logo

Rajamahendravaram: రుడా పరిధిలో మరో 65 గ్రామాలు విలీనం

రాజమహేంద్రవరం పట్టణాభివృద్ధి సంస్థ(రుడా) పరిధిలోకి మరో 65 గ్రామాలను విలీనం చేస్తూ పురపాలకశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Published : 29 Mar 2023 14:15 IST

అమరావతి: రాజమహేంద్రవరం పట్టణాభివృద్ధి సంస్థ (రుడా) పరిధిలోకి మరో 65 గ్రామాలను విలీనం చేస్తూ ఏపీ పురపాలకశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రామచంద్రాపురం, గన్నవరం, రాయవరం, కపిలేశ్వరపురం మండలాల్లోని గ్రామాలు రుడాలో విలీనయ్యాయి. దాదాపు 338 చ.కి.మీ ప్రాంతాన్ని విలీనం చేస్తూ పురపాలకశాఖ నోటిఫికేషన్‌ ఇచ్చింది. విలీనమైన నాలుగు మండలాలతో కలిపి రుడా పరిధి 3,142 చ.కి.మీకు పెరిగింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని