ఈ ‘బాదుడు’ పేరేమి!
రాజమహేంద్రవరం పేపర్మిల్లు ప్రాంతంలోని ఓ సెలూన్ దుకాణం.. విద్యుత్తు శాఖ సిబ్బంది వచ్చి నిర్వాహకుడికి ఓ నోటీసు ఇచ్చారు. ఏమిటిదని ప్రశ్నించగా మీరు వినియోగిస్తున్న విద్యుత్తు లోడ్ పెరిగినందున రూ.2500 డిపాజిట్ రుసుము కట్టాలని సూచించారు.
విద్యుత్తు అదనపు వినియోగం పేరిట నోటీసులు
ఇప్పటికే ఛార్జీలతో ఇబ్బందిపడుతున్నామన్న వినియోగదారులు
ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్టుడే, దేవీచౌక్
రాజమహేంద్రవరం పేపర్మిల్లు ప్రాంతంలోని ఓ సెలూన్ దుకాణం.. విద్యుత్తు శాఖ సిబ్బంది వచ్చి నిర్వాహకుడికి ఓ నోటీసు ఇచ్చారు. ఏమిటిదని ప్రశ్నించగా మీరు వినియోగిస్తున్న విద్యుత్తు లోడ్ పెరిగినందున రూ.2500 డిపాజిట్ రుసుము కట్టాలని సూచించారు. తన దుకాణంలో ఒక ఫ్యాన్, ఏసీ మాత్రమే ఉన్నాయని.. 1 కేవీ నుంచి 2కేవీ లోడ్ పెరిగిందని చెప్పి ఇలా డిపాజిట్ కట్టమనడం ఏమిటని ఆయన వాపోయారు. ఇప్పటికే రూ.వేలల్లో బిల్లులు చెల్లిస్తున్నామని, ఇప్పుడు అదనపు బాదుడేమిటని ప్రశ్నించారు. మీకొక్కరికే కాదని అదనపు వినియోగం ఉన్నవారందరికీ ఇస్తున్నామని చెప్పి సిబ్బంది వెళ్లిపోయారు.
ఇప్పటికే ట్రూఅప్, ఇతర ఛార్జీల పేరిట కొన్నేళ్లుగా వినియోగదారులపై భారం మోపి ముక్కుపిండి వసూలు చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా అదనపు వినియోగం పేరిట కొందరికి నోటీసులు జారీ చేస్తూ హడలెత్తిస్తోంది. నోటీసులు అందుకున్న 30 రోజుల్లో చెల్లించకపోతే సరఫరా నిలిపేస్తామని సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. రూ.వేలల్లో ఉన్న నోటీసులు చూసి.. ఇలా అయితే వ్యాపారాలు చేయలేమని, నష్టాల్లో ఉన్నామని చిరు వ్యాపారులు అంటున్నారు.
10,860 మందిపై కేసులు.. రూ.5.90 కోట్ల వసూళ్లే లక్ష్యం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధిక విద్యుత్తు వినియోగం పేరిట విద్యుత్తు శాఖ అధికారులు తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. రాజమహేంద్రవరం విద్యుత్తు సర్కిల్ పరిధిలో 1,79,157 కనెక్షన్లు ఉన్నాయి. వేసవిలో విద్యుత్తు వాడకం ఎలానూ పెరిగింది. ఇప్పుడిదే ఆ శాఖకు కల్పతరువుగా మారింది. అధికంగా వాడుతున్నవారి వివరాలు సేకరించారు. సిబ్బంది ఆయా ఇళ్లకు, వ్యాపారుల వద్దకు వెళ్లి తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 20,331 సర్వీసులను తనిఖీ చేసి 10,860 మంది అధిక విద్యుత్తు వాడుతున్నారన్న కారణంతో కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు 10,742 మందికి నోటీసులు జారీ చేశారు. వీరంతా సుమారు రూ.5.90 కోట్ల మేర అదనంగా విద్యుత్తు సంస్థకు 30 రోజుల్లో చెల్లించాలని సూచించారు. ఇప్పటికే 3514 మంది రూ.1.90 కోట్ల మేర చెల్లించారు. ఏళ్ల తరబడి ఉన్న ఉపకరణాలే వినియోగిస్తున్నా ఇప్పుడే ఎందుకు నోటీసులు ఇస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విధానాల వల్ల సంస్థ ఆదాయం పెరుగుతుందేమో గానీ, సామాన్యుడిపై భారం పడుతోందని వాపోతున్నారు.
అభ్యంతరాలుంటే చెప్పవచ్చట..
కేసులు, డిమాండ్ నోటీసుల జారీ విషయమై ఆ శాఖ ఉన్నతాధికారి వద్ద ప్రస్తావించగా.. వినియోగదారుడి బిల్లుల ఆధారంగా, అతను వినియోగించే లోడ్ మేరకు తనిఖీలు చేసి అనుమతి పొందిన మొత్తం కంటే ఎక్కువ వాడితే నోటీసులు ఇస్తున్నామన్నారు. వాటిలో అవాస్తవాలున్నా, ఆ స్థాయిలో వినియోగించడం లేదని నిరూపిస్తే దానిని రద్దు చేస్తామన్నారు. సరఫరాకు మించి వినియోగం ఉంటే సమస్యలు తలెత్తుతాయని, భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు, అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకే ఈ ప్రక్రియ చేపట్టామని చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పర్యటనకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు
[ 16-06-2024]
సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి అధికారులను ఆదేశించారు. -
కూటమి ప్రభుత్వ సహకారంతో ఎతిపోతల అభివృద్ధి
[ 16-06-2024]
పార్టీలకు అతీతంగా రైతులంతా ఎత్తిపోతల అభివృద్ధికి కృషి చేయాలని చాగల్లు జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అల్లూరి విక్రమాదిత్య తెలిపారు. -
శ్రీలక్ష్మీ నరసింహ స్వామి సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి
[ 16-06-2024]
అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు దర్శించుకున్నారు. -
మానసిక దివ్యాంగుల పాఠశాలలో ఫాదర్స్ డే వేడుకలు
[ 16-06-2024]
రోటరీ క్లబ్ నిడవోలు అధ్యక్షుడు కీర్తి ఆంజనేయులు ఆధ్వర్యంలో మానసిక దివ్యాంగుల పాఠశాలలో ఫాదర్స్డే వేడుకలు నిర్వహించారు. -
శ్రీకోట సత్తెమ్మ అమ్మవారిని దర్శించుకున్న జిల్లా సూపరింటెండెంట్
[ 16-06-2024]
మండలంలోని తిమ్మరాజుపాలెం గ్రామంంలో కొలువై ఉన్న శ్రీకోటసత్తెమ్మ అమ్మవారిని తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ పి.జగదీశ్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. -
నాన్నంటే నాన్నే
[ 16-06-2024]
నాన్నంటే ఇష్టంగా మోసే బాధ్యత.. వెన్నంటి నడిచే ధైర్యం.. ఊహకందని త్యాగం.. నడత నేర్పే గురువు.. తన జీవితాన్నే మనకోసం ధారబోసే మహోన్నతుడు. -
మానసిక సంఘర్షణ.. మృత్యుమార్గాన..
[ 16-06-2024]
ఆ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నత చదువులు చదివారు. మహానగరాల్లో ఉద్యోగాలు చేశారు. పదేళ్ల క్రితం తండ్రి చనిపోవడం.. తల్లి అనారోగ్యం బారిన పడటంతో ఇంటికొచ్చేశారు. -
అమ్మా.. నన్ను క్షమించు
[ 16-06-2024]
‘అమ్మా.. నన్ను క్షమించు. నా స్నేహితుడు శ్రీను.. వాళ్ల మావయ్య మోసం చేశాడు. రూ.35 లక్షలు ఇవ్వాలి. -
కొమ్మనాపల్లిలో అదుపులోకి రాని అతిసారం
[ 16-06-2024]
కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో ప్రబలిన (అతిసారం) మూడోరోజుకూ పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. గ్రామంలోని మరో 28 మంది శనివారం కూడా అస్వస్థత బారిన పడ్డారు. -
వెంకన్న వేడుక చూద్దాం రండి
[ 16-06-2024]
పవిత్ర వైనతేయ నదీ తీరంలో కొలువైన అప్పనపల్లి బాలబాలాజీస్వామివారి ఆలయం ఉత్సవ శోభను సంతరించుకుంది. -
అన్నదాత ఆత్మ సంకల్పానికి దెబ్బ
[ 16-06-2024]
పుడమి తల్లిని నమ్ముకుని ఆరుగాలం శ్రమించే అన్నదాతకు అడుగడుగునా సమస్యలే. విత్తు వేసింది మొదలు.. దిగుబడి వచ్చే వరకు, ఆ తర్వాత కూడా అనేక సవాళ్లు. -
అక్కడ కూలినా.. ఇక్కడ వేళ్లూనేలా..
[ 16-06-2024]
దశాబ్దాల క్రితం నాటి ఓ రావిచెట్టు కాకినాడ బాలాత్రిపుర సుందరి దేవాలయం రహదారిలో గురువారం కూలిపోయిన విషయం తెలిసిందే. -
పూలబాట పరిచిన పాదాలకు పుష్పాభిషేకం
[ 16-06-2024]
కాకినాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో శనివారం ఫాదర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ తండ్రులపై చిన్నారులు పూలు చల్లి ఆశీర్వచనం తీసుకున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
చంద్రబాబు పోలవరం సందర్శన .. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి రామానాయుడు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అల్లర్ల గురించి పిల్లలకు బోధించడం ఎందుకు?: ఎన్సీఈఆర్టీ చీఫ్
-
స్మృతి మంధాన సెంచరీ.. దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించిన భారత్
-
ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనపై తొలి ట్రయల్ రన్.. వీడియో
-
పేటీఎం - జొమాటో రూ.1,500 కోట్ల డీల్?