రైళ్ల నిరీక్షణ!
తిరుపతి రైల్వేస్టేషన్లో రైళ్ల తాకిడి, ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు రూపొందించి తిరుచానూరు రైల్వేస్టేషన్ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది.
అందుబాటులోకి రాని తిరుచానూరు రైల్వేస్టేషన్
నిర్మించిన ప్లాట్ఫామ్
తిరుపతి రైల్వేస్టేషన్లో రైళ్ల తాకిడి, ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు రూపొందించి తిరుచానూరు రైల్వేస్టేషన్ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. స్టేషన్ అన్ని వసతులు పూర్తి చేసుకున్నా.. ప్రారంభోత్సవానికి నోచుకోలేదు.
తిరుపతి (రైల్వే), న్యూస్టుడే: తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో రైళ్లలో ప్రయాణించే వారే అధికం. రోజుకు 80 నుంచి 90 రైళ్లలో సుమారు 40 వేల మంది వస్తుంటారు. దీంతో స్టేషన్లోని ప్లాట్ఫామ్లపై రైళ్ల నిలుపుదలకు ఆటంకం ఏర్పడుతుండటంతో కూతవేటు దూరంలో కొన్ని రైళ్లను గంటల తరబడి నిలిపివేయాల్సిన పరిస్థితి. దీన్ని అధిగమించేందుకు తిరుచానూరు రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేయాలని సంకల్పించింది.
2016-17లో రూ.56.38 కోట్లు మంజూరు చేయగా.. రూ.36 కోట్లతో గుంతకల్ డివిజన్ నిర్మాణ సంస్థ నేతృత్వంలో తిరుచానూరు స్టేషన్ను బీ క్లాస్ స్టేషన్గా అన్ని సౌకర్యాలతో నిర్మాణం చేపట్టింది. మూడు ప్లాట్ఫామ్లు, షెల్టర్లు, ప్ల్లాట్పామ్లపై ప్రయాణికులు వేచి ఉండటానికి బెంచీలు, నీటి సౌకర్యం, ఆహార కేంద్రాలు, వెయిటింగ్ హాళ్లు, సబ్వే, స్టేషన్ మేనేజర్ కార్యాలయం, వీఐపీ లాంజ్, మహిళలకు నిరీక్షణ గదులు, రిజర్వేషన్, బుకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ లాకింగ్ సిస్టం పనులు పూర్తి చేశారు. విశాలవంతమైన పార్కింగ్తో పాటు టాక్సీస్టాండ్, బస్సులు నిలుపు స్థలం కేటాయించారు.
ప్రారంభిస్తే తీరనున్న సమస్యలు
తిరుపతికి రాకపోకలు సాగించడానికి అనుకూలంగా ఉన్న స్టేషన్లు తిరుపతి, రేణిగుంట. సాధారణంగా తిరుపతికి ఉదయం సమయంలో చేరుకునే రైళ్లు, సాయంత్రం బయలుదేరే రైళ్లు అధికంగా ఉంటాయి. ఆయా సమయాల్లో స్టేషన్ బయట ట్రాఫిక్, పార్కింగ్కు ఇబ్బందిగా ఉంటోంది. ఈ క్రమంలో తిరుచానూరు రైల్వేస్టేషన్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు ఎంచుకున్న రైలును నిర్దేశిత సమయంలో అందుకోవచ్చు. తిరుపతి- రేణిగుంట మధ్యలో తిరుచానూరు రైల్వేస్టేషన్ ప్రధాన రహదారికి పక్కనే ఉండటం, ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో ప్రయాణికులు సులభంగా గమ్యానికి చేరుకోవచ్చు.
షెల్టర్ల నిర్మాణం జరుగుతోంది
ప్రయాణికులకు అవసరమైన వసతులు కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. రెండో ప్లాట్ఫామ్కు షెల్లర్లు లేవు. అందుకోసం ప్రదిపాదనలు పంపాం. అనుమతులు వచ్చాయి. త్వరితగతిన పనులు పూర్తిచేసి స్టేషన్ను అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రస్తుతం స్టేషన్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
కె.సత్యనారాయణ, తిరుపతి రైల్వేస్టేషన్ డైరెక్టర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు శ్రీకారం.. జగన్ నిర్వీర్యం
[ 11-05-2024]
ప్రజాప్రయోజనాల కోసం గత తెదేపా ప్రభుత్వం పలు పథకాలు అమలు చేసింది.. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేసింది.. -
సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత: కలెక్టర్
[ 11-05-2024]
సమస్యాత్మిక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత కల్పిస్తున్నామని; ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు శనివారం సాయంత్రం ఆరు గంటలకు ముగించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ రాజకీయ పార్టీల అభ్యర్థులకు సూచించారు. -
జగన్ మాటలు వినని జనం..!
[ 11-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పుత్తూరులో నిర్వహించిన సభకు జనాలు అంతంతమాత్రంగానే వచ్చారు. వచ్చిన జనాలు సైతం జగన్ ప్రసంగాన్ని వినేందుకు ఇష్టపడలేదు. -
బాబు సూపర్-6 పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి
[ 11-05-2024]
ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కు వెళ్లింది. కూటమి అధికారంలోకి వస్తే అజెండాలో ప్రకటించిన పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుస్తామని చిత్తూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. -
దోచుకున్న సొమ్మేగా.. కొనేద్దాం..!
[ 11-05-2024]
అధికారాన్ని కాపాడుకునేందుకు వైకాపా పడరాని పాట్లు పడుతోంది. తమ అభ్యర్థులు పేదలు, సామాన్యులు.. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అంటూనే.. -
తెదేపాకు అనుకూలమా.. ఆపేయ్..!
[ 11-05-2024]
పార్టీలు ఏవైనా ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి విషయంలో అంతా సమానంగా ఉండాలి.. కానీ వైకాపాకు మాత్రం ఈ సిద్ధాంతం వర్తించదేమో అనిపించేలా పాలన సాగించారు.. -
ప్రలోభాలు ప్రారంభం
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. -
కదిలింది.. తెలుగు మహిళా లోకం
[ 11-05-2024]
తెదేపా విజయాన్ని కాంక్షిస్తూ తెలుగు మహిళలు చిత్తూరులో శుక్రవారం ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. -
నోటుకు లేదు ఢోకా.. మందుచుక్కే కరవైంది
[ 11-05-2024]
‘ప్రభుత్వ మద్యం దుకాణంలో ఉద్యోగం కోసం సిఫార్సు లేఖ ఇచ్చింది నేనే కదా.. ఎన్నికల సమయంలో వీలైనంతగా సరకు పంపించే బాధ్యత నీకు లేదా.. -
వైకాపా సర్పంచికి మహిళల దేహశుద్ధి
[ 11-05-2024]
వైకాపా సర్పంచికి మహిళలు దేహశుద్ధి చేశారు. కుప్పం మండలం యమనాసనపల్లిలో శుక్రవారం రాత్రి స్థానిక వైకాపా సర్పంచి సురేష్ ఓటర్లకు నగదు పంచేందుకు వచ్చారు. -
నాయకుల బైండోవర్లు దారుణం
[ 11-05-2024]
గత ఆరు నెలల్లో జిల్లాలో తెదేపా నాయకుల్ని అక్రమ అరెస్టులు చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు వాపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు