logo

శ్రీవారికి గోదాదేవి మాలలు

శ్రీ వేంకటేశ్వరస్వామికి మహా భక్తురాలైన(ఆండాళ్‌ అమ్మవారు) శ్రీ గోదాదేవి పరిణయోత్సవం పురస్కరించుకుని గోదా మాలలు శ్రీవారి మూలవిరాట్‌కు ఆదివారం అలంకరించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని ఆండాళ్‌ శ్రీ గోదాదేవి చెంత నుంచి ప్రత్యేక మాలలు తిరుమల పెద్దజీయర్‌స్వామి మఠానికి ఆదివారం ఉదయం

Published : 17 Jan 2022 03:13 IST

గోదాదేవి మాలలు తీసుకువస్తున్న జీయ్యంగార్లు, డిప్యూటీ ఈవో తదితరులు

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీ వేంకటేశ్వరస్వామికి మహా భక్తురాలైన(ఆండాళ్‌ అమ్మవారు) శ్రీ గోదాదేవి పరిణయోత్సవం పురస్కరించుకుని గోదా మాలలు శ్రీవారి మూలవిరాట్‌కు ఆదివారం అలంకరించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని ఆండాళ్‌ శ్రీ గోదాదేవి చెంత నుంచి ప్రత్యేక మాలలు తిరుమల పెద్దజీయర్‌స్వామి మఠానికి ఆదివారం ఉదయం చేరుకున్నాయి. అక్కడి నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో శ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీ చిన్నజీయర్‌ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్‌బాబు, పేష్కార్‌ శ్రీహరి, గోవిందరాజస్వామి ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో రాజేంద్రుడు, వీజీవో బాలిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని