హస్తకళలూ.. విస్తుపోయాయి
హస్తకళా గ్రామం అన్నారు. అన్ని హస్తకళలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి కళాకారులకు చేయూత.. మార్కెటింగ్.. పర్యాటకులను ఆకర్షించి ఆశించిన రీతిలో మార్కెటింగ్ వసతి తదితర ప్రయోజనాలంటూ హామీలు గుప్పించారు.
నాలుగేళ్లలో కలగానే.. ‘హస్తకళా గ్రామం’
నిధులురాక పర్యాటకశాఖ అతిథి గృహం సమీపంలో నిలిచిన భవనాలు
హస్తకళా గ్రామం అన్నారు. అన్ని హస్తకళలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి కళాకారులకు చేయూత.. మార్కెటింగ్.. పర్యాటకులను ఆకర్షించి ఆశించిన రీతిలో మార్కెటింగ్ వసతి తదితర ప్రయోజనాలంటూ హామీలు గుప్పించారు. కరపత్రాలు వేసుకున్నారు. తీరా క్షేత్రస్థాయిలో మాత్రం నిర్మించిన నిర్మాణాలు శిథిలమైపోతున్నా.. కళాకారులకు ఒనగూరిన ప్రయోజనం మాత్రం శూన్యమే
శ్రీకాళహస్తి, న్యూస్టుడే: హస్తకళలకు కాణాచిగా శ్రీకాళహస్తి ఎంతో ప్రాభవాన్ని సంతరించుకుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన హస్తకళల అభ్యున్నతి కోసం కేంద్ర జౌళీశాఖ శ్రీకాళహస్తి పట్టణానికి సమీపంలో హస్తకళ గ్రామం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఆమేరకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
అవకాశాలు పుష్కలంగా ఉన్నా..
శ్రీకాళహస్తి కలంకారీతోపాటు ఇక్కడి కొయ్యబొమ్మలకు ఎంతో గుర్తింపు సంతరించుకుంది. ఏర్పేడులోని మాధవమాల, పాపానాయుడుపేట, కేవీబీపురంలోని కర్లపూడి, బీఎన్కండ్రిగలోని పల్లమాలతో పాటు తిరుపతి గ్రామీణ ప్రాంతాల్లో వెదురుతో తయారుచేసే ఎన్నో వస్తువులకు ఇక్కడ డిమాండ్ ఏర్పడుతోంది. చేనేత వస్త్రాలకు గుర్తింపు లభిస్తోంది. పర్యాటకుల ఆసక్తికి తగ్గట్టుగా హైదరాబాదులోని హైటెక్ సిటీ తరహాలో ఇక్కడ హస్తకళల గ్రామం (క్రాఫ్ట్ విలేజ్) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.9.55 కోట్లు నిధులతో ఇక్కడ పర్యాటకులను అమాంతం ఆకట్టుకునే విధంగా భవన నిర్మాణాలు చేపట్టాలని సంకల్పించింది.
కనిపించని ఎమ్మెల్యే చొరవ..
నిధుల్లేక ఆగిపోయిన హస్తకళా గ్రామం పనులు పురోగతి విషయమై ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి చొరవ శూన్యమనే చెప్పాలి. శాసనసభలో నవ్వులు పూయిస్తూ ప్రత్యేకతను చాటుకున్న ఎమ్మెల్యే అభివృద్ధి ఆగిపోవడం గురించి సభలో ప్రస్తావించకపోవడం, నిధులు తీసుకురావడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ ప్రణాళిక లేకుండా ఈ భవన నిర్మాణాలు నిర్మించడం, ప్రస్తుతం ఆరు వరుసల రహదారి ఏర్పాటుతో ఈ నిర్మాణాలకు రావాలంటే పర్యాటకులు మరింత ఇబ్బందులు పడాల్సి ఉండటంతో హస్తకళాకారులు ఈ ప్రాజెక్టు పురోభివృద్ధిపై ఆశలు వదులుకున్నారు.
ఎక్కడ వేసిన గొంగడి అక్కడే..
ఇక్కడి భవనాల నిర్మాణాలకు 2020 ఫిబ్రవరి నెలలో పనులు ప్రారంభించారు. ఆర్అండ్బీ పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. కేటాయించిన నిధుల్లో నిర్మాణ పనులకు ప్రభుత్వం రూ.7.5 కోట్లు నిర్ణయించింది. ఇందులో తొలి విడతగా రూ.4.77 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో భవన నిర్మాణాలు చేపట్టారు. వసతుల కల్పనకు మరింత నిధులు మంజూరు చేయాల్సి ఉంది. అనుకున్న ప్రకారం 2022 జూన్ నాటికి పనులు పూర్తిచేయాల్సి ఉంది. నిధులు మంజూరు కాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
[ 04-05-2024]
మంత్రి రోజా ప్రచారాన్ని వడమాలపేట మండలం వేమాపురం గ్రామస్థులు శుక్రవారం రాత్రి అడ్డుకున్నారు. పూడి పంచాయతీలోని వేమాపురం గ్రామంలో మంత్రి రోజా ప్రచారం నిర్వహించడానికి ప్రచారం రథంలో వచ్చారు. -
కళ్లు మూసుకున్నారా ఐదేళ్లు..
[ 04-05-2024]
‘రాజకీయ నాయకుడికి విలువలు, విశ్వసనీయత ఉండాలి. మాట ఇస్తే నిలబెట్టుకోవాలి. ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే పదవికి రాజీనామా చేయాలి.’ -
ఈ పాపం నీదే జగన్..
[ 04-05-2024]
మండు టెండలో రెండో రోజూ వృద్ధులను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛన్ల పంపిణీ చేసేందుకు సరిపడా సిబ్బంది ఉన్నా తన స్వార్థ ప్రయోజనం కోసం వేదనకు గురిచేశారు. -
నగరిలో సైకిల్ జోరు..
[ 04-05-2024]
నగరిలో మంత్రి రోజాను వ్యతిరేకిస్తూ అసమ్మతి నాయకులు ఇన్నాళ్లు గళం విప్పుతూ వచ్చారు. ఆమెకు టికెట్ ఇవ్వొద్దని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా అధిష్ఠానం ఇచ్చింది. -
జగనే సర్పంచులకు గండం
[ 04-05-2024]
దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్లు వైకాపా ప్రభుత్వం పంచాయతీ నిధులనూ వదల్లేదు.. గ్రామ స్వరాజ్యం కోసం గాంధీజీ కన్న కలలను సీఎం జగన్ కల్లోలం చేశారు.. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సర్పంచులు ఉత్సవ విగ్రహాల్లా మార్చారు. -
మా బతుకులు రోడ్డున వేశావ్.. జగన్!
[ 04-05-2024]
కష్టాన్ని నమ్ముకున్న బడుగు జీవులు వైకాపా పాలనలో ఇసుక కొరతతో నానా అవస్థలు పడ్డారు. చేద్దామంటే పనుల్లేక.. తిందామంటే తిండిలేక.. ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేద్దామంటే పనుల్లేక.. పెరిగిన నిత్యావసరాల ధరలు భవన నిర్మాణ రంగ కార్మికులకు పూట గడవని పరిస్థితులు దాపురించాయి. -
మేనమామ.. క్రీడలపై సవతి ప్రేమ..!
[ 04-05-2024]
బటన్ నొక్కి పిల్లలకు మేనమామలా సంక్షేమం ఇచ్చానని చెప్పిన సీఎం జగన్. క్రీడాకారులపై మాత్రం సవతి ప్రేమ చాటారని క్రీడా లోకం మండిపడిపోతోంది. కమర్షియల్ క్రీడల్లో సాధనకు రుసుమల్ని పెంచి.. పేద ఆటగాళ్లను ఆటలకు దూరం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. -
చిత్తూరును స్మార్ట్సిటీని చేస్తా
[ 04-05-2024]
పేదలకు అండగా నిలవడం నాకు ఇష్టం.. జిల్లా కేంద్రమైనా చిత్తూరులో అభివృద్ధి జాడేలేదు.. యువత ఉద్యోగాల కోసం బెంగళూరు, చెన్నై సహా విదేశాలకు వెళ్తున్నారు.. జన్మభూమి రుణం తీర్చుకోవాలనే ఆశయంతో రాజకీయాల్లోకి రాక ముందే జీజేఎం ట్రస్టు ద్వారా ప్రజాసేవకు శ్రీకారం చుట్టా.. -
‘భవన’దీయుడి కోసం
[ 04-05-2024]
నంది కూడలిలో ఉన్న ఈ అత్యాధునిక భవనం నగరపాలక సంస్థకు చెందినది. తిరుపతి స్మార్ట్సిటీ కార్పొరేషన్ నిధులు రూ.2 కోట్లు వెచ్చించి తిరుమలకు వచ్చే యాత్రికుల సౌకర్యార్థం నిర్మించారు. -
వృద్ధులమని తెలుసు.. ఇంటికివ్వలేని మనసు
[ 04-05-2024]
జగన్ ప్రభుత్వ చర్యలతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బయట ఎండకు, బ్యాంకుల్లో ఉక్కపోతతో అల్లాడిపోయారు. గురు, శుక్రవారాలు రెండు రోజులపాటు బ్యాంకుల చుట్టూ తిరిగినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. -
బారుకు వెళ్తేనే బీరు
[ 04-05-2024]
ఎండాకాలంలో బీర్లకున్న డిమాండ్ అంతాఇంతా కాదు. మండుటెండలో ప్రభుత్వ మద్యం దుకాణాలు తిరిగినా బీరు దొరక్క బార్ల మెట్లెక్కాల్సి వస్తోంది. రూ.350 - రూ.410 వరకు చెల్లించి బీర్లు తాగాల్సిన పరిస్థితి నెలకొంది. -
‘తాపీ’గా లేం జగన్!
[ 04-05-2024]
వైకాపా సర్కార్ తెచ్చిన ఇసుక విధానం, సామగ్రి ధరల పెరుగుదల కూలీలకు శాపంగా మారింది. అరకొర పనులు, అప్పుల బాధలు, సమస్యలు భరించలేక కార్మికులు బలవన్మరణాలకు దారితీస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?