logo

‘జనసేనకు ప్రజల ఆదరణ’

జనసేన పార్టీకి రానున్న రోజుల్లో ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఆ పార్టీ ఉమ్మడి తూ.గో.జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Published : 03 Feb 2023 06:04 IST

యర్రంశెట్టివారిపాలెంలో మాట్లాడుతున్న కందుల దుర్గేష్‌

పి.గన్నవరం, న్యూస్‌టుడే: జనసేన పార్టీకి రానున్న రోజుల్లో ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఆ పార్టీ ఉమ్మడి తూ.గో.జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. పి.గన్నవరం మండలంలోని యర్రంశెట్టివారిపాలెంలో గురువారం వీరభద్రస్వామి వారి ఆలయంలో ప్రత్యేకపూజలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 10 నుంచి పార్టీ క్రియాశీలక సభ్యత్వాల నమోదు ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రజలు జనసేనకు మద్దతు పలుకుతున్నారన్నారు.అమలాపురం పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి డీఎంఆర్‌ శేఖర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు శిరిగినీడి వెంకటేశ్వరరావు, నాయకులు పితాని బాలకృష్ణ, సాధనాల శ్రీనివాసరావు, యల్లమిల్లి కృష్ణవేణి  పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని