logo

10,11 తేదీల్లో గుంటూరులో ‘ఈనాడు ఆటో ఎక్స్‌పో’

మనం అనుకున్న సమయానికి గమ్యస్థానం చేరాలని, కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లడానికి అనుకూలంగా ఉంటుందని అందరం వ్యక్తిగత వాహనాలను సమకూర్చుకునేందుకు ఆసక్తి చూపుతుంటాం.

Published : 07 Dec 2022 04:21 IST


గుంటూరు, న్యూస్‌టుడే: మనం అనుకున్న సమయానికి గమ్యస్థానం చేరాలని, కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లడానికి అనుకూలంగా ఉంటుందని అందరం వ్యక్తిగత వాహనాలను సమకూర్చుకునేందుకు ఆసక్తి చూపుతుంటాం. ఇందులో భాగంగా ఎవరికి వారు స్థోమతకు తగ్గట్టుగా   ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులకు ‘ఈనాడు’ ఒక ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది. వీటి కోసం ఎక్కడెక్కడికో తిరగకుండా అన్ని రకాల వాహనాలను ఒకే వేదిక పైకి తీసుకువచ్చేలా ఆటో ఎక్స్‌పో నిర్వహిస్తుంది.

సమగ్రం ఒకే చోట: ఈ ప్రదర్శనలో పలు సంస్థలకు సంబంధించిన వాహనాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఒకేచోట లభిస్తోంది. ఏయే మోడళ్లు అందుబాటులో ఉన్నాయి? ధరలు తగ్గించి ఏమైనా ఇస్తున్నారా? ఫైనాన్స్‌ వెంటనే వస్తుందా? పాత వాహనం మార్చుకోవాలంటే ఏం చేయాలి? తదితర వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఈనెల 10, 11 తేదీల్లో నిర్వహిస్తున్న ఆటో ఎక్స్‌పో వద్దకు రావాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. ‘ఈనాడు’ ఆటో ఎక్స్‌పోలో వాహనాలు కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక రాయితీలు అందిస్తారు. కొన్ని మోడళ్ల కార్లు, ద్విచక్ర వాహనాలు తగ్గింపు ధరలకు ఇస్తున్నారు. విద్యుత్తు వాహనాలు కూడా ఈ ఎక్స్‌పోలో అందుబాటులో ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని