కవ్వించి.. దాడిచేసి
మండల కేంద్రమైన ఐరాలలో మంగళవారం మధ్యాహ్నం వైకాపా, తెదేపా నాయకులు మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది.
ఐరాలలో తెదేపా శ్రేణులపై వైకాపా మూకదాడి
ఐరాల బజారువీధిలో ఘర్షణకు దిగిన వైకాపా, తెదేపా నాయకులు, కార్యకర్తలు
ఐరాల, న్యూస్టుడే: మండల కేంద్రమైన ఐరాలలో మంగళవారం మధ్యాహ్నం వైకాపా, తెదేపా నాయకులు మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. పూతలపట్టు నియోజకవర్గ తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ ర్యాలీ నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలు ఐరాలలోని బజారువీధిలో జెండాలు కడుతున్నారు. ఆ సమయంలో కొందరు వైకాపా నాయకులు, కార్యకర్తలు పోటీగా వైకాపా జెండాలు కట్టారు. అదేమిటని తెదేపా నాయకులు ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అటుగా వెళ్తున్న తెదేపా నాయకుల కారుపై వైకాపా కార్యకర్తలు దాడి చేయడంతో అద్దాలు పగిలాయి. దీంతో ఘర్షణ కాస్తా ఉద్రిక్తతకు దారితీసింది. వైకాపా, తెదేపా నాయకులు, కార్యకర్తలు పరస్పర దాడులకు సిద్ధమవడంతో స్థానిక పోలీసులు వారిని అదుపు చేయడానికి ప్రయత్నించారు. చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్రెడ్డి ప్రత్యేక బలగాలతో అక్కడకు వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు. తెదేపా నాయకులను అరెస్ట్ చేయాలని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్కుమార్ పోలీసులతో వాగ్వాదానికి దిగి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
వైకాపా ఆగడాలకు అడ్డుకట్ట వేయండి.. ఓటమి భయంతో నియోజకవర్గంలో వైకాపా నాయకులు చేస్తున్న ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్రెడ్డిని కోరారు. ఆయన ఐరాలకు వచ్చి డీఎస్పీతో మాట్లాడారు. తాము ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటుంటే వైకాపా నాయకులు, కార్యకర్తలు నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని, దీనిపై విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతు భరోసా.. సేవల్లో నిరాశ
[ 20-05-2024]
చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన ఉండదనే విషయం వైకాపా పాలన ప్రారంభంలోనే రైతులకు అర్థమైపోయింది.. ఆర్బీకేల ద్వారా సాగు సలహాలు, సేవలందకపోయినా అన్ని రకాల ఎరువులు, విత్తనాలు అందుబాటులో లేకపోయినా.. ప్రకృతి వైపరీత్యాల నుంచి ఉత్పత్తుల రక్షణకు ముఖం చాటేసినా పంటి బిగువున భరించారు.. నష్టాలు చూడని రైతులు లేరు.. -
దూరవిద్య.. అనుమతులు అక్కర్లేదా?
[ 20-05-2024]
ఎస్వీయూకు ఉన్న 70 ఏళ్ల చరిత్ర ఆధారంగా దేశవ్యాప్తంగా.. ఎస్వీయూ దూరవిద్యా కేంద్రానికి ఉన్న గుర్తింపు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏ వర్సిటీకీ లేదు. ఎస్వీయూ పరిధిలో సాధారణ ప్రవేశాలతో పోల్చితే దూరవిద్యా కేంద్రం ప్రవేశాలు ఎక్కువగానే ఉంటాయి. -
ఇవేం పనులు రాజశేఖరా..?
[ 20-05-2024]
-
విచారణ తొక్కిపెట్టేసి..
[ 20-05-2024]
జడ్పీలో నిధుల దుర్వినియోగంపై లోకాయుక్త ఆదేశాలతో చేపట్టాల్సిన విచారణను ఆ కార్యాలయ పూర్వ అధికారి నిర్వాకంతో నెలలతరబడి నిలిచిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.. -
ఎర్రమట్టి కొల్లగొట్టి..కోట్లకు పడగలెత్తి
[ 20-05-2024]
ముఖ్యనాయకుడు.. ఇద్దరు అనుచరులు.. ఇక అడ్డేముంది.. కొండలు కరిగిపోయాయి. వందలాది టన్నుల ఎర్రమట్టి తరలిపోయింది.. ఆదాయంలో ముఖ్యనేతకు వాటా అందడంతో పూర్తి సహకారం అందించారు. ఇలా ఐదేళ్లలో ఆ ఇద్దరు నాయకులు కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. -
సీబీఎస్ఈ.. పాఠం బోధపడేనా?
[ 20-05-2024]
అ..ఆలు చదవలేని పరిస్థితి మన ప్రభుత్వ బడుల్లో నెలకొందని ఇటీవల ఆసర్ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వం మాత్రం సీబీఎస్ఈ, ఐబీ, బైజూస్ కంటెంట్ అంటూ గందరగోళం చేస్తోంది. ప్రభుత్వ బడుల్లో గతేడాది సీబీఎస్ఈ పాఠాలు అమలుచేయగా ఈ ఏడాది పదిలో అమలు చేయాలని నిర్ణయించింది. -
ఆడపడుచు ఆరాధనకు వేళాయే..
[ 20-05-2024]
పంచభూతాలైన భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం.. దైవ స్వరూపాలు.. జలమంటే గంగమ్మ.. స్వచ్ఛత, నిర్మలత్వ స్వరూపం గంగా దేవి.. ప్రతి ఇంటి ఆడపడుచు గంగమ్మ తల్లి.. చైత్ర మాసంలో గంగమ్మను ఊరికి ఆహ్వానించి ఆరాధించే ఉత్సవమే గంగమ్మ జాతర.. -
కపిలతీర్థంపై కరుణ లేదా?
[ 20-05-2024]
తిరుపతిలో తితిదే ఆధ్వర్యంలోని ప్రధాన క్షేత్రాల్లో కపిలతీర్థం ఆలయం ఒకటి. ఈ శైవ క్షేత్రాన్ని దర్శించేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు వస్తూపోతూ ఉంటారు. -
ఏడు గంటలపాటు.. సిట్ విచారణ
[ 20-05-2024]
చంద్రగిరి నియోజకవర్గంలోని రామిరెడ్డిపల్లె, కూచువారిపల్లెలో పోలింగ్ రోజున జరిగిన గొడవలు, ఎన్నికల అనంతరం శ్రీపద్మావతి మహిళా వర్సిటీలోని స్ట్రాంగ్రూమ్ వద్ద జరిగిన దాడుల ఘటనపై దర్యాప్తు నిమిత్తం ఏర్పాటైన సిట్ బృందం ఆదివారం సుమారు ఏడుగంటలపాటు విచారణ చేపట్టింది. -
ముగిసిన శ్రీపద్మావతి పరిణయోత్సవాలు
[ 20-05-2024]
శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు ఆదివారం తిరుమలలో ఘనంగా ముగిశాయి. సాయంత్రం శ్రీవారి ఆలయం నుంచి స్వామివారు గరుడ వాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయలుదేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతి పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. -
‘దళితుల మధ్య చిచ్చుపెట్టడం మంత్రి పెద్దిరెడ్డికి తగదు’
[ 20-05-2024]
ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టి, గొడవలు పెట్టడం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తగదని మండల పరిధిలోని భీమునిచెరువు దళితవాడకు చెందిన సర్పంచి మురుగేశం, గ్రామంలోని యువకులు ఆరోపించారు. -
గమ్యం చేరేలోగా మృత్యుఒడికి..
[ 20-05-2024]
ఉద్యోగోన్నతిపై ఉత్తరాఖండ్ వెళ్తూ పెనుమూరు మండలం గుంటిపల్లె పంచాయతీ కనికాపురం గ్రామానికి(చిత్తూరు సమీప మురకంబట్టు) చెందిన సైనికుడు రైలు నుంచి జారిపడి మృతిచెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు