logo

అధికార పార్టీకి ఓటుతో బుద్ధి చెబుదాం

అన్ని రంగాల్లో అభివృద్ధిని మరిచిన వైకాపా ప్రభుత్వానికి ఓట్లతో బుద్ధి చెప్పాలని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు పిలుపునిచ్చారు.

Published : 30 Apr 2024 04:47 IST

మలయనూరులో ప్రజలకు అభివాదం చేస్తున్న అమిలినేని
కుందుర్పి, న్యూస్‌టుడే: అన్ని రంగాల్లో అభివృద్ధిని మరిచిన వైకాపా ప్రభుత్వానికి ఓట్లతో బుద్ధి చెప్పాలని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు పిలుపునిచ్చారు. మండలంలోని నాగేపల్లి, కొల్లారట్టి, శీగలపల్లి, మలయనూరు, బండమీదపల్లి, నిజవళ్లి, వెంకటంపల్లి, బొమ్మాజిపల్లి, తమ్మయ్యదొడ్డి గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం, రోడ్‌షో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రజలు, కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. గజమాలలతో సురేంద్రబాబును సత్కరించారు. నాగేపల్లి, శీగలపల్లి, మలయనూరు గ్రామాల్లో వైకాపా నుంచి పలు కుటుంబాలు అమిలినేని సమక్షంలో తెదేపాలో చేరారు. కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షుడు ధనుంజయ, నాయకులు రాజ్‌కుమార్‌, మంజునాథ, గంగాధర్‌, షణ్ముఖ, మడివాళప్ప, తిప్పేస్వామి, నారాయణరెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని