మళ్లీ అధికారంలోకి వస్తే అంతుచూస్తాం
మా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది.. అప్పుడు మీఅంతు చూస్తాం.. అంటూ తెదేపా నాయకుడు, కుప్పం పురపాలిక ఐదోవార్డు తంబిగానిపల్లెకు చెందిన కౌన్సిలర్ సెల్వం, మరొకరిపై వైకాపా కార్యకర్తలు దాడిచేసిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో బుధవారం చోటుచేసుకుంది.
తెదేపా కౌన్సిలర్పై వైకాపా శ్రేణుల దాడి
దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెదేపా నాయకుడు, 5వ వార్డు కౌన్సిలర్ సెల్వం, కార్యకర్త అశోక్
కుప్పం పట్టణం, న్యూస్టుడే: మా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది.. అప్పుడు మీఅంతు చూస్తాం.. అంటూ తెదేపా నాయకుడు, కుప్పం పురపాలిక ఐదోవార్డు తంబిగానిపల్లెకు చెందిన కౌన్సిలర్ సెల్వం, మరొకరిపై వైకాపా కార్యకర్తలు దాడిచేసిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో బుధవారం చోటుచేసుకుంది. ఎంపీటీసీ మాజీ సభ్యుడు నరేంద్ర దుకాణం వద్ద కూర్చుని ఉండగా వైకాపా గూండాలు ప్రణాళికాబద్ధంగా వచ్చి దాడి చేసినట్లు కౌన్సిలర్ ఆవేదన వ్యక్తం చేశారు. సెల్వంను రక్షించేందుకు వెళ్లిన తెదేపా కార్యకర్త అశోక్పై రాడ్డు, తూకం త్రాసుతో దాడిచేసి రక్తం వచ్చేలా కొట్టారు. మళ్లీ వైకాపా ప్రభుత్వమే వస్తుందని.. అప్పుడు మీఅంతు చూస్తామంటూ వైకాపా కార్యకర్తలు సాయికిరణ్, యమరాజ్, నాగరత్నంలు దుర్భాషలాడుతూ, బెదిరింపులకు గురిచేసినట్లు బాధితులు వాపోయారు. సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ తమను ఇబ్బంది పెట్టేందుకు యత్నించారన్నారు. గాయపడిన వారిద్దరినీ కుప్పం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అశోక్ తలపై మూడు కుట్లు పడ్డాయి. సెల్వం చేతికి, నడుముకు గాయం కావడంతో చికిత్స పొందుతున్నారు. తమకు రక్షణ కరవైందని, ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో అలజడి సృష్టించేందుకు యత్నిస్తున్నారని కౌన్సిలర్ ఆరోపించారు. కుప్పం అర్బన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.
బీసీవై పార్టీ కార్యకర్త భార్యపై కత్తితో..
పుంగనూరు గ్రామీణ : భారత చైతన్య యువజన పార్టీ కార్యకర్త శంకర భార్య అంజమ్మపై వైకాపా వర్గీయులు దాడికి పాల్పడ్డారు. మాగాండ్లపల్లి పంచాయతీ బరినేపల్లికి చెందిన బీసీవై కార్యకర్త శంకర, సదుం అల్లర్లలో ఉన్నారని ఈనెల 19న పోలీసులుË అరెస్టు చేశారు. తన భర్తను అన్యాయంగా అరెస్ట్ చేయించారని అంజమ్మ గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్తలు చంద్రశేఖర్, పురుషోత్తములను నిలదీశారు. దీంతో వారు ఆగ్రహించి కత్తితో తీవ్రంగా గాయపరిచారు. గ్రామస్థులు అంజమ్మను ఆసుపత్రికి తరలించారు. ఏఎస్ఐ దామోదరం కేసు దర్యాప్తు చేస్తున్నారు.
దాడి చేసిన వారిని ఉపేక్షించేది లేదు : చంద్రబాబు
కుప్పం పురపాలిక 5వ వార్డు తంబిగానిపల్లె కౌన్సిలర్ సెల్వం, తెదేపా కార్యకర్త అశోక్పై వైకాపా గూండాల దాడి అమానుషమని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు అసహనం వ్యక్తం చేశారు. బుధవారం కౌన్సిలర్, తెదేపా కార్యకర్తపై జరిగిన దాడిపై నియోజకవర్గ తెదేపా ముఖ్య నాయకులతో టెలీ కాన్ఫరెన్స్లో అడిగి తెలుసుకున్నారు. దాడి చేసిన వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేయించి, బాధితులకు అండగా ఉండాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఇన్ఛార్జి పీఎస్ మునిరత్నం, పీఏ మనోహర్ తదితరులకు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుమల ప్రక్షాళనకు వేళాయె..!
[ 16-06-2024]
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో పలు సమస్యలు తిష్ఠవేశాయి. దర్శనానికి దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తుండగా గత ప్రభుత్వ హయాంలో సమస్యలు పరిష్కారం కాకపోగా మరింత సంక్లిష్టంగా మారినట్లు ఆరోపణలున్నాయి. -
విలువల పుస్తకం.. బతుకు సంతకం
[ 16-06-2024]
బతుకు బండిని లాగే శ్రామికుడు అప్పుల తెడ్డులతో ఒడ్డుకు చేర్చే నావికుడు సుఖ సౌధాల అధిరోహణకు సోపానాలు నిర్మించిన కార్మికుడు కష్టాల చీకట్లలో సంతోషాల వెలుగులు పంచిన రేడు జీవన చెట్టును శాఖోపశాఖలుగా విస్తరింపజేసిన బాంధవుడు -
తోతాపురి మామిడి కాయల ధర పతనం
[ 16-06-2024]
మామిడిలో సింహభాగం వాణిజ్య పంట తోతాపురి మామిడికాయలు ధరలు మార్కెట్లో రోజురోజుకు పతనమవుతున్నాయి. -
నేడు తితిదే ఈవోగా శ్యామలరావు బాధ్యతల స్వీకారం
[ 16-06-2024]
తితిదే కార్యనిర్వహణాధికారిగా జె.శ్యామలరావు బాధ్యతలు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ముగిసిన తిరుపడి సిరి సంత
[ 16-06-2024]
మహతి ఆడిటోరియంలో మూడురోజుల పాటు జరిగిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు శనివారంతో ముగిశాయి. -
నెరవేరని ప్రభుత్వ ఆశయం
[ 16-06-2024]
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సాగు, తాగునీరు అందించాలనే ఉద్దేశంతో నిర్మించిన హంద్రీనీవా కాలువలో నీరు పారలేదు. -
హామీలు అమలుతో ప్రజలకు చేరువ చేస్తాం
[ 16-06-2024]
దేశ చరిత్రలో మొదటిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఐదు పథకాలను అమలు చేస్తూ సంతకాలు చేయడం చరిత్రాత్మకమని చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలుగా గెలిచిన జగన్మోహన్, మురళీమోహన్ పేర్కొన్నారు. -
శతాధిక వృద్ధురాలి మృతి
[ 16-06-2024]
మండలంలోని వీరప్పల్లె పంచాయతీ మంగప్పల్లె గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు మృతి చెందింది.
తాజా వార్తలు (Latest News)
-
క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గిల్ను వెనక్కి పంపారా..? బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే..
-
ఏపీలో దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ రాజీనామా
-
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 36 గంటలు
-
ఫాదర్స్ డే.. స్పెషల్ ఫొటోలు పంచుకున్న చిరంజీవి, అల్లు అర్జున్
-
అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు : ఎలాన్ మస్క్
-
ముఖ్య విషయాల్లో భారత్తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో