Andhra News: తండ్రీకుమారుల దాడి.. వార్డు వాలంటీర్ మృతి
తన దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు వార్డు వాలంటీర్పై తండ్రీకుమారులు దాడి చేసిన
తెనాలి: తన దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు వార్డు వాలంటీర్పై తండ్రీకుమారులు దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలోని మారిస్పేటలో చోటుచేసుకుంది. ఈ దాడిలో వాలంటీర్ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలి పట్టణంలోని 24వ వార్డుకు వాలంటీర్గా పనిచేస్తున్న సందీప్ (22) నుంచి ఓ బాలుడు రెండు నెలల క్రితం రూ.2 వేలు అప్పుగా తీసుకున్నాడు. తమకు డబ్బులు అవసరమయ్యాయని తిరిగి ఇవ్వాలని వాలంటీర్ అడగగా బాలుడు దురుసుగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో గొడవ జరగడంతో మాటా మాటా పెరిగి ఇరువైపులా దాడి చేసుకున్నారు.
ఈ క్రమంలో బాలుడు, అతడి తండ్రి వెంకటేశ్వర్లు సందీప్ గుండెపై బలంగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలాడు. స్థానికులు హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే సందీప్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని బంధువులు మారిస్పేటలోని తమ ఇంటికి తీసుకెళ్లారు. సందీప్ తండ్రి ఇదివరకే మృతి చెందారని.. తల్లికి మాటలు రావని స్థానికులు తెలిపారు. కుటుంబ పోషణ సందీపే చూసుకుంటున్నాడని.. ఓ పక్క వాలంటీర్గా ఉంటూ ఖాళీ సమయాల్లో ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్