జగనన్నకు చెప్పినా.. నిరాశే!
తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన పొలాన్ని పక్కనే ఉన్న వ్యక్తులు ఆక్రమించారని గుడిపాల మండలం నారగల్లుకు చెందిన ఓ మహిళ గత నెల 27న 1902కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.
* తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన పొలాన్ని పక్కనే ఉన్న వ్యక్తులు ఆక్రమించారని గుడిపాల మండలం నారగల్లుకు చెందిన ఓ మహిళ గత నెల 27న 1902కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. రెండు వారాలు గడుస్తున్నా అధికారులు చర్యలు తీసుకోలేదని ఆమె వాపోతున్నారు.
* గ్రామంలో నీటి సమస్య ఉందని పుంగనూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి నాలుగు రోజుల కిందట 1902 నంబరుకు ఫోన్ చేసినా సమస్యను పరిష్కరించలేదు. ఎప్పటిలోగా నీటి ఎద్దడిని తీరుస్తారని అడిగినా.. కొంతకాలం పడుతుందని అంటున్నారే తప్ప నిర్దిష్టంగా ఎలాంటి హామీ ఇవ్వలేదని ఆయన వాపోతున్నారు.
* గంగవరం మండలం ఉల్లికుంట నుంచి గండ్రాజుపల్లెకు వెళ్లే మార్గం అధ్వానంగా ఉందని గండ్రాజుపల్లెకు చెందిన ఓ వ్యక్తి ఫోన్ చేసినప్పటికీ పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
ఈనాడు, చిత్తూరు: ‘మీ సమస్య పరిష్కారం.. మాకు ప్రాధాన్యతాంశం’ అంటూ ప్రభుత్వం ఘనంగా ప్రకటించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 1902కు ఫోన్ చేస్తే తమ సమస్య పరిష్కారమైందని, సంతృప్తిగా ఉన్నామని చెప్పేవారి సంఖ్య జిల్లాలో తక్కువగా ఉంది. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించిన అంశాలు మొదలుకుని వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పి సకాలంలో పరిష్కారాన్ని పొందవచ్చని సర్కారు చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం కనిపించడం లేదు.
అమలు తీరు ఘోరంగా..
సమస్యలను బాధ్యతగా తీరుస్తామని గొప్పగా చెప్పిన ప్రభుత్వం అమలులో ఘోరంగా విఫలమైంది. రెవెన్యూ సంబంధిత అంశాలైతే అధిక భాగం అపరిష్కృతంగానే ఉంటుండటంతో ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయనే ఫిర్యాదులు వస్తున్నా వాటికి మరమ్మతులు చేయడంలేదని ఫోన్ చేసిన వ్యక్తులు ఘంటాపథంగా చెబుతున్నారు. మరోవైపు వర్షాకాలం మొదలుకావడంతో ఇప్పట్లో వీటిని బాగు చేసే పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది.
ఆరంభం ఘనంగా..
‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మే 9న లాంఛనంగా ప్రారంభించింది. సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ సేవలు, రెవెన్యూ సంబంధిత సమస్యలు ఏమున్నా 1902కు టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేస్తే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఐవీఆర్ఎస్, ఎస్ఎంఎస్ ద్వారా అర్జీదారులకు ఎప్పటికప్పుడు సందేశాలు వస్తాయి. సమస్య పరిష్కారం ఏ దశలో ఉందో నేరుగా వెబ్సైట్లోకి వెళ్లి చూడవచ్చని సీఎం స్పష్టం చేశారు.
342 మందిలో 71 మందే సంతృప్తి
ఈ నెల అయిదు నుంచి 11 వరకు జిల్లావ్యాప్తంగా 438 మంది 1902కు ఫోన్ చేశారు. ఇందులో అత్యధికంగా 154 ఫిర్యాదులు రెవెన్యూ, 59 పోలీసు, 31 సర్వే, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 29 ఉన్నాయి. అత్యధికంగా పెద్దపంజాణి మండలం నుంచి 40, గంగాధరనెల్లూరు 32, చిత్తూరు నగరం 31, వెదురుకుప్పం మండలం నుంచి 28 మంది సమస్యలు తెలియజేశారు. నిండ్ర, విజయపురం మండలాల నుంచి కేవలం ఒక్కరే ఫిర్యాదు చేశారు. వీరిలో 342 మందికి కాల్ సెంటర్ సిబ్బంది ఫోన్ చేసి సమస్యల పరిష్కారంపై ఆరా తీసేందుకు యత్నించగా 193 మంది స్పందించలేదు. మిగిలిన 149 మందిలో 71 మంది సంతృప్తి వ్యక్తం చేయగా 78 మంది అసంతృప్తిగా ఉన్నామని బదులివ్వడం గమనార్హం.
11వ తేదీ వరకు వచ్చిన ఫిర్యాదులు: 438
సంతృప్తి వ్యక్తం చేసిన వారు: 71 మంది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోపాలరావు వంక.. గుటకాయ స్వాహా..!
[ 17-05-2024]
కుప్పం- పలమనేరు జాతీయ రహదారి పక్కన భూములకు విపరీతమైన డిమాండ్ ఉంది. మంచి ధరలు పలుకుతుండటంతో.. ప్రభుత్వ స్థలాలపై అక్రమార్కుల కన్ను పడింది. -
ఎవరి కళ్లకు కడతారు గంతలు?
[ 17-05-2024]
ఎక్కడైనా ప్రకృతి వనరులను అక్రమార్కులు దోచేస్తుంటే బాధ్యతాయుతమైన ప్రభుత్వం రంగంలోకి దిగి తవ్వకాలు, రవాణాను నిలిపేస్తుంది. -
శివయ్యా.. ఇదేం ఘోరమయ్యా
[ 17-05-2024]
శివయ్య సేవలో తరించడానికి వెళ్లిన ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆడపిల్లలను మృత్యువు రూపంలో చెరువు మింగేసింది. -
సర్వదర్శనానికి 18 గంటలు
[ 17-05-2024]
శ్రీవారి సర్వదర్శనానికి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా తిరుమలకు వచ్చిన భక్తులు గురువారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లో వేచి ఉన్నారు. -
ప్రవేశాల ప్రకటన ఆలస్యమేనా..?
[ 17-05-2024]
పది తర్వాత వ్యవసాయ పాలిటెక్నిక్లో భాగంగా మూడేళ్లు డిప్లమో చదివితే ఉపాధి అవకాశాలు అధికంగా ఉంటాయి. ఆ కోర్సుల్లో చేరేందుకు అవసరమైన ప్రవేశ ప్రకటన ఈ ఏడాది ఆలస్యం కానుంది. -
క్షేత్రస్థాయికి వెళ్తే.. కార్యాలయానికి తాళమే
[ 17-05-2024]
సచివాలయ వ్యవస్థతో గొప్ప మార్పు తెచ్చామని.. ప్రజల ముగింటకే అధికారులను తెచ్చామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. -
జీతాలు చెల్లించండి.. మహాప్రభో
[ 17-05-2024]
తమకు న్యాయంగా అందాల్సిన జీతభత్యాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయా డెయిరీ కార్మికులు చేపట్టిన నిరసన దీక్ష ఎనిమిది నెలలుగా కొనసాగుతోంది. -
విచారణకు పిలిచి చితకబాదిన ఎస్సై?
[ 17-05-2024]
సోదరుల ఘర్షణ కేసులో విచారణకు పిలిచిన ఎస్సై కులం పేరుతో దూషించి.. లాఠీతో చితకబాదారని రామకుప్పం మండలం వీర్ణమల తండాకు చెందిన వెంకటేశ్నాయక్ ఆరోపించారు. -
సూత్రదారితెన్నూ లేని దర్యాప్తు
[ 17-05-2024]
తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయంలో చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనలో పోలీసులు ఇంకా వైకాపా నేతలకు వంత పాడుతూనే ఉన్నారు. -
బండ వేషం.. జాతర విశేషం
[ 17-05-2024]
గంగజాతరలో బండ వేషధారణలు అలరించాయి. తిరుపతి ప్రజల ఇలవేల్పుగా.. పిలిస్తే పలికే దైవంగా విరాజిల్లుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతర రెండోరోజు గురువారం సందడిగా సాగింది. -
వేసవి శిబిరాలు లేనట్టే..!
[ 17-05-2024]
వేసవి సెలవులంటే పాఠశాల విద్యార్థులకు, చిన్నారులకు పండగనే చెప్పాలి. స్నేహితులతో కలిసి ఆటలాడుకుంటూ వినోదం.. ఉల్లాసం.. ఉత్సాహాన్ని పొందుతుంటారు. -
అటకెక్కిన భూసార పరీక్షలు
[ 17-05-2024]
భూసార పరీక్షలు అటకెక్కాయి. సాగులో మట్టి నమూనాలు కీలకం కాగా ప్రభుత్వం వీటిని గాలికి వదిలేసింది. ఎక్కడో ఓ చోట తీసి అయ్యిందనిపిస్తున్నారు. -
చెవికెక్కించుకుంటే ఇంతే..!
[ 17-05-2024]
వైకాపా నేతలతో భుజాలు రాసుకుని వారి చెప్పినట్లు వంతపాడిన అధికారులపై సీఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల సమయంలోనూ ఆ తర్వాత చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల్లో శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైనట్లు అధికారులు నిర్ధారించారు. -
వీరూ ఆ ఫ్యానుముక్కలే
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. అందుకు బాధ్యులైన జిల్లా పోలీసు బాస్ కృష్ణకాంత్ పటేల్పై బదిలీ వేటు వేసింది. -
ముఖ్యమంత్రి జగన్ను అరెస్టు చేయాలి
[ 17-05-2024]
ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి తన ఐదేళ్ల పాలనలో లెక్కకు మిక్కిలి అక్రమాలకు పాల్పడ్డారని, ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. -
మహిళా వర్సిటీకి మాయని మచ్చ
[ 17-05-2024]
శ్రీపద్మావతి మహిళా వర్సిటీ అవరణలో మంగళవారం చోటుచేసుకున్న ఘటన మాయని మచ్చగా మారింది. -
ఆరోగ్య కేంద్రాల సేవలు అరకొరే
[ 17-05-2024]
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలూ వైద్య సేవలు గగనంగా మారాయి. కాన్పులు సైతం జరగడం లేదు. పలుచోట్ల వైద్యులు, సిబ్బంది విధులకు డుమ్మా కొట్టి తిరుగుతున్నా.. పట్టించుకునే వారేలేరు. -
ఓటమి భయంతోనే వైకాపా దాడులు
[ 17-05-2024]
వైకాపా ప్రభుత్వం ఓటమి భయంతోనే దాడులకు దిగుతోందని ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శించారు. ఇటీవల వైకాపా మూకల దాడిలో గాయపడిన తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని తనపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి గురువారం పరామర్శించారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
[ 17-05-2024]
శ్రీవారిని పలువురు ప్రముఖులు గురువారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి మూలమూర్తిని భాజపా నాయకులు... -
తెదేపా ఏజెంట్ల కిడ్నాప్ వ్యవహారంలో పురోగతి
[ 17-05-2024]
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మండలంలో వైకాపా నాయకులపై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. -
ప్రత్యేక తరగతులు ఎక్కడ?
[ 17-05-2024]
పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 24 నుంచి సప్లిమెంటరరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రెండు నెలల క్రితం జరిగిన పరీక్షల్లో 2,006 మంది ఫెయిల్ అయ్యారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జేసీ శ్రీనివాసులు ఆదేశించారు. చిత్తూరు ఎస్వీ సెట్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లను ఆయన గురువారం పరిశీలించారు. -
వేరుసెనగ విత్తన ధర ఖరారు
[ 17-05-2024]
త్వరలో మొదలుకానున్న ఖరీఫ్ సీజన్కు వేరుసెనగ విత్తన కాయల ధరలు ఖరారయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
బీసీజీ టీకా వేయించుకోండి
[ 17-05-2024]
జిల్లాలోని వృద్ధులు, 18 ఏళ్లు నిండిన మధుమేహ, క్షయ వ్యాధిగ్రస్థులు, వారి కుటుంబ సభ్యులందరూ అడల్ట్ బీసీజీ టీకాను వేయించుకుని ఆరోగ్యంగా ఉండాలని డీఎంహెచ్వో ప్రభావతీదేవి కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా