రైళ్ల నిరీక్షణ!
తిరుపతి రైల్వేస్టేషన్లో రైళ్ల తాకిడి, ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు రూపొందించి తిరుచానూరు రైల్వేస్టేషన్ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది.
అందుబాటులోకి రాని తిరుచానూరు రైల్వేస్టేషన్
నిర్మించిన ప్లాట్ఫామ్
తిరుపతి రైల్వేస్టేషన్లో రైళ్ల తాకిడి, ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు రూపొందించి తిరుచానూరు రైల్వేస్టేషన్ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. స్టేషన్ అన్ని వసతులు పూర్తి చేసుకున్నా.. ప్రారంభోత్సవానికి నోచుకోలేదు.
తిరుపతి (రైల్వే), న్యూస్టుడే: తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో రైళ్లలో ప్రయాణించే వారే అధికం. రోజుకు 80 నుంచి 90 రైళ్లలో సుమారు 40 వేల మంది వస్తుంటారు. దీంతో స్టేషన్లోని ప్లాట్ఫామ్లపై రైళ్ల నిలుపుదలకు ఆటంకం ఏర్పడుతుండటంతో కూతవేటు దూరంలో కొన్ని రైళ్లను గంటల తరబడి నిలిపివేయాల్సిన పరిస్థితి. దీన్ని అధిగమించేందుకు తిరుచానూరు రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేయాలని సంకల్పించింది.
2016-17లో రూ.56.38 కోట్లు మంజూరు చేయగా.. రూ.36 కోట్లతో గుంతకల్ డివిజన్ నిర్మాణ సంస్థ నేతృత్వంలో తిరుచానూరు స్టేషన్ను బీ క్లాస్ స్టేషన్గా అన్ని సౌకర్యాలతో నిర్మాణం చేపట్టింది. మూడు ప్లాట్ఫామ్లు, షెల్టర్లు, ప్ల్లాట్పామ్లపై ప్రయాణికులు వేచి ఉండటానికి బెంచీలు, నీటి సౌకర్యం, ఆహార కేంద్రాలు, వెయిటింగ్ హాళ్లు, సబ్వే, స్టేషన్ మేనేజర్ కార్యాలయం, వీఐపీ లాంజ్, మహిళలకు నిరీక్షణ గదులు, రిజర్వేషన్, బుకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ లాకింగ్ సిస్టం పనులు పూర్తి చేశారు. విశాలవంతమైన పార్కింగ్తో పాటు టాక్సీస్టాండ్, బస్సులు నిలుపు స్థలం కేటాయించారు.
ప్రారంభిస్తే తీరనున్న సమస్యలు
తిరుపతికి రాకపోకలు సాగించడానికి అనుకూలంగా ఉన్న స్టేషన్లు తిరుపతి, రేణిగుంట. సాధారణంగా తిరుపతికి ఉదయం సమయంలో చేరుకునే రైళ్లు, సాయంత్రం బయలుదేరే రైళ్లు అధికంగా ఉంటాయి. ఆయా సమయాల్లో స్టేషన్ బయట ట్రాఫిక్, పార్కింగ్కు ఇబ్బందిగా ఉంటోంది. ఈ క్రమంలో తిరుచానూరు రైల్వేస్టేషన్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు ఎంచుకున్న రైలును నిర్దేశిత సమయంలో అందుకోవచ్చు. తిరుపతి- రేణిగుంట మధ్యలో తిరుచానూరు రైల్వేస్టేషన్ ప్రధాన రహదారికి పక్కనే ఉండటం, ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో ప్రయాణికులు సులభంగా గమ్యానికి చేరుకోవచ్చు.
షెల్టర్ల నిర్మాణం జరుగుతోంది
ప్రయాణికులకు అవసరమైన వసతులు కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. రెండో ప్లాట్ఫామ్కు షెల్లర్లు లేవు. అందుకోసం ప్రదిపాదనలు పంపాం. అనుమతులు వచ్చాయి. త్వరితగతిన పనులు పూర్తిచేసి స్టేషన్ను అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రస్తుతం స్టేషన్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
కె.సత్యనారాయణ, తిరుపతి రైల్వేస్టేషన్ డైరెక్టర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుమల ప్రక్షాళనకు వేళాయె..!
[ 16-06-2024]
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో పలు సమస్యలు తిష్ఠవేశాయి. దర్శనానికి దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తుండగా గత ప్రభుత్వ హయాంలో సమస్యలు పరిష్కారం కాకపోగా మరింత సంక్లిష్టంగా మారినట్లు ఆరోపణలున్నాయి. -
విలువల పుస్తకం.. బతుకు సంతకం
[ 16-06-2024]
బతుకు బండిని లాగే శ్రామికుడు అప్పుల తెడ్డులతో ఒడ్డుకు చేర్చే నావికుడు సుఖ సౌధాల అధిరోహణకు సోపానాలు నిర్మించిన కార్మికుడు కష్టాల చీకట్లలో సంతోషాల వెలుగులు పంచిన రేడు జీవన చెట్టును శాఖోపశాఖలుగా విస్తరింపజేసిన బాంధవుడు -
తోతాపురి మామిడి కాయల ధర పతనం
[ 16-06-2024]
మామిడిలో సింహభాగం వాణిజ్య పంట తోతాపురి మామిడికాయలు ధరలు మార్కెట్లో రోజురోజుకు పతనమవుతున్నాయి. -
నేడు తితిదే ఈవోగా శ్యామలరావు బాధ్యతల స్వీకారం
[ 16-06-2024]
తితిదే కార్యనిర్వహణాధికారిగా జె.శ్యామలరావు బాధ్యతలు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ముగిసిన తిరుపడి సిరి సంత
[ 16-06-2024]
మహతి ఆడిటోరియంలో మూడురోజుల పాటు జరిగిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు శనివారంతో ముగిశాయి. -
నెరవేరని ప్రభుత్వ ఆశయం
[ 16-06-2024]
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సాగు, తాగునీరు అందించాలనే ఉద్దేశంతో నిర్మించిన హంద్రీనీవా కాలువలో నీరు పారలేదు. -
హామీలు అమలుతో ప్రజలకు చేరువ చేస్తాం
[ 16-06-2024]
దేశ చరిత్రలో మొదటిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఐదు పథకాలను అమలు చేస్తూ సంతకాలు చేయడం చరిత్రాత్మకమని చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలుగా గెలిచిన జగన్మోహన్, మురళీమోహన్ పేర్కొన్నారు. -
శతాధిక వృద్ధురాలి మృతి
[ 16-06-2024]
మండలంలోని వీరప్పల్లె పంచాయతీ మంగప్పల్లె గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు మృతి చెందింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 36 గంటలు
-
ఫాదర్స్ డే.. స్పెషల్ ఫొటోలు పంచుకున్న చిరంజీవి, అల్లు అర్జున్
-
అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు : ఎలాన్ మస్క్
-
ముఖ్య విషయాల్లో భారత్తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో
-
నీతి ఆయోగ్ చెప్పిందదే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై పీవీ రమేష్ కీలక వ్యాఖ్యలు
-
తిరుమల ప్రక్షాళనకు వేళాయె..!