వైకాపా పతనానికి రోజులు దగ్గర పడ్డాయి : కేశవ్
వైకాపా ప్రభుత్వ పతనానికి రోజులు దగ్గర పడ్డాయని ఉరవకొండ తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
పయ్యావుల కేశవ్, అంబికా లక్ష్మీనారాయణను సత్కరిస్తున్న స్థానికులు
కూడేరు(ఉరవకొండ), న్యూస్టుడే: వైకాపా ప్రభుత్వ పతనానికి రోజులు దగ్గర పడ్డాయని ఉరవకొండ తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆయన కూడేరు మండలం ఉదిరిపికొండ, ఉదిరిపికొండ తండా, మరుట్ల-1,2,3, శివరాంపేట తదితర గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణతో కలిసి రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధిని విస్మరించిన వైకాపా ప్రభుత్వం కనీసం గ్రామాల్లో తాగునీటి సదుపాయాన్ని కల్పించిన దాఖలాలు లేవన్నారు. కొన్ని గ్రామాలు తెదేపాకు అనుకూలంగా ఉన్నాయన్న భావనతో నీటిని బంద్ చేయించిన ఘనత ఇక్కడి వైకాపా నాయకులకే చెల్లుతుందన్నారు. సామాన్య ప్రజలపైనా రాజకీయాన్ని రుద్దడం దారుణం అన్నారు. తెదేపా అధికారంలోకి వస్తే సూపర్సిక్స్ పథకాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధిని చేపట్టనుందని తెలిపారు. ప్రజలంతా తెదేపా గెలుపునకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీధర్ చౌదరి, నాయకులు మరుట్ల రవి, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపండి
[ 11-05-2024]
ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపాలని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన ఉరవకొండలోని డ్రైవర్ కాలనీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. -
తెదేపా గెలుపునకు యువత కసితో పని చేయాలి: కాలవ
[ 11-05-2024]
తెదేపా గెలుపునకు యువత కసి, పట్టుదలతో శ్రమించాలని రాయదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. పట్టణ సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన తెలుగు యువత ఆత్మీయ సమావేశంలో కాలవ మాట్లాడారు. -
శృతి మించుతున్న వైకాపా ఆగడాలు: పరిటాల సునీత
[ 11-05-2024]
ఆత్మకూరు, చెన్నేకొత్తపల్లి : ఐదేళ్ల వైకాపా దుష్టపాలనకు ముగింపు పలుకుదామని అందుకు ప్రజలంతా అండగా నిలవాలని రాప్తాడు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని పరిటాల సునీత, హిందూపురం పార్లమెంట్ తెదేపా అభ్యర్థి బీకే పార్థసారథి పేర్కొన్నారు. -
దోపిడీ ప్రభుత్వాన్ని తరిమికొడదాం
[ 11-05-2024]
అడుగడుగునా దోపిడీకి పాల్పడుతూ, ప్రజలకు ఇబ్బందులు పెడుతున్న వైకాపా ప్రభుత్వాన్ని ఓటుతో తరిమి కొడదామని రాయదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. -
ముస్లింల సంక్షేమం తెదేపాతోనే సాధ్యం
[ 11-05-2024]
ముస్లింల సంక్షేమం, అభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. శుక్రవారం ఆయన ఉరవకొండలోని ఆయా మసీదుల్లో ముస్లింలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. -
తెదేపాలోకి వైకాపా నాయకుల చేరిక
[ 11-05-2024]
మండలంలోని దురదకుంట గ్రామంలో వైకాపాకు చెందిన 13 కుటుంబాలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. శుక్రవారం అమిలినేని సురేంద్రబాబు వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. -
అక్రమార్జనకు అద్దె ట్రాక్టర్లు
[ 11-05-2024]
శ్రీసత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. అధికార పార్టీ నాయకుల అక్రమార్జనకు కాదేదీ అనర్హం అన్నట్లుంది పుట్టపర్తిలో పరిస్థితి. -
జనసేన నాయకులపై వైకాపా వర్గీయుల దాడి
[ 11-05-2024]
పుట్టపర్తితో వైకాపా నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడటంతో ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం పట్టణంలోని చిత్రావతిగుట్ట 7, 8 వార్డుల్లో వైకాపా నాయకులు ఓటర్లకు నగదు పంపిణీ చేస్తుండగా తెదేపా నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. -
ప్రధాన పార్టీ ప్రలోభాల పర్వం
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారపర్వం చివరి అంకానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా గెలవాలని ఓ ప్రధాన పార్టీ ప్రలోభాల పర్వానికి తెరలేపింది. క్షేత్రస్థాయిలో తీవ్రమైన ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న ఆ పార్టీ నాయకులు డబ్బులిచ్చి ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారు. -
వైకాపాతో అంటకాగిన ఉద్యోగులపై ఫిర్యాదులు
[ 11-05-2024]
ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ కొందరు ఉద్యోగులు వైకాపా కార్యకర్తలుగా పని చేస్తున్నారు. వైకాపాకు అనుకూలంగా పని చేస్తున్నారంటూ పలువురి ఉద్యోగులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. -
88 శాతం పోస్టల్ బ్యాలెట్
[ 11-05-2024]
పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగులు స్ఫూర్తిని చాటారు. ఎన్నడూ లేనంతగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓట్లు వేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత కారణంగానే ఈస్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయని రాజకీయ విశ్లేషకుల అంచనా.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు