పల్నాట తుపాకుల సంస్కృతి తెచ్చారు
పల్నాడు జిల్లాలో వైకాపా నేతలు తుపాకుల సంస్కృతిని ప్రవేశపెట్టారని తెదేపా నేతలు మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విమర్శించారు.
బాలకోటిరెడ్డిని పరామర్శించిన తెదేపా నాయకులు
ఆసుపత్రిలో పార్టీ నేతలు ప్రత్తిపాటి, సోమిరెడ్డి, రామానాయుడు, మన్నవ మోహన్కృష్ణ తదితరులు
నరసరావుపేట అర్బన్, న్యూస్టుడే : పల్నాడు జిల్లాలో వైకాపా నేతలు తుపాకుల సంస్కృతిని ప్రవేశపెట్టారని తెదేపా నేతలు మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విమర్శించారు. నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలలో అలవాల ఘటనలో కాల్పులకు గురై ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న తెదేపా రొంపిచర్ల మండల అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిని గురువారం వారు ఆసుపత్రిలో పరామర్శించారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ మాజీ విప్ కోన రవికుమార్, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన్కృష్ణ, మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జి జూలకంటి బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడి, డాక్టర్ చదలవాడ అరవిందబాబు తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకర్లతో నేతలు మాట్లాడుతూ బాలకోటిరెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్ రక్తదాహం తీరలేదని, నరసరావుపేట నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా తుపాకులను తెచ్చి హత్యాయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అండతోనే బాలకోటిరెడ్డిపై హత్యాప్రయత్నం చేశారన్నారు. కాల్పుల ఘటనకు గంట ముందుగానే తాము తెదేపా వర్గీయులం అని సామాజిక మాధ్యమాల్లో వైకాపా నేతలు ప్రచారం చేశారన్నారు. ఇప్పటికీ బాలకోటిరెడ్డిపై ఐదుసార్లు దాడులు జరిగాయన్నారు. వైకాపా వర్గీయులే దాడి చేసి తెదేపా వర్గీయులంటూ దొంగ నాటకాలకు తెర తీశారన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పర్యవేక్షణలో ఎస్పీ రవిశంకరరెడ్డి వైఫల్యం చెందారని, ఆయన ఐపీఎస్ అధికారిలా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. తెదేపా గెలిచిన వెంటనే పోలీసులకు వీరసింహారెడ్డి సినిమా చూపుతామన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తే కచ్చితంగా ప్రతిదాడులకు దిగుతామని హెచ్చరించారు.
నాకు, మా పార్టీకి సంబంధం లేదు : ఎమ్మెల్యే
రొంపిచర్ల : అలవాలలో తెదేపా నేత బాలకోటిరెడ్డిపై జరిగిన హత్యాయత్నానికి సంబందించి తనకు గాని, తమ పార్టీకి సంబంధం లేదని వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తెదేపా నేత ఆధిపత్యపోరుతో భాగంగా సంఘటన జరిగిందన్నారు. గతంలో దాడి జరిగిన సందర్భంలో చర్చించి రాజీ చేసి ఉంటే దాడి జరిగేది కాదని ఆయన చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్