వైకాపా నేత.. ఇదేం మేత?
వైకాపా ప్రభుత్వంలో సామాన్య రైతులనూ వదలడం లేదు. పొలంలో మెరక చేసుకుంటున్న కర్షకులను అధికార పార్టీ నేతకు చెందిన వ్యక్తులు వచ్చి మైనింగ్ రుసుము చెల్లించాలని ఒత్తిడి చేసిన వైనమిది.
మైనింగ్ రుసుము కట్టాలంటూ ఆయన సంస్థ ఉద్యోగుల హుకుం
పొలాల్లో మట్టి మెరక చేసుకుంటున్న రైతులపై తీవ్ర ఒత్తిడి
కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న రైతులు
కొత్తపల్లి, న్యూస్టుడే: వైకాపా ప్రభుత్వంలో సామాన్య రైతులనూ వదలడం లేదు. పొలంలో మెరక చేసుకుంటున్న కర్షకులను అధికార పార్టీ నేతకు చెందిన వ్యక్తులు వచ్చి మైనింగ్ రుసుము చెల్లించాలని ఒత్తిడి చేసిన వైనమిది.
వ్యవసాయ సీజన్ కావడంతో కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం నాగులాపల్లిలో పలువురు రైతులు తమ పొలాలను మెరక చేసుకోవాలని నిర్ణయించి మట్టిని తీసి పనులు చేపడుతున్నారు. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు వారి వద్దకు వచ్చారు. ‘‘మేము మైనింగ్ శాఖ నుంచి వచ్చాం. పొలంలో మట్టి తరలించాలంటే రుసుము చెల్లించాలి.’’ అంటూ అడ్డుకున్నారు. తాము మట్టి అమ్మకోవడం లేదని, తమ పొలంలోంచే తీసి పల్లంగా ఉన్న చోట వేసుకుంటున్నామని రైతులు తెలిపారు. అయినా సరే రుసుము కట్టాల్సిందేనంటూ వాహనాలు నిలిపేసి రైతులను ఇబ్బందిపెట్టారు. సీజ్ చేస్తామని హెచ్చరించారు. దీంతో రైతులు సాయంత్రం వరకు పడిగాపులు కాసి చివరకు ఆ నలుగురితో సహా కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అధికారులు విచారిస్తే వారు మైనింగ్శాఖకు చెందిన వారు కాదని తేలింది.
వారి ఇష్టారాజ్యమా..
ఈ గుర్తింపు కార్డుతో వచ్చారు
ఆ బ్యాచ్ వద్ద ‘సుధాకర్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ పేరుతో గుర్తింపు కార్డులు లభ్యమయ్యాయి. ఈ సంస్థ జిల్లాలో ఓ వైకాపా నేతకు చెందినది.. రెండేళ్ల క్రితం కూడా బొండు ఇసుక తోలకాల వ్యవహారంలో ఈ బ్యాచ్ ఆగడాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం మట్టి విషయంలో కూడా రైతుల నుంచి ఒక్కో ట్రాక్టర్కు రూ.320 చొప్పున రుసుము చెల్లించాలని పట్టు పట్టారు. కొత్తపల్లి తహసీల్దార్ ఎం.సుందరరాజు మాట్లాడుతూ.. ఆ నలుగురు మైనింగ్ శాఖకు సంబంధం లేని వ్యక్తులన్నారు. ప్రభుత్వ శాఖ పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నవారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు సూచించామన్నారు. అనుమతుల్లేకుండా పొలంలో మట్టి తవ్వినందుకు రైతులపైనా చర్యలు తీసుకోవాలనీ ఫిర్యాదులో పేర్కొన్నారు.
రైతులను అడ్డుకున్న వైకాపా నేతకు చెందిన వ్యక్తులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పర్యటనకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు
[ 16-06-2024]
సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి అధికారులను ఆదేశించారు. -
కూటమి ప్రభుత్వ సహకారంతో ఎతిపోతల అభివృద్ధి
[ 16-06-2024]
పార్టీలకు అతీతంగా రైతులంతా ఎత్తిపోతల అభివృద్ధికి కృషి చేయాలని చాగల్లు జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అల్లూరి విక్రమాదిత్య తెలిపారు. -
శ్రీలక్ష్మీ నరసింహ స్వామి సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి
[ 16-06-2024]
అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు దర్శించుకున్నారు. -
మానసిక దివ్యాంగుల పాఠశాలలో ఫాదర్స్ డే వేడుకలు
[ 16-06-2024]
రోటరీ క్లబ్ నిడవోలు అధ్యక్షుడు కీర్తి ఆంజనేయులు ఆధ్వర్యంలో మానసిక దివ్యాంగుల పాఠశాలలో ఫాదర్స్డే వేడుకలు నిర్వహించారు. -
శ్రీకోట సత్తెమ్మ అమ్మవారిని దర్శించుకున్న జిల్లా సూపరింటెండెంట్
[ 16-06-2024]
మండలంలోని తిమ్మరాజుపాలెం గ్రామంంలో కొలువై ఉన్న శ్రీకోటసత్తెమ్మ అమ్మవారిని తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ పి.జగదీశ్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. -
నాన్నంటే నాన్నే
[ 16-06-2024]
నాన్నంటే ఇష్టంగా మోసే బాధ్యత.. వెన్నంటి నడిచే ధైర్యం.. ఊహకందని త్యాగం.. నడత నేర్పే గురువు.. తన జీవితాన్నే మనకోసం ధారబోసే మహోన్నతుడు. -
మానసిక సంఘర్షణ.. మృత్యుమార్గాన..
[ 16-06-2024]
ఆ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నత చదువులు చదివారు. మహానగరాల్లో ఉద్యోగాలు చేశారు. పదేళ్ల క్రితం తండ్రి చనిపోవడం.. తల్లి అనారోగ్యం బారిన పడటంతో ఇంటికొచ్చేశారు. -
అమ్మా.. నన్ను క్షమించు
[ 16-06-2024]
‘అమ్మా.. నన్ను క్షమించు. నా స్నేహితుడు శ్రీను.. వాళ్ల మావయ్య మోసం చేశాడు. రూ.35 లక్షలు ఇవ్వాలి. -
కొమ్మనాపల్లిలో అదుపులోకి రాని అతిసారం
[ 16-06-2024]
కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో ప్రబలిన (అతిసారం) మూడోరోజుకూ పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. గ్రామంలోని మరో 28 మంది శనివారం కూడా అస్వస్థత బారిన పడ్డారు. -
వెంకన్న వేడుక చూద్దాం రండి
[ 16-06-2024]
పవిత్ర వైనతేయ నదీ తీరంలో కొలువైన అప్పనపల్లి బాలబాలాజీస్వామివారి ఆలయం ఉత్సవ శోభను సంతరించుకుంది. -
అన్నదాత ఆత్మ సంకల్పానికి దెబ్బ
[ 16-06-2024]
పుడమి తల్లిని నమ్ముకుని ఆరుగాలం శ్రమించే అన్నదాతకు అడుగడుగునా సమస్యలే. విత్తు వేసింది మొదలు.. దిగుబడి వచ్చే వరకు, ఆ తర్వాత కూడా అనేక సవాళ్లు. -
అక్కడ కూలినా.. ఇక్కడ వేళ్లూనేలా..
[ 16-06-2024]
దశాబ్దాల క్రితం నాటి ఓ రావిచెట్టు కాకినాడ బాలాత్రిపుర సుందరి దేవాలయం రహదారిలో గురువారం కూలిపోయిన విషయం తెలిసిందే. -
పూలబాట పరిచిన పాదాలకు పుష్పాభిషేకం
[ 16-06-2024]
కాకినాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో శనివారం ఫాదర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ తండ్రులపై చిన్నారులు పూలు చల్లి ఆశీర్వచనం తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతే.. శాంతి ఒప్పందానికి ప్రాతిపదిక!’
-
విజయవాడలో భారీ వర్షం.. పరిశీలించిన మంత్రి నారాయణ
-
ఈవీఎంలు ‘బ్లాక్ బాక్స్’లాంటివి.. మస్క్ ట్వీట్ వేళ రాహుల్ కీలక వ్యాఖ్యలు
-
ఎన్నికల్లో గెలిస్తే.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా: ట్రంప్
-
రోజుకు 14 గంటల పని.. చేతులపై కాలిన గాయాలు.. 58 మంది బాలకార్మికులకు విముక్తి!
-
ఐర్లాండ్ను ఆదుకున్న డెలానీ, లిటిల్.. పాకిస్థాన్ లక్ష్యం 107