నిల్వలు లేక నిరుపయోగంగా మారిన వైనం
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కేంద్ర గిడ్డంగుల సంస్థ పరిధిలోని గోదాములకు సరకు రాకపోవడంతో రెండేళ్లుగా బోసిపోయాయి.
నిర్వహణకూ సమకూరని సొమ్ము..
సరకు నిల్వ లేక ఖాళీగా గిడ్డంగి
ఈనాడు-నరసరావుపేట, బాపట్ల: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కేంద్ర గిడ్డంగుల సంస్థ పరిధిలోని గోదాములకు సరకు రాకపోవడంతో రెండేళ్లుగా బోసిపోయాయి. లక్షల టన్నుల సామర్థ్యంతో పెదకాకాని, దుగ్గిరాల, వడ్లమూడి, సత్తెనపల్లి, గుంటూరు నగరంలో ప్రధాన రహదారుల వెంబడి భారీ గోదాములను నిర్మించారు. భారత ఆహార సంస్థ ఆధ్వర్యంలో ఆహార ధాన్యాలు నిల్వ చేయడానికి ప్రారంభంలో వీటిని నిర్మించారు. ధాన్యం, అపరాలు, జొన్నలు, మొక్కజొన్నలు, పసుపు పంట ఉత్పత్తులను శాస్త్రీయంగా నిల్వచేసేవారు. క్రమంగా ఆహారధాన్యాల సేకరణ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి రావడంతో వీటిని ప్రత్యామ్నాయాలకు వాడుకుంటూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆహారధాన్యాల సేకరణ మొదలైన తర్వాత రాష్ట్ర గోదాముల సంస్థ గోదాములు నిర్మించడం, కొంత సరకును ప్రైవేటు గోదాములకు మళ్లించడంతో కేంద్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలోని గోదాములకు సరకు రాక తగ్గిపోయింది. దీంతో ప్రస్తుతం భారీ గోదాముల్లో 15 శాతం కూడా ఆక్యుపెన్సీ(నిల్వ) లేని పరిస్థితి ఏర్పడింది.
మారుతున్న ముఖచిత్రం
ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారత ఆహార సంస్థ ధాన్యం, బియ్యం నిల్వ చేయడానికి అనుకూలంగా నిర్మించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు ఏ జిల్లా అవసరాలకు అదే జిల్లాలో ధాన్యం సేకరణ, నిల్వ, సరఫరా చేస్తుండటంతో గోదాముల అవసరం బాగా తగ్గింది. అపరాలు మొత్తం శీతల గోదాముల్లోనే నిల్వ చేస్తున్నారు. దీంతో కేంద్ర గిడ్డంగుల సంస్థ పరిధిలోని గోదాములకు సరకు వచ్చే మార్గాలు మూసుకుపోతున్నాయి. మరోవైపు ప్రైవేటు గోదాములతో పోల్చితే కేంద్ర గోదాముల్లో ఎత్తుడు, దించుడు కూలీ కొంత ఎక్కువగా ఉంటుంది. కేంద్ర గిడ్డంగులు సంస్థ కూలీలకు బీమా, ఆరోగ్యానికి సంబంధించి కొంత ఖర్చు పెడుతున్నందున హమాలీ కూలీ కింద ప్రైవేటుతో పోల్చితే కొంత అదనంగా వసూలు చేస్తారు. ఇది కూడా వ్యాపారులకు కొంత ప్రతిబంధకంగా మారింది.
నిర్వహణకు గడ్డుకాలం
కేంద్ర గిడ్డంగుల సంస్థ పరిధిలోని గోదాముల్లో సరకు ఉన్నా, లేకపోయినా అనుమతులు తీసుకోవడం, లైసెన్సు ఫీజులు చెల్లించడం, అగ్నిమాపక, స్థానిక ప్రభుత్వాల నుంచి అనుమతి తప్పనిసరి. ఇందుకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంది. దీంతోపాటు గోదాముల వద్ద వాచ్మెన్లు, సహాయకులు, నిర్వహణ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలి. 36 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గోదాములకు సంబంధించి ఏడాదికి పెదకాకాని పంచాయతీకి రూ.5లక్షలు పన్ను చెల్లిస్తున్నారు. ఇక్కడ కొందరు శాశ్వత ఉద్యోగులతోపాటు 300 మంది హమాలీలు పని చేస్తున్నారు. రెండేళ్లుగా సరకు రాకపోవడంతో హమాలీలు ప్రత్యామ్నాయంగా పనులు వెతుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది. పెదకాకానిలో 75వేల టన్నుల నిల్వ సామర్థ్యం ఉండగా 15వేల టన్నులు మాత్రమే ప్రస్తుతం నిల్వలు ఉన్నాయి. దుగ్గిరాలలో 80 శాతం, సత్తెనపల్లిలో 60 శాతం నిల్వలు ఉండగా, గుంటూరు, వడ్లమూడిలో నిల్వలు 15శాతం మించడం లేదు. గోదాముల్లో రోజూ వందల సంఖ్యలో రాకపోకలు సాగించే లారీలకు కూడా కష్టకాలం ఎదురైంది.
రైతులకు అద్దెలో 30 శాతం రాయితీ
కేంద్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలోని గోదాముల్లో రైతులు, వ్యాపారులు సరకు నిల్వ చేస్తే పలు ప్రయోజనాలు కల్పిస్తున్నాం. ఇక్కడ నిల్వచేసే సరకుకు బ్యాంకు నుంచి రుణం పొందవచ్చు. రైతులకు అయితే అద్దెలో 30 శాతం రాయితీ ఇస్తున్నాం. నిల్వ చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు బీమా సౌకర్యం ఉంది. క్రిమికీటకాలు, ఎలుకల బారి నుంచి శాస్త్రీయ పద్ధతుల్లో రక్షణ కల్పిస్తాం.
అంబేద్కర్, మేనేజరు, కేంద్ర గిడ్డంగుల సంస్థ, పెదకాకాని
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలకులు కా‘పాడి’న పాపాన పోలేదు
[ 27-04-2024]
లీటరు పాలకు రూ.4 బోనస్ ఇస్తానని, పాడి రైతులను ఆదుకుంటానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి హామీలు అమలు చేయకపోగా అమలులో ఉన్న పథకాలు రద్దు చేశారు. -
26 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
బాపట్ల లోక్సభ, జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 150 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
తెదేపా గూటికి మాజీ మంత్రి డొక్కా
[ 27-04-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దళితుల్లో సీనియర్ నేత, గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
బరిలో మిగిలేదెవరో?
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల సమర్పణ, పరిశీలన కార్యక్రమం ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు గుర్తింపు, నమోదైన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేశారు. -
‘భూ’మంతర్ ఖాళీ
[ 27-04-2024]
రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో భూముల రీసర్వే నిర్వహిస్తున్నాం. భూవివాదాలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తాం. -
ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని మా లక్ష్యం
[ 27-04-2024]
-
గంజాయి బ్యాచ్ ఆగడాలపై నిరసన
[ 27-04-2024]
గంజాయి బ్యాచ్ ఆగడాలు భరించలేకున్నామంటూ.. వారిపై చర్యలు తీసుకోవాని శుక్రవారం రాత్రి గుంటూరు రాజీవ్గాంధీనగర్ వాసులు నిరసన తెలిపారు. -
నేత.. మొక్కల్లో మేత!
[ 27-04-2024]
అధికారమే అండగా ఆ ప్రజాప్రతినిధి కుటుంబం గుంటూరు నగరాన్ని చెరపట్టి మరీ దోచుకుంది. అల్లుడికి రోడ్లు, డ్రెయిన్ల కాంట్రాక్టు పనులు ఇప్పించుకోవడానికే పరిమితం కాలేదు. -
నిధులు నింపుకోవడానికి మేమే దొరికామా!
[ 27-04-2024]
ఎ.ఎన్.యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికంగా దివాళ తీసే పరిస్థితిలో ఉందని, అందువల్లే మే 1 నుంచి ప్రారంభమయ్యే బీఈడీ పరీక్షలకు అదనంగా డబ్బులు చెల్లించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. -
నాకు తెలియదు.. నాకు తెలియదు
[ 27-04-2024]
పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ భార్య, కుమార్తె ఆస్తుల వివరాలను అఫిడవిట్లో ఎందుకు పొందుపరచలేదని కూటమి నాయకులు ప్రశ్నిస్తే.. నాకు తెలియదు.. నాకు తెలియదు.. చెప్పడం ఏమిటిని పలువురు తప్పుపడుతున్నారు. -
‘బీసీలను నట్టేట ముంచిన జగన్’
[ 27-04-2024]
‘బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి జగన్ నమ్మక ద్రోహం చేశారు. -
గురువులపై బోధనేతర విధుల భారం
[ 27-04-2024]
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలే నేరుగా విమర్శలు గుప్పించాయి. -
భూ కక్ష
[ 27-04-2024]
మండలంలోని సమగ్ర భూ సర్వేకు గత ఏడాది ఏప్రిల్లో రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నూరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో అక్షాంశ, రేఖాంశాల సహితంగా ప్రతి ఒక్కరి పొలానికి పక్కా సరిహద్దులు నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!