పంట అమ్మాలంటే కర్ణాటక వెళ్లాల్సిందే..
ఉరవకొండ నియోజకవర్గంలో రైతులు పంట దిగుబడులను అమ్ముకోవడానికి పడుతున్నట్లు ఇబ్బందులు వర్ణనాతీతం.
రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పించని వైకాపా ప్రభుత్వం
నిరుపయోగంగా గోదాములు
ఉరవకొండ, న్యూస్టుడే: ఉరవకొండ నియోజకవర్గంలో రైతులు పంట దిగుబడులను అమ్ముకోవడానికి పడుతున్నట్లు ఇబ్బందులు వర్ణనాతీతం. స్థానికంగా మార్కెట్ యార్డులు ఉన్నా.. అన్నదాతలకు ప్రయోజనం చేకూరడం లేదు. ఉరవకొండలో రెండున్నర దశాబ్దాల క్రితం వ్యవసాయ మార్కెట్యార్డు ఏర్పాటు చేశారు. దాని పరిధిలో ఐదు మండలాలు ఉన్నాయి. మొత్తం 40వేల మందికిపైగా రైతులు ఉన్నారు. 50వేల హెక్టార్లకుపైగా పంటలు సాగవుతాయి. వాటిలో వేరుసెనగ, కంది, మిరప సాగు అధికం. యార్డులో విశాలమైన ప్రాంగణం, గోదాములు నిర్మించినా పంటల క్రయవిక్రయాలు సాగడం లేదు. ఇక్కడి రైతులు తమ ఉత్పత్తులను కర్ణాటకలోని బళ్లారితోపాటు వివిధ ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. ఒకవేళ అక్కడి మార్కెట్లలో గిట్టుబాటు ధర లేకపోతే ఉత్పత్తులను వెనక్కి తీసుకురావాలన్నా.. అక్కడే నిల్వ ఉంచాలన్నా మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి.
పట్టించుకోని పాలకవర్గం
ఉరవకొండ పరిసరాల్లో సాగైన పంటలను ఎక్కువ మంది రైతులు మార్కెట్ యార్డులో ఆరబెట్టుకోవడం, అక్కడే చెట్ల కింద నిల్వ ఉంచుకోవడం చేస్తుంటారు. యార్డు ప్రాంగణం మిరప నిల్వలతో నిండుగా కనిపిస్తుంది. పంటలకు బహిరంగ మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. దీన్ని నిత్యం చూస్తున్న మార్కెట్ పాలకవర్గం, ప్రభుత్వ యంత్రాంగం యార్డును అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదు. కనీసం రైతుల ఇబ్బందులను ప్రస్తావించడానికి యార్డు పాలకవర్గం చొరవ చూపడం లేదు. విశాలమైన యార్డులో శీతల గిడ్డంగులు నిర్మిస్తే రైతులకు ఎంతో ఉపకరించనున్నాయి. ముఖ్యంగా మిరప రైతులకు అగచాట్లు తీరనున్నాయి. వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో ఆ దిశగా కనీస చర్యలు చేపట్టలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాన పార్టీ ప్రలోభాల పర్వం
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారపర్వం చివరి అంకానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా గెలవాలని ఓ ప్రధాన పార్టీ ప్రలోభాల పర్వానికి తెరలేపింది. క్షేత్రస్థాయిలో తీవ్రమైన ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న ఆ పార్టీ నాయకులు డబ్బులిచ్చి ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారు. -
వైకాపాతో అంటకాగిన ఉద్యోగులపై ఫిర్యాదులు
[ 11-05-2024]
ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ కొందరు ఉద్యోగులు వైకాపా కార్యకర్తలుగా పని చేస్తున్నారు. వైకాపాకు అనుకూలంగా పని చేస్తున్నారంటూ పలువురి ఉద్యోగులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. -
88 శాతం పోస్టల్ బ్యాలెట్
[ 11-05-2024]
పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగులు స్ఫూర్తిని చాటారు. ఎన్నడూ లేనంతగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓట్లు వేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత కారణంగానే ఈస్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయని రాజకీయ విశ్లేషకుల అంచనా.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు