‘కలెక్టరేట్ ముట్టడి’కి పోలీసు ఆంక్షలు
గురువారం తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనవద్దని ఉపాధ్యాయ సంఘాల నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఫోన్లు చేసి అడ్రస్లు తెలుసుకుని ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు.
గురజాలలో ఉపాధ్యాయ సంఘ నేతకు నోటీసు అందజేస్తున్న పోలీసు సిబ్బంది
గురజాల, న్యూస్టుడే: గురువారం తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనవద్దని ఉపాధ్యాయ సంఘాల నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఫోన్లు చేసి అడ్రస్లు తెలుసుకుని ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. చలో కలెక్టరేట్ ముట్టడికి ఎటువంటి అనుమతులు లేవని నోటీసులో పేర్కొన్నారు. కార్యక్రమంలో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున, శాంతిభద్రతల దృష్ట్యా మిమ్మల్ని ఇంట్లోనే ఉండాల్సిందిగా తెలియజేయడమైనదని, పోలీసు వారికి సహకరించగలరని కోరారు. నోటీసు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని అందులో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలకు, పలువురు ఉపాధ్యాయులకు నోటీసులు అందజేశారు.
అందజేసిన నోటీసు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్