logo

దంపతులపై వైకాపా నాయకుల దాడి అమానుషం

తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు నామినేషన్‌కు వెళ్లారని ముస్లిం దంపతులపై వైకాపా నాయకులు దాడి చేసి, చంపేస్తామని బెదిరించడం అమానుషమని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ అన్నారు.

Published : 23 Apr 2024 05:24 IST

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు నామినేషన్‌కు వెళ్లారని ముస్లిం దంపతులపై వైకాపా నాయకులు దాడి చేసి, చంపేస్తామని బెదిరించడం అమానుషమని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సలీమాను సోమవారం ఆయన పరామర్శించి మాట్లాడారు. నారా భువనేశ్వరి చూసేందుకు కుప్పం వచ్చినందుకు వైకాపా కార్యకర్త కుటుంబం పైనే దాడి చేయడం దారుణమన్నారు. బాధిదులకు అండగా తాము అండగా ఉంటామన్నారు. నారా భువనేశ్వరి ఫోన్‌ ద్వారా పరామర్శించినట్లు, అవసరమైన వీరి కోసం పోరాడేందుకు తాను వస్తానని హామీ ఇచ్చినట్లు వివరించారు. వైకాపా గూండాలతో ప్రజలకు రక్షణ లేకుండా పోతోందని వాపోయారు. సర్దార్‌, అన్సర్‌, జాకీర్‌ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని