logo

‘గాజువాకలో జరిగిన తప్పు.. పిఠాపురంలో జరగకూడదు’

‘‘గత ఎన్నికల్లో గాజువాకలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను గెలిపించుకోకుండా తప్పు చేశాం.. పిఠాపురంలో మళ్లీ ఆ తప్పు జరగకూడదు’’ అని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులు, గాజువాక ప్రజలు నినదించారు.

Published : 09 May 2024 04:44 IST

ప్రచారం చేస్తున్న స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులు

కొత్తపల్లి, న్యూస్‌టుడే: ‘‘గత ఎన్నికల్లో గాజువాకలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను గెలిపించుకోకుండా తప్పు చేశాం.. పిఠాపురంలో మళ్లీ ఆ తప్పు జరగకూడదు’’ అని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులు, గాజువాక ప్రజలు నినదించారు. బుధవారం విశాఖ నుంచి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని యు.కొత్తపల్లి మండలానికి చేరుకున్న వారు కొత్తపల్లిలో పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి పవన్‌ను గెలిపించాలని కోరారు. 150 మంది వరకు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. పవన్‌కల్యాణ్‌ గాజువాక నుంచి పోటీ చేసినప్పుడు గెలిపించుకోలేక పోయామని, పిఠాపురం ప్రజానీకô అలాంటి పొరపాటు చేయొద్దన్నారు. పవన్‌ లాంటి వ్యక్తి పాలకుడైతే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. స్టీల్‌ప్లాంట్‌ సమస్యపై మొట్టమొదటిసారి గళం వినిపించిన వ్యక్తి పవన్‌కల్యాణ్‌ అని చెప్పారు. ఆ రోజుల్లో గాజువాక నుంచి గెలిపించుకుని ఉంటే స్టీల్‌ప్లాంట్‌ సమస్య పరిష్కారమయ్యేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని