నివురుగప్పిన నిప్పులా విభేదాలు
పల్నాడు పల్లెల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఫ్యాక్షనిజం కోరలు చాస్తోంది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఒక్కప్పుడు ఫ్యాక్షనిజంతో గ్రామాలకు గ్రామాలే తుడిచి పెట్టుకుపోయాయి. రాజకీయ ఆధిపత్యం సాగుతున్న మాచర్ల, గురజాల నియోజకవర్గాల
పల్నాడులో కోరలు చాస్తున్న ఫ్యాక్షనిజం
మాచర్ల, న్యూస్టుడే: పల్నాడు పల్లెల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఫ్యాక్షనిజం కోరలు చాస్తోంది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఒక్కప్పుడు ఫ్యాక్షనిజంతో గ్రామాలకు గ్రామాలే తుడిచి పెట్టుకుపోయాయి. రాజకీయ ఆధిపత్యం సాగుతున్న మాచర్ల, గురజాల నియోజకవర్గాల పరిధిలో ప్రస్తుతం పట్టపగలు జరుగుతున్న దాడులు భీతిగొల్పుతున్నాయి. మాచర్లలో గతంలో బుద్దా వెంకన్న, బోండా ఉమాపై జరిగిన దాడి తర్వాత అనేక సంఘటనలు పల్నాడులో చోటుచేసుకున్నాయి. మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, దాచేపల్లి, మాచవరం మండలాలతోపాటు, పలుచోట్ల పగలే దాడులు జరగడం గమనార్హం. తెదేపాతోపాటు, వైకాపాలో ఉన్న ఆధిపత్య విభేదాలు హత్యలకు దారితీస్తున్నాయి. దుర్గి మండలం ఆత్మకూరు, జంగమహేశ్వరపాడులో 2019 ఎన్నికల తర్వాత తెదేపాకు చెందిన పలువురు గ్రామాలను వదిలివెళ్లారు. ఇప్పటికీ జంగమహేశ్వరపాడులో చాలా గృహాలకు తాళాలు వేసి ఉంటున్నాయి. పోలీసుల పహారా కొనసాగుతోంది. వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డి గూడెంలో వైకాపాలో చేరిన తెదేపా నాయకులకు, వైకాపాలో ఎప్పటి నుంచో ఉంటున్న నేతల మధ్య ఆధిపత్య పోరు వివాదం రెండు హత్యలు, గృహ దహనాలకు దారితీసింది. తాజాగా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తెదేపా నేత చంద్రయ్య హత్య జరిగింది.
ఆధిపత్యం కోసం..
మాచర్ల, న్యూస్టుడే: జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు పల్నాడులోనే అధికం. ఆధిపత్యం కోసం దాడులు, ప్రతిదాడులు చేసుకోవడం ఇక్కడ పరిపాటైంది. అధికార పార్టీ నేతలు ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో పెత్తనం చేసేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో పల్నాడులోని పోలీస్స్టేషన్లలో విధులు నిర్వహించేందుకు అధికారులు ఆసక్తి చూపడం లేదు. గురజాల డివిజన్ పరిధి మాచర్ల, గురజాల నియోజకవర్గాలోని తొమ్మిది మండలాల్లోని పోలీస్స్టేషన్లలో పలు గ్రామాలు సమస్యాత్మకంగానే ఉన్నాయి. ప్రతికార దాడులు పట్టపగలే జరుగుతుండటం, వీటిపై పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో నేరాల సంఖ్య పెరుగుతోంది. సంఘటన జరిగే ప్రాంతాలు పోలీస్స్టేషన్లకు సమీపంలోనే ఉంటున్నా, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వివాదాలకు కారణమవుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్న స్టేషన్లలో సిబ్బంది కొరత ఉంటోంది. మాచర్ల పోలీస్స్టేషన్ పరిశీలిస్తే సీఐతోపాటు, నలుగురు ఎస్సైలు ఉండాలి. ప్రస్తుతం ఇద్దరు మహిళా ఎస్సైలు, ఒకరు పదోన్నతిపై వచ్చిన ఎస్సై ఉన్నారు. ఇక్కడ బదిలీపై వెళ్లిన ఎస్సై స్థానంలో ఇంతవరకు మరొకరిని నియమించలేదు. ఇక వెల్దుర్తి మండలం నియోజకవర్గానికి చాలా కీలకం. ఇక్కడ సున్నితగ్రామాలు చాలా ఉన్నాయి. నాలుగు నెలలుగా ఈ మండలం చూసే ఎస్సై లేకపోవడం గమనార్హం.
