logo

కాలుపై సమాధానాలు రాసుకొచ్చిన విద్యార్థిని

డిగ్రీ పరీక్షల్లో ఓ విద్యార్థిని కాలు మీద సమాధానాలు రాసుకొని పరీక్ష కేంద్రానికి హాజరైంది. గుర్తించిన ఇన్విజిలేటర్‌ డిబార్‌ చేశారు. అనంతపురం ఎస్‌ఎల్‌ఎన్‌ డిగ్రీ కళాశాలలో ఈ మాస్‌కాపీయింగ్‌ చోటు చేసుకొంది.

Published : 05 May 2024 03:34 IST

విద్యార్థిని కాలుపై సమాధానాలు

ఎస్కే యూ, న్యూస్‌టుడే: డిగ్రీ పరీక్షల్లో ఓ విద్యార్థిని కాలు మీద సమాధానాలు రాసుకొని పరీక్ష కేంద్రానికి హాజరైంది. గుర్తించిన ఇన్విజిలేటర్‌ డిబార్‌ చేశారు. అనంతపురం ఎస్‌ఎల్‌ఎన్‌ డిగ్రీ కళాశాలలో ఈ మాస్‌కాపీయింగ్‌ చోటు చేసుకొంది. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో జరుగుతున్న యూజీ 2, 6 సెమిస్టర్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు విద్యార్థులను డిబార్‌ చేసినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ తెలిపారు. అనంతపురం ఎస్‌ఎల్‌ఎన్‌, ఎస్వీ డిగ్రీ కళాశాలల్లో ఒక్కొక్కరు డిబార్‌ అయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని