిరి, నల్లచెరువు మండలాల మధ్య 715 ఎకరాల్లో విస్తరించింది కొండ పందికోన. నల్లచెరువు మండలం అల్లుగుండు రెవెన్యూ పొలంలోని సర్వేనంబరు-1లోని ఈకొండ 20 గ్రామాల పశువుల కాపరులకు అండగా ఉంటోంది. వందలాది గొర్రెలు, మేకల గ్రాసానికి ఇదే ఆధారం. ఇలాంటి కొండపై కదిరి మండలానికి చెందిన కొందరు వైకాపా నాయకుల కన్నుపడింది. రేయి, పగలు తేడా లేకుండా ఇటాచీలు, పొక్లెయిన్లతో వందల ఎకరాల విస్తీర్ణంలో కొండను తవ్వేశారు. ఈ మట్టిని పట్టణంలోని లేఅవుట్లు, వివిధ భవన నిర్మాణానికి ఒక్కో టిప్పర్ రూ.3 వేలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. అడ్డుకునేందుకు యత్నించిన మైనింగ్శాఖ జిల్లా అధికారులనే దుర్భాషలాడుతూ ప్రజాప్రతినిధితో చీవాట్లు పెట్టించారు. మట్టివ్యాపారుల దాష్టీకం వల్ల కొండపైకి పశువులు వెళ్లే మార్గం కూడా లేకుండాపోయిందని కాపారులు వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తు.. ఎక్కడ జగన్?
[ 04-05-2024]
మాట తప్పను.. మడమ తిప్పను అన్నాడు.. సీఎం అయ్యాక మాట తప్పాడు.. హామీలను మడత పెట్టేశాడు. అన్నదాతలను నిలువునా ముంచేశాడు. -
రాప్తాడు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో గందరగోళం
[ 04-05-2024]
రాప్తాడు నియోజకవర్గ ఓపీవోల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్యోగులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. డిక్లరేషన్ ఫాం (13ఏ)పై ఆథరైజేషన్ అధికారి ముద్ర లేకుండానే ఓట్లు వేయించారని ఆందోళన చేపట్టారు. -
రెండో రోజూ తప్పని నిరీక్షణ
[ 04-05-2024]
పింఛను సొమ్ము కోసం పండుటాకులు రెండో రోజూ అవస్థలు పడ్డారు. గురువారం బ్యాంకుల వద్ద పడిగాపులు కాచిన చాలామందికి డబ్బులు డ్రా చేసుకునే అవకాశం లభించలేదు. -
తహసీల్దారు కార్యాలయానికి తాళం వేసి.. రైతుల రాస్తారోకో
[ 04-05-2024]
ఓబుళదేవరచెరువు తహసీల్దారు ఖాజాబీ తీరును నిరసిస్తూ శుక్రవారం కదిరి - హిందూపురం ప్రధాన రహదారిపై తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు రాస్తారోకో నిర్వహించారు. -
పుత్రరత్నం.. చేసేవన్నీ అక్రమం
[ 04-05-2024]
నోరు తెరిస్తే మా అంత సుద్దపూసలు లేరని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చెప్పుకొంటారు. -
ఎండిన నేలల్ని చూడవు.. రాలుతున్న కన్నీళ్లను ఆపవు
[ 04-05-2024]
అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు తెదేపా హయాంలో జరిగిన పలు కాలువలు, జలాశయాల నిర్మాణ పనులను వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా అపేసింది. -
మాట తప్పి.. మడమ తిప్పి.. సంక్షేమ క్యాలెండరు మడత పెట్టి
[ 04-05-2024]
ఏ ఒక్క విద్యార్థీ ఫీజు కట్టలేదని చదువు మధ్యలోనే ఆపేయకూడదు. ఏ ఒక్క బిడ్డనూ కళాశాలలు ఫీజులు కట్టలేదని వేధించకూడదు. మీ బిడ్డల చదువుకు అయ్యే ఖర్చంతా మీ బిడ్డ జగన్ తీసుకొని మీరు అప్పుల పాలుకాకుండా త్రైమాసికం పూర్తి కాగానే మీ ఖాతాల్లోకి సొమ్ము జమ అవుతుంది. -
ప్రకాశ్రెడ్డీ.. చేతనైతే వలసలు ఆపు : సునీత
[ 04-05-2024]
రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి చేతనైతే వైకాపా నుంచి వలసలు ఆపుకోవాలని మాజీ మంత్రి పరిటాల సునీత సవాల్ విసిరారు. -
అసమర్థ నాయకుడిని ఓడిస్తేనే అభివృద్ధి: కేశవ్
[ 04-05-2024]
నియోజకవర్గం అభివృద్ధి మార్గాన పయనించాలంటే అసమర్థుడైన వైకాపా అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డిని ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓడించాలని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు. -
5న ధర్మవరానికి అమిత్షా, చంద్రబాబు, పవన్ రాక
[ 04-05-2024]
ఈ నెల 5న ధర్మవరానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ వస్తున్నారని శ్రీసత్యసాయి జిల్లా భాజపా అధ్యక్షుడు జీఎం శేఖర్ తెలిపారు. -
అభివృద్ధి, సంక్షేమం.. సమతూకమే లక్ష్యం
[ 04-05-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో సామాన్య ప్రజల జీవనం అతలాకుతలం అయ్యింది. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. దానికి తగ్గట్లు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో వారి జీవన ప్రమాణాలు పడిపోయాయని ఉరవకొండ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
ఐదేళ్లకొచ్చారు జగన్
[ 04-05-2024]
ముఖ్యమంత్రి జగన్కు హిందూపురం అంటే గుర్తుకు వచ్చేది ఎన్నికల సమయంలోనే. మిగిలిన సమయాల్లో ఇది రాష్ట్రంలో ఒక్క నియోజకవర్గం అనేది గుర్తు లేదు. -
2,350 ఈవీఎంల ర్యాండమైజేషన్
[ 04-05-2024]
లోక్సభ స్థానంలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ సాఫీగా సాగిందని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?