నిఘా నీడలో గుండ్లపాడు
తెదేపా నేత తోట చంద్రయ్య(42) హత్య జరిగిన వెల్దుర్తి మండలం గుండ్లపాడులో పోలీసులు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులకు అవకాశం లేకుండా పోలీసు బలగాలు మోహరించాయి. వీధుల వెంట పోలీసులు తిరుగుతూ జనం గుమిగూడకుండా పంపిస్తున్నారు. తెదేపా, వైకాపా నాయకుల నివాసాలు వద్ద భద్రతా ఏర్పాట్లు చేశారు.
గుండ్లపాడులో మకాం వేసిన పోలీసు బలగాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలకులు కా‘పాడి’న పాపాన పోలేదు
[ 27-04-2024]
లీటరు పాలకు రూ.4 బోనస్ ఇస్తానని, పాడి రైతులను ఆదుకుంటానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి హామీలు అమలు చేయకపోగా అమలులో ఉన్న పథకాలు రద్దు చేశారు. -
26 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
బాపట్ల లోక్సభ, జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 150 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
తెదేపా గూటికి మాజీ మంత్రి డొక్కా
[ 27-04-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దళితుల్లో సీనియర్ నేత, గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
బరిలో మిగిలేదెవరో?
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల సమర్పణ, పరిశీలన కార్యక్రమం ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు గుర్తింపు, నమోదైన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేశారు. -
‘భూ’మంతర్ ఖాళీ
[ 27-04-2024]
రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో భూముల రీసర్వే నిర్వహిస్తున్నాం. భూవివాదాలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తాం. -
ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని మా లక్ష్యం
[ 27-04-2024]
-
గంజాయి బ్యాచ్ ఆగడాలపై నిరసన
[ 27-04-2024]
గంజాయి బ్యాచ్ ఆగడాలు భరించలేకున్నామంటూ.. వారిపై చర్యలు తీసుకోవాని శుక్రవారం రాత్రి గుంటూరు రాజీవ్గాంధీనగర్ వాసులు నిరసన తెలిపారు. -
నేత.. మొక్కల్లో మేత!
[ 27-04-2024]
అధికారమే అండగా ఆ ప్రజాప్రతినిధి కుటుంబం గుంటూరు నగరాన్ని చెరపట్టి మరీ దోచుకుంది. అల్లుడికి రోడ్లు, డ్రెయిన్ల కాంట్రాక్టు పనులు ఇప్పించుకోవడానికే పరిమితం కాలేదు. -
నిధులు నింపుకోవడానికి మేమే దొరికామా!
[ 27-04-2024]
ఎ.ఎన్.యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికంగా దివాళ తీసే పరిస్థితిలో ఉందని, అందువల్లే మే 1 నుంచి ప్రారంభమయ్యే బీఈడీ పరీక్షలకు అదనంగా డబ్బులు చెల్లించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. -
నాకు తెలియదు.. నాకు తెలియదు
[ 27-04-2024]
పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ భార్య, కుమార్తె ఆస్తుల వివరాలను అఫిడవిట్లో ఎందుకు పొందుపరచలేదని కూటమి నాయకులు ప్రశ్నిస్తే.. నాకు తెలియదు.. నాకు తెలియదు.. చెప్పడం ఏమిటిని పలువురు తప్పుపడుతున్నారు. -
‘బీసీలను నట్టేట ముంచిన జగన్’
[ 27-04-2024]
‘బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి జగన్ నమ్మక ద్రోహం చేశారు. -
గురువులపై బోధనేతర విధుల భారం
[ 27-04-2024]
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలే నేరుగా విమర్శలు గుప్పించాయి. -
భూ కక్ష
[ 27-04-2024]
మండలంలోని సమగ్ర భూ సర్వేకు గత ఏడాది ఏప్రిల్లో రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నూరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో అక్షాంశ, రేఖాంశాల సహితంగా ప్రతి ఒక్కరి పొలానికి పక్కా సరిహద్దులు నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు.