వెళ్లి రావమ్మా గంగమ్మా..!
సకల లోకాలను ఏలే సర్వమంగళి గంగమ్మ తల్లి నిమజ్జన వేడుకల సందర్భంగా బుధవారం రాత్రి చిత్తూరు నగర వీధులు జనసంద్రాన్ని తలపించాయి.
ముగిసిన చిత్తూరు నడవీధి గంగమ్మ జాతర
ప్రత్యేక ఆకర్షణగా ఓంశక్తి భక్తుల విన్యాసాలు
విద్యుదీపాల వెలుగులో నడివీధి గంగమ్మ
చిత్తూరు(క్రీడలు), న్యూస్టుడే: సకల లోకాలను ఏలే సర్వమంగళి గంగమ్మ తల్లి నిమజ్జన వేడుకల సందర్భంగా బుధవారం రాత్రి చిత్తూరు నగర వీధులు జనసంద్రాన్ని తలపించాయి. డప్పు వాయిద్యాల దరువులకు చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర సంబరాలు అంగరంగ వైభవంగా సాగాయి. జాతర వంశపారంపర్య ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే సీకేబాబు కుటుంబంతో కలిసి.. స్థానిక పొన్నియమ్మన్ ఆలయం నుంచి ఊరేగింపుగా బయల్దేరి వెళ్లి గంగమ్మకు సారె సమర్పించారు. అనంతరం అమ్మవారు నిమజ్జనానికి బయల్దేరారు. దారి పొడవునా అమ్మవారిపై భక్తులు పెద్దఎత్తున పూలవర్షాన్ని కురిపించారు. నిమజ్జనోత్సవంలో భాగంగా ఓంశక్తి భక్తుల సాహసోపేత విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు నోటికి శూలాలు గుచ్చుకుని, వీపు, కాలికి ఇనుప కొక్కీలు బిగించి వాహనాలు లాగుతూ వచ్చి హైరోడ్ వద్ద అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
హై రోడ్లో గంగమ్మకు పూలమాల వేస్తున్న ఓంశక్తి భక్తుడు
గంగమ్మకు సారెను తీసుకెళ్తున్న ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే సీకేబాబు కుటుంబ సభ్యులు
చెంపపై శూలం గుచ్చుకుని
తలపై అమ్మవారి విగ్రహంతో ..
కిక్కిరిసిన నగరవీధులు
డప్పు కళాకారుల ప్రదర్శన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుమల ప్రక్షాళనకు వేళాయె..!
[ 16-06-2024]
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో పలు సమస్యలు తిష్ఠవేశాయి. దర్శనానికి దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తుండగా గత ప్రభుత్వ హయాంలో సమస్యలు పరిష్కారం కాకపోగా మరింత సంక్లిష్టంగా మారినట్లు ఆరోపణలున్నాయి. -
విలువల పుస్తకం.. బతుకు సంతకం
[ 16-06-2024]
బతుకు బండిని లాగే శ్రామికుడు అప్పుల తెడ్డులతో ఒడ్డుకు చేర్చే నావికుడు సుఖ సౌధాల అధిరోహణకు సోపానాలు నిర్మించిన కార్మికుడు కష్టాల చీకట్లలో సంతోషాల వెలుగులు పంచిన రేడు జీవన చెట్టును శాఖోపశాఖలుగా విస్తరింపజేసిన బాంధవుడు -
తోతాపురి మామిడి కాయల ధర పతనం
[ 16-06-2024]
మామిడిలో సింహభాగం వాణిజ్య పంట తోతాపురి మామిడికాయలు ధరలు మార్కెట్లో రోజురోజుకు పతనమవుతున్నాయి. -
నేడు తితిదే ఈవోగా శ్యామలరావు బాధ్యతల స్వీకారం
[ 16-06-2024]
తితిదే కార్యనిర్వహణాధికారిగా జె.శ్యామలరావు బాధ్యతలు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ముగిసిన తిరుపడి సిరి సంత
[ 16-06-2024]
మహతి ఆడిటోరియంలో మూడురోజుల పాటు జరిగిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు శనివారంతో ముగిశాయి. -
నెరవేరని ప్రభుత్వ ఆశయం
[ 16-06-2024]
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సాగు, తాగునీరు అందించాలనే ఉద్దేశంతో నిర్మించిన హంద్రీనీవా కాలువలో నీరు పారలేదు. -
హామీలు అమలుతో ప్రజలకు చేరువ చేస్తాం
[ 16-06-2024]
దేశ చరిత్రలో మొదటిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఐదు పథకాలను అమలు చేస్తూ సంతకాలు చేయడం చరిత్రాత్మకమని చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలుగా గెలిచిన జగన్మోహన్, మురళీమోహన్ పేర్కొన్నారు. -
శతాధిక వృద్ధురాలి మృతి
[ 16-06-2024]
మండలంలోని వీరప్పల్లె పంచాయతీ మంగప్పల్లె గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు మృతి చెందింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గిల్ను వెనక్కి పంపారా..? బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే..
-
ఏపీలో దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ రాజీనామా
-
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 36 గంటలు
-
ఫాదర్స్ డే.. స్పెషల్ ఫొటోలు పంచుకున్న చిరంజీవి, అల్లు అర్జున్
-
అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు : ఎలాన్ మస్క్
-
ముఖ్య విషయాల్లో భారత్తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో