విజయవాడ వైకాపాలో అసంతృప్త జ్వాలలు
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైకాపాలో అసంతృప్త జ్వాలలు బయటపడుతున్నాయి. 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి భర్త దుర్గారావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో శనివారం ఓ పోస్టు ప్రత్యక్షమైంది....
రాజీనామా చేస్తున్నట్టు పోస్టుపెట్టిన కార్పొరేటర్ భర్త
ఎమ్మెల్యే వెలంపల్లితో పొసగకే నిర్ణయం
ఈనాడు, అమరావతి: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైకాపాలో అసంతృప్త జ్వాలలు బయటపడుతున్నాయి. 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి భర్త దుర్గారావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో శనివారం ఓ పోస్టు ప్రత్యక్షమైంది. ‘2009 నుంచి 2022 వరకు మీ నాయకత్వంలో సుదీర్ఘ ప్రయాణం చేశాను. మీరు అన్ని రకాలుగా నాకు ఉపయోగపడుతూ మేలు చేశారు. అందుకే మీకు నా కుటుంబసభ్యులు, నేను శిరస్సు వంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోజు నుంచి నేను వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నాను.’ అంటూ ఎన్టీఆర్ జిల్లా వైకాపా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్కు దుర్గారావు తన పేరుతో రాసినట్టుగా ఉన్న ఈ పోస్టును వాట్సాప్ గ్రూపుల్లో కనిపించింది. దీనిపై దుర్గారావును ‘ఈనాడు’ వివరణ కోరగా.. తాను అసంతృప్తిలో ఉన్న మాట వాస్తవమేనన్నారు. తమ విషయంలో పక్షపాతం చూపించడం, ఏ పనికీ సహకరించకపోవడంతో తాము పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. గత మూడేళ్లుగా తమను పార్టీలో నిర్లక్ష్యం చేస్తుండడంతో రాజీనామా చేసే యోచనలో ఉన్నామన్నారు. దీనిపై వచ్చే బుధవారం పార్టీ శ్రేణులతో సమావేశమై అధికారికంగా నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. తమలాగే మరికొంతమంది కూడా పశ్చిమ వైకాపాలో అసంతృప్తితో ఉన్నారని, వారంతా కలిసే నిర్ణయం తీసుకుంటామని దుర్గారావు వెల్లడించారు.
పశ్చిమ నియోజకవర్గ వైకాపాలో చాలాకాలంగా ఎమ్మెల్యే వెలంపల్లి, కొంతమంది కార్పొరేటర్ల మధ్య పొసగడం లేదు. తాజాగా దుర్గారావు ప్రకటనతో ఆ విషయం మరోసారి బయటపడింది. పశ్చిమలో కేబుల్ కనెక్షన్ వ్యాపారానికి సంబంధించి ఇద్దరు వైకాపా నేతల మధ్య కొంతకాలంగా వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ఒక నాయకుడికి అండగా ఉన్నట్టు తెలిసింది. దీంతో మరో నేత అసంతృప్తిలో ఉన్నట్టు సమాచారం. ఇదే విధంగా నియోజకవర్గంలోని 22మంది కార్పొరేటర్లలో మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు మరో ఇద్దరు, ముగ్గురికి మాత్రమే ప్రతి విషయంలో ఎమ్మెల్యే పెద్దపీట వేస్తుండడంతో మిగతా వారంతా అసంతృప్తితో ఉన్నారు. తమకు కనీసం సమస్యలు చెప్పుకునేందుకు కూడా అవకాశం లేదని, ఒకవేళ చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ పలువురు కార్పొరేటర్లు బహిరంగంగానే వాపోతున్నారు. తమ డివిజన్లో చిన్న స్పీడ్ బ్రేకరు వేయాలన్నా.. మేయర్ సంతకం చేయాలంటూ అధికారులు అంటున్నారంటూ ఓ మహిళా కార్పొరేటర్ ‘ఈనాడు’తో ఆవేదన వ్యక్తం చేశారు. ఇంక తమకు పదవులు ఉండి ఏం లాభమంటూ వాపోయారు. ఈ నేపథ్యంలోనే ఇంక భరించే ఓపిక లేదంటూ తాము ఓ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు ఆమె తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు
[ 19-05-2024]
జిల్లాలో పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన దాడులు, ప్రతిదాడులకు సంబంధించి పోలీసులు పెద్దఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. అదనపు బలగాలు రావడంతో జిల్లా మొత్తం పోలీసులు అధీనంలోకి తీసుకోవడంతో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. -
దేవుడి భూమి.. సమర్పయామి
[ 19-05-2024]
దేవుడికి సేవ చేయాల్సిన అర్చకులు ఆలయ భూమినే అమ్మేశారు. నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాల కోసం దాతలిచ్చిన భూమిని అమ్మేసి నిత్య కైంకర్యాలు నిలిపేశారు. వచ్చిన సొమ్మును సొంతానికి వాడుకున్నారు. -
పల్నాడును చూసైనా.. కళ్లు తెరవలేదు..
[ 19-05-2024]
జిల్లాలో పోలింగ్కు ముందు రోజు, ఎన్నిక రోజున పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ ఘటనల్లో కూటమి అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా వైకాపా దాడులకు తెగబడటంతో పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
క్షణక్షణం ఉత్కంఠ!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినా ఉమ్మడి గుంటూరులో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన, ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 13న జరిగిన పోలింగ్ సందర్భంగా పలు గ్రామాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. -
మద్యం దుకాణాలకు 144 సెక్షన్ వర్తించదా?
[ 19-05-2024]
ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన దాడులు, ఘర్షణల కారణంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా అయిదురోజులుగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పట్టణంలోని దుకాణాలను పూర్తిగా మూయిస్తున్నారు. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేశ్ లట్కర్
[ 19-05-2024]
పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేశ్ లట్కర్ నియమితులయ్యారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో చెలరేగిన హింసను నియంత్రించడంలో విఫలమయ్యారన్న కారణంగా జిల్లా కలెక్టర్గా ఉన్న శివశంకర్ను ఎన్నికల కమిషన్ బదిలీ చేయగా ఎస్పీ బిందుమాధవ్పై సస్పెన్షన్ వేటు వేసింది. -
ఎట్టకేలకు కదిలిన అధికారులు
[ 19-05-2024]
ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఎట్టకేలకు అధికారులు కదిలారు. అక్రమ తవ్వకాలను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు. -
ఉపాధ్యాయులకు బోధన మెలకువలపై శిక్షణ
[ 19-05-2024]
సీబీఎస్ఈ పాఠశాలల్లో పని చేస్తున్న ఆంగ్లం, సైన్స్(జీవశాస్త్రం), సోషల్ ఉపాధ్యాయులు.. తాము బోధించే పాఠ్యాంశాలపై పూర్తి అవగాహనతో ఉండాలని డీఈవో పి.శైలజ తెలిపారు. -
కరిగిన ఆశలు
[ 19-05-2024]
సాధారణంగా ఉప్పు పంటలకు ఎండలు అనుకూలం. ఉప్పు పంటను ఎండా కాలం పంటగా చెప్పాలి. ఎండల తీవ్రత బాగుంటే ఉప్పు దిగుబడులు పెరుగుతాయి. ప్రస్తుతం కురిసిన అకాల వర్షాలతో ఉప్పు రైతుకు తీరని నష్టం ఎదురైంది. -
ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులే లక్ష్యం
[ 19-05-2024]
మాతృభూమిపై మమకారంతో ఐదేళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎంతో వ్యయప్రయాసలు పడి ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులు సొంతూర్లకు వచ్చారు. -
మెట్ట ప్రాంతంలో తీరిన దాహం
[ 19-05-2024]
చుక్క నీటి కోసం విలవిల్లాడిన బొల్లాపల్లి మండలంలోని అయిదు గ్రామాలకు దాహం తీరింది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో ఊరచెరువు వాగు ఉద్ధృతంగా ప్రవహించింది. -
రైతులకు నికర ఆదాయమే లక్ష్యం
[ 19-05-2024]
కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు వ్యవసాయంలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించే కేంద్రాలుగా పని చేయడంతో పాటు నికర ఆదాయం సాధించేలా మార్గదర్శకం చేయాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి అటారి పదో జోన్ సంచాలకుడు డాక్టర్ షేక్ ఎన్.మీరా అన్నారు.