logo

వైకాపా పతనానికి రోజులు దగ్గర పడ్డాయి : కేశవ్‌

వైకాపా ప్రభుత్వ పతనానికి రోజులు దగ్గర పడ్డాయని ఉరవకొండ తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు.

Published : 28 Apr 2024 03:42 IST

పయ్యావుల కేశవ్‌, అంబికా లక్ష్మీనారాయణను సత్కరిస్తున్న స్థానికులు

కూడేరు(ఉరవకొండ), న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వ పతనానికి రోజులు దగ్గర పడ్డాయని ఉరవకొండ తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆయన కూడేరు మండలం ఉదిరిపికొండ, ఉదిరిపికొండ తండా, మరుట్ల-1,2,3, శివరాంపేట తదితర గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధిని విస్మరించిన వైకాపా ప్రభుత్వం కనీసం గ్రామాల్లో తాగునీటి సదుపాయాన్ని కల్పించిన దాఖలాలు లేవన్నారు. కొన్ని గ్రామాలు తెదేపాకు అనుకూలంగా ఉన్నాయన్న భావనతో నీటిని బంద్‌ చేయించిన ఘనత ఇక్కడి వైకాపా నాయకులకే చెల్లుతుందన్నారు. సామాన్య ప్రజలపైనా రాజకీయాన్ని రుద్దడం దారుణం అన్నారు. తెదేపా అధికారంలోకి వస్తే సూపర్‌సిక్స్‌ పథకాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధిని చేపట్టనుందని తెలిపారు. ప్రజలంతా తెదేపా గెలుపునకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీధర్‌ చౌదరి, నాయకులు మరుట్ల రవి, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని