వైకాపా, కూటమి శ్రేణుల ప్రచారంలో ఉద్రిక్తత
పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం చెందుర్తిలో బుధవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. వైకాపా, కూటమి శ్రేణులు ఒకేసారి ప్రచారానికి రావడంతో ఈ సమస్య ఏర్పడగా.. డప్పు కళాకారుడిపై స్థానిక ఎస్సై చేయి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది..
డప్పు కళాకారుడిపై చేయి చేసుకున్న ఎస్సై
కూటమి నాయకులు, కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు
గొల్లప్రోలు, న్యూస్టుడే: పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం చెందుర్తిలో బుధవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. వైకాపా, కూటమి శ్రేణులు ఒకేసారి ప్రచారానికి రావడంతో ఈ సమస్య ఏర్పడగా.. డప్పు కళాకారుడిపై స్థానిక ఎస్సై చేయి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది.. వైకాపాకు అనుకూలంగా ప్రవర్తిస్తూ, తమను మాత్రమే పోలీసులు అడ్డుకుని కొట్టడంపై కూటమి శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశారు.. వివరాల్లోకి వెళితే.. చెందుర్తిలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వంగా గీత ఆపార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ప్రచారం చేస్తుండగా.. కూటమి శ్రేణులు మరోవైపు ప్రచారం చేపట్టారు. ఓ సందర్భంలో రెండువర్గాలు ఎదురెదురుగా వస్తుండటాన్ని గమనించిన పోలీసులు కూటమి శ్రేణులను అడ్డుకున్నారు. వారిని ప్రధాన రహదారిపైనే నిలిపేసి, వైకాపా ప్రచార ర్యాలీని ఒక వీధిలోకి పంపించారు. ఇదే సమయంలో కూటమి తరఫున ప్రచారానికి వచ్చిన డప్పు కళాకారుడు మణికంఠపై, గొల్లప్రోలు ఎస్సై బాలాజి చేయి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. కూటమి ప్రచార విషయంలో పోలీసులు తీరుపై ఎన్నికల అధికారులకు ఫి‡ర్యాదు చేస్తామని జనసేన నాయకుడు, న్యాయవాది కొంజర్ల అప్పారావు తెలిపారు. తనపై ఎస్సై దాడి చేశారని మణికంఠ ‘న్యూస్టుడే’కు తెలిపారు. తొలుత డప్పు కర్ర లాగేసుకున్నారని.. అనంతరం చెంపపై కొట్టారని చెప్పారు. ఎస్సై బాలాజీతో మాట్లాడగా.. తానెవరినీ కొట్టలేదన్నారు. డప్పు శబ్దాలకు మాటలు వినిపించడం లేదని.. ఆపాలంటూ గట్టిగా మందలించినట్లు స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మ ఆరోగ్యం బాలేదు..!
[ 20-05-2024]
జిల్లాలో రక్తహీనత కేసులు కొన్నాళ్లుగా అధికంగా నమోదవుతున్నాయి. ప్రధానంగా గర్భిణుల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటోంది. పౌష్టికాహార లోపం, అనారోగ్య సమస్యల కారణంగా ఎక్కువ మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. -
అంతులేని ఆక్రమణలు
[ 20-05-2024]
ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్న ప్రబుద్ధుల కళ్లు ఇప్పుడు కాలువల గర్భాలపై పడింది. కాలువల్లోనే రెండంతస్తుల శాశ్వత భవనాలను సైతం నిర్మించేస్తున్నారు. ఇప్పటివరకు కాలువ గట్లను ఆక్రమించి దుకాణాలు నిర్మించుకోవడం వంటి చర్యలకు పాల్పడేవారు. -
పరిణయం.. పరమానందం
[ 20-05-2024]
పురుషోత్తముడు... మీసాలరాయుడు.. త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన అన్నవరం సత్యదేవుడు... పెళ్లికుమారుడిగా సౌభాగ్యదాయిని... సంతోషకారిణి.. అనంతలక్ష్మీ అమ్మవారు పెళ్లికుమార్తెగా.. ఆశీనులైన వేళ.. ఆ కల్యాణ వేడుక కనులారా వీక్షించిన భక్తజనం పులకించిపోయారు. -
కూటమి జట్టులో జోష్
[ 20-05-2024]
సార్వత్రిక సమరంలో ఓటు చైతన్యం కూటమి అభ్యర్థుల్లో కొత్త జోష్ నింపింది. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదవ్వడంతో తమకు కలిసివస్తుందనే ధీమా అందరిలో వ్యక్తమవుతోంది. వైకాపా అయిదేళ్ల పాలనలో వైఫల్యాలకు ప్రజలు విసిగిపోయారని.. -
ఈసారీ నాణ్యతకు పరీక్షే!
[ 20-05-2024]
జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో సమీకృత వ్యవసాయ ప్రయోగశాలలు (ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్) నేటికీ అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రతి వ్యవసాయ సీజన్లోనూ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్షలకు ఇబ్బందులు తప్పడం లేదు. -
వంతెనల సమీపంలో తవ్వకాలే లేవట!
[ 20-05-2024]
గోదావరిలో ఇసుక తవ్వకాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయట.. వంతెనలకు 500 మీటర్ల దూరంలో తవ్వకాలే లేవట.. ఇవీ జిల్లా యంత్రాగమంతా ఆదివారం రేవుల్లో పర్యటించి తేల్చిన విషయం. -
నిరీక్షించి.. నీరసించి..
[ 20-05-2024]
రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలో వైద్యసేవలు అందాలంటే రోగులకు నిరీక్షణ తప్పడం లేదు. ఓపీ చీటీ రాయించుకోవడం మొదలు.. వైద్యుడికి చూపించుకోవడం, వైద్య పరీక్షలు, అవసరమైన స్కానింగులు, -
పిఠాపురం, కాకినాడ నగర నియోజకవర్గాలపై నిఘా..?
[ 20-05-2024]
రాష్ట్రంలో పోలింగ్ అనంతరం పలు నియోజకవర్గాల్లో జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. -
పొగాకు పంటకు పండగ
[ 20-05-2024]
ఎన్నో ఆటుపోట్లు మధ్య పండించిన వర్జీనియా పొగాకు పంట అమ్మకాలు జోరందుకున్నాయి. రోజురోజుకూ ధర పెరగడంతో పొగాకు రైతులు వేలం కేంద్రానికి బేళ్లను తరలిస్తున్నారు. -
థాయిలాండ్లో కోనసీమ కుర్రోడి జోష్
[ 20-05-2024]
థాయ్లాండ్లో ఆదివారం ఉదయం జరిగిన ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో భారత డబుల్స్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిల జోడీ విజయం సాధించింది. -
శాశ్వత పరిష్కారం ఎన్నటికో?
[ 20-05-2024]
బ్యాంక్ కెనాల్ ఎగదన్నడం, భారీ వర్షాల వల్ల ప్రతి సార్వా(ఖరీఫ్) సమయంలో లొల్ల, వాడపల్లి ఆయకట్టు పంట పొలాలు ఏటా ముంపుబారిన పడుతున్నాయి. ఏళ్లతరబడి అదే పరిస్థితి ఉంటున్నా పట్టించుకునే నాధుడు లేడు. -
బస్సు దగ్ధం
[ 20-05-2024]
నడుస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. బస్సు డ్రైవర్ అప్రమత్తం చేయడంతో ప్రాణాలు దక్కించుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐఆర్జీసీకి ఆప్తుడు.. ఎవరీ హొస్సేన్ అమీర్ అబ్దొల్లహియన్
-
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!
-
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
-
ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి
-
ప్రాసిక్యూటర్ టు ప్రెసిడెంట్: ఎవరీ ఇబ్రహీం రైసీ..?
-
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